తనదైన శైలిలో చేసే ప్రత్యేక కామెంట్లకు సైతం కొడాలి నాని పెట్టింది పేరు. తాజాగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా వెళతాం.. ఎవరినైనా ఢీ కొడతాం.. అదరం.. బెదరం.. అని కొడాలి నాని పేర్కొన్నారు. “భారత దేశంలో ఏ వ్యవస్ధ అయినా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని రాజ్యాంగంలోనే ఉంది, అయితే కొన్ని వ్యవస్ధలు కొంతమంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం వాటిలో ఉన్న చిన్నచిన్న లొసుగులను అడ్డం పెట్టుకుని ఆ వ్యవస్ధలను వారి కంట్రోల్లో పెట్టుకుని వారికి ఇష్టమైనట్లు, నచ్చినట్లు, కొంతమందికి లాభం చేకూర్చేలా పనిచేయడం, మిగిలిన వ్యవస్ధలు ఏవీ మాట్లాడకూడదు, ఏదీ చూడకూడదు, చూసినా ఎవరికీ చెప్పకూడదు, మేమే సుప్రీం, మా మాట కాదంటే.. ఈ భారతదేశంలోని 135 కోట్ల మంది ప్రజలను మేం ఏమైనా చేయగలం.. అన్న అహంకారపూరితంగా కొన