MAA Elections: అక్కడ ఉన్నది కేవలం 900 ఓట్లు మాత్రమే.. కానీ ఒక నియోజకవర్గానికి మించి, ఒక జిల్లాకు మించి, రాష్ట్ర స్థాయిలో రాజకీయ ఆసక్తి మొత్తం సిని(మా) ఎన్నికలపై పడింది. దానికి కారణం అంతర్గతంగా కులాలు, రాజకీయ నాయకులు, పార్టీల పెద్దలు సినీ పరిశ్రమలో తలదూర్చడమే. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రెండు రాజకీయ పార్టీల మధ్య వైరంగా మారియి. గతంలో ఎప్పుడూ కూడా ఇలా లేదు. గతంలో మా ఎన్నికలు ఇంత ప్రతిష్టాత్మకంగా జరిగిన దాఖలాలు లేవు. రెండేళ్ల క్రితం అంటే 2019లో జరిగిన మా ఎన్నికలు కాస్త సీరియస్ గానే జరిగాయి. నరేష్, జీవితా రాజశేఖర్, నాగబాబు తదితరులు పోటీలో ఉన్న నేపథ్యంలో దారుణంగా విమర్శలు, వ్యాఖ్యలు చేసుకున్నప్పటికీ ఇంత ప్రతిష్టాత్మకం కాలేదు. ఇప్పుడు ఆ ఎన్నికలకు మించి చాలా రసవత్తరంగా మారాయి. ఒకరికి ఒకరు బజారుకు ఈడ్డుకుని, పరస్పరం వ్యక్తిగత దూషణలతో మా ఎన్నికలను వేడెక్కిస్తున్నారు.
సరే..దీనికి చిరంజీవి పెద్దరికానికి ఏమైనా లింక్ ఉందా అనేది కశ్చితంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు ఒక పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేరు. దాదాపు మూడు దశాబ్దాల పాటు దాసరి నారాయణరావు గారు తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండేవాళ్లు. ఎందుకంటే ఆయన రెండు తరాల హీరోలకు దర్శకత్వం వహించి వాళ్లకు మంచి హిట్లు ఇచ్చారు. కాపు సామాజిక వర్గం తరపున డైరెక్టర్ గా ఎదిగి అన్ని సామాజిక వర్గాలను కలుపుకున్నారు. ఆయన ఎన్టీఆర్, ఎఎన్ఆర్, కృష్ణ, సోభన్ బాబు, మోహన్ బాబు, చిరంజీవి లాంటి అగ్ర నటులతో సినిమాలు తీశారు. దీంతో ఆయన పెద్దరికం అలా నిలబడింది. దాదాపు 25 సంవత్సరాల పాటు తెలుగు చిత్ర సీమకు పెద్ద తరహాగా ఉన్నారు. దాసరి నారాయణరావు తరువాత సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు అంటూ లేదు. ఇప్పుడు కృష్ణ, కృష్ణంరాజుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ వారి వయసు అయిపోయింది. చిరంజీవి పేరు వినబడుతోంది. అయితే ఆయనను పెద్ద దిక్కుగా అంగీకరించేందుకు మోహన్ బాబు లాంటి వాళ్లు సిద్ధంగా లేరు. మోహన్ బాబు, రాజశేఖర్, బాలకృష్ణ లాంటి వాళ్లు సమకాలికులు కావడంతో ఈగో క్లాష్ మూలంగా చిరంజీవి పెద్దరికాన్ని అంగీకరించే పరిస్థితిలో లేరు. సినీ చరిష్మా చూసుకున్నా, ఫ్యాన్స్ బేస్ లో చూసుకున్నా చిరంజీవికి పెద్దరికం అప్పగించవచ్చు. కానీ చిరంజీవి వ్యక్తిత్వం వల్ల గతంలో రాజకీయంగా దెబ్బతిన్న కారణంగా ఆయన సినీ పరిశ్రమకు కొంత కాలం దూరమై రాజకీయాలు నడిపిన కారణంగా ఆయన పెద్దిరికాన్ని మిగిలినవాళ్లు అంగీకరించే పరిస్థితి లేదు. సో..అందుకే మా ఎన్నికలు ఇప్పుడు అంత ప్రతిష్టాత్మకం అయ్యాయి.
