తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. సమ్మె నుంచి వెనక్కు తగ్గేది లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ సంఘాలు పట్టు బడుతున్నాయి. అయినప్పటికీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం దిగిరాదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు 26 డిమాండ్లతో కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఇప్పటికే సమ్మె చేపట్టిన వారిలో 48,000 వేల మందిని ఆర్టీసీ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ సమ్మె ఆగదని కార్మికులు పట్టు వదలడం లేదు.
తెలంగాణ ఉద్యమానికి కీలకమైన సకల జనుల సమ్మె సాగిన సెప్టెంబర్ మాసంలోనే ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ పోరాట సమయంలో జరిగిన ఘటనలను.. ఆర్టీసీ కార్మికులు గుర్తుచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి.. తెలంగాణ ఉద్యమంలో తమ వంతు ప్రధాన పాత్ర పోషించారు. ఆర్టీసీ కార్మికులు పోరాటంలోకి రావటంతోనే సకలజనుల సమ్మె.. ఆనాటి ప్రభుత్వాన్ని వణికించింది. ఆర్టీసీ కార్మికులంతా కలిసి సరిగ్గా 30 రోజులకుపైగా తమ విధులను పక్కనపెట్టి.. బస్సులు నిలిపివేసి ఉద్యమానికి దిగారు. ఆ సమ్మె ఇక తెలంగాణ వచ్చి తీరుతుందనే విశ్వాసం ఇచ్చింది. నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ కూడా ఆర్టీసీ కార్మికుల త్యాగాలను ప్రశంసించారు. ఆర్టీసీ కార్మికులను కడుపులో దాచుకుని కాపాడుకుంటామని ఆనాడు కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉద్యమ సమయంలో నాడు తమకు సంఘీభావం తెలిపిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకత చూపుతున్నారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు అధికారమే ఎజెండాగా కేసీఆర్ వ్యవహరించారని.. ఎన్నికల ముందు హామీల మీద హామీలు గుప్పించి ఇప్పుడు కార్మికులపై బురద జల్లు తున్నారని మండిపడుతున్నారు. పండుగ సమయంలో కార్మికులు సమ్మె చేపడితే ప్రజలు ఇబ్బందులు పడతారని ప్రభుత్వానికి తెలుసు. కాని ప్రజల్లో కార్మికులను విలన్లుగా మార్చేందుకుకే వ్యూహాలు పన్నుతున్నారని కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని.. తమ వేతనాన్ని పెంచాలని కార్మికులు ఆందోళనలు చేశారు. అయితే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోగా.. వారి వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇక ఆ ఒప్పందం 2017 మార్చి 31తో ముగిసింది. అయితే గత రెండేళ్లుగా కార్మికుల వేతనాన్ని పెంచలేదు. ఈ నేపథ్యంలోనే కార్మికులు సమ్మె బాటపట్టారు. మరోవైపు ఆర్టీసీ యూనియన్లకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ తదితర విపక్ష పార్టీలు మద్దతు తెలుపడంతో ఇది రాజకీయ రంగు సంతరించుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె సకల జనుల సమ్మెగా మారుతుందని తెలంగాణ జనసమితి అధినేత కోదంరామ్ హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అందరం అండగా నిలుస్తామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని, ఆయన చప్పినట్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని కోదండరామ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చేందుకు అఖిల పక్ష నాయకులు నిర్ణయం తీసుకున్నారు. 2011లో సకల జనుల సమ్మె కూడ సెప్టెంబర్ మాసంలోనే ప్రారంభమైంది. అదే ఏడాది అక్టోబర్ 24వ తేదీన సమ్మె ముగిసింది. ఉద్యమంలో సకల జనుల సమ్మె ఏ రకమైన పాత్ర పోషించిందో… నేడు ఆర్టీసీని రక్షించుకొనేందుకు తమ సమ్మె కూడ అదే రకమైన పాత్ర పోషించే అవకాశం ఉందని ఆర్టీసీ జేఎసీ నేతలు అంటున్నారు.
This post was last modified on October 10, 2019 10:54 am
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More
Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More
Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More
Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More
Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More
Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More