(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
విజయవాడ: ఆరు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైసిపి ప్రభుత్వం నాశనం చేసిందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వైసిపి ప్రభుత్వ పరిపాలనా తీరును తీవ్రంగా విమర్శించారు.
ప్రభుత్వ భవనాలకు రంగుల విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు వైసిపి నేతలు సిగ్గుపడాలన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం నిలదీతను తట్టుకోలేకే సిఎం జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని యనమల విమర్శించారు. వైసిపి ప్రభుత్వ చర్యలన్నీ ప్రజా వ్యతిరేకమేనని రుజువు చేశామన్నారు.సాక్షిలో రాసినన్నీ తప్పుడు రాతలేనని జగన్ స్వయంగా ఒప్పుకున్నారని అన్నారు.
ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోనూ దోపిడికి గేట్లు తెరిచారని ఆయన ఆరోపించారు. బలహీన వర్గాలకు అప్రధాన పదవులు కేటాయిస్తూ సొంత సామాజిక వర్గానికి కీలక పదవులు ఇస్తున్నారనీ అన్నారు. 300 లకు పైగా పదవులు రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చారని జివోల ద్వారా వెల్లడవుతోందని అన్నారు. 50శాతం పదవులు బడుగులకే అని చెప్పిన జగన్ నినాదం వంచనేనని దుయ్యబట్టారు.చివరకు సామాజిక న్యాయంలోనూ జగన్ నయవంచనకు పాల్పడుతున్నారని యనమల విమర్శించారు. అత్యాచారాలకు పాల్పడిన సొంత సామాజికవర్గం వాళ్లపై చర్యలు లేవా అని ఆయన ప్రశ్నించారు. దిశ బిల్లు తెచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో అత్యాచారాలు జరగడం సిగ్గు చేటని అన్నారు. మీడియాకు కళ్లెం వేసే జివో 2430ని తక్షణమే రద్దు చేయాలని యనమల డిమాండ్ చేశారు.
This post was last modified on December 15, 2019 3:12 pm
Mamagaru: గంగ గంగాధర్ ని తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెట్టి తనని చూసి బాధపడుతుంది. గంగాధర్ బెడ్ మీద దొర్లుతూ… Read More
Naga Panchami: పంచమి వాటర్ కోసం గదిలో నుండి కిందికి వస్తుంది.ఖరాలి తన మంత్ర శక్తిని జ్వాల జ్వాల శరీరంలోకి… Read More
Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మీ వడ్డీస్తాను మీరు తినండి అమ్మ అని నీలా… Read More
May 5: Daily Horoscope in Telugu మే 5 – చైత్ర మాసం – ఆదివారం - రోజు… Read More
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి అగ్రనేతలు వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ… Read More
Pushpa: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప 2: ది రూల్' నుంచి రిలీజ్ అయిన మొదటి… Read More
Terrorists Attack: లోక్ సభ ఎన్నికల వేళ జమ్ము – కశ్మీర్ లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలోని శశిధర్… Read More
Breaking: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి,… Read More
CM Ramesh: అనకాపల్లి జిల్లా మాడుగులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్ధి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన… Read More
Lok Sabha Elections 2024: దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి కేంద్రంలో ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి… Read More
Madhuranagarilo May 4 2024 Episode 354: చెప్పు రుక్మిణి మమ్మల్ని ఎందుకు వద్దు అంటున్నావ్ చెప్పు కారణమేంటి అని… Read More
BRS: లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరస షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు.… Read More
Malli Nindu Jabili May 4 2024 Episode 639: అరవింద్ మాటలు విని వెళ్లడానికి ఒప్పుకుంటుందా ఏంటి అని… Read More
Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: స్వర అభిషేక్ సినిమాకి బయలుదేరుతారు. అసలు మీకు బండి నడపడం… Read More
Trinayani May 4 2024 Episode 1230: నీ చావు తెలివితేటల వల్ల ఇంకొకరు చచ్చే పరిస్థితి తీసుకురాకు చిట్టి… Read More