ఒక వైపు కాపు సామాజిక వర్గం అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్, మరో వైపు కాపు సామాజిక వర్గానికి వీళ్లే బ్రాండ్. మొదటి సినీ ఇండ్రస్టీలో కమ్మ సామాజిక వర్గందే పెత్తనంగా ఉండేది. ఎన్టీఆర్ గానీ, ఎఎన్ఆర్ గానీ, కృష్ణ వీళ్లందరిదీ. ఆ తరువాత దాసరి నారాయణరావు గారు అల్లు రామలింగయ్య ద్వారా చిరంజీవి ఎంటర్ కావడంతో కాపు సామాజిక వర్గానికి పెత్తనం వచ్చేలా చేశారు. దీంతో రెండు సామాజిక వర్గాలు సినీ ఇండస్ట్రీలో భాగంగా ఉన్నాయి. సామాజిక వర్గాల విషయాన్ని పక్కన బెట్టి పార్టీల విషయం గురించి మాట్లాడుకుంటే.. ఇటువైపు ప్రకాశ్ రాజ్ కు పవన్ కళ్యాణ్ సపోర్టు ఇచ్చారు. రిపబ్లిక్ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ లోకల్, నాన్ లోకల్ అనే ఫీలింగ్ లు చూడవద్దు, కేవలం వ్యక్తులను మాత్రమే చూసి ఓట్లు వేయండి అనే విధంగా చెప్పారు. అదే సందర్భంలో మోహన్ బాబును విమర్శించారు. మీరు మద్దతు ఇచ్చిన పార్టీ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతోంది, మీరు బయటకు వచ్చి మాట్లాడండి అంటూ సూచించారు. ఇటువైపు మోహన్ బాబు ఆయనకు కౌంటర్ ఇచ్చి ముందు మీరు ఆబ్బాయికి ఓట్లు వేయండి ఆ తరువాత మనం మాట్లాడదాం అన్నారు. సో..ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రకాశ్ రాజ్ గారికి చిరంజీవి వర్గం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇటువైపు వర్గం మొత్తం ఉన్నట్లే.
మరో పక్క మోహన్ బాబు కుమారుడు విష్ణుకు ప్రత్యక్షంగా అయితే లేదు కానీ పరోక్షంగా వైసీపీ సపోర్టు ఉంది. ఆ టాక్ వచ్చిన నేపథ్యంలో ఇటీవల మంత్రి పేర్ని నాని దీనిపై కౌంటర్ ఇచ్చారు. మా ఎన్నికలకు తమ పార్టీకి, ప్రభుత్వానికి, సీఎం జగన్ కు సంబంధం లేదు, వాళ్లు వాళ్లు చేసుకుంటున్నారు అని వివరణ ఇచ్చారు. కానీ విష్ణు ఏమిచెప్పారంటే జగన్మోహనరెడ్డి నాకు స్వయనా బావ, వైసీపీ మద్దతు నాకు ఉంది అని చెప్పారు. కాగా విష్ణు తండ్రి మోహన్ బాబు వైసీపీ కుండువా కప్పుకొని గత ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. సో..ఇక్కడ వైసీపీ వర్సెస్ జనసేన అని చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ ఎలాగో రాజకీయంగా ఫెయిల్ అయిన చిరంజీవికి మా ఎన్నికల్లో అయినా సరే తన ప్రాభవం, తన తమ్ముడి ప్రాభవం దక్కాలి అంటే తన పెద్దరికం, పరువు నిలబడాలంటే తాము పరోక్షంగా మద్దతు ఇచ్చిన ప్రకాశ్ రాజ్ గెలవాలి. గెలవకపోతే ఆయన పెద్దరికానికి, ఆయన పరువుకు, ఆయన చరిష్మాకు, ఆయన సీనియారిటీకి విలువ లేనట్టే. అందుకే ఆయన పరువుతో ఈ పరీక్ష జరుగుతున్నట్లు చెప్పుకోవచ్చు.
This post was last modified on October 5, 2021 6:14 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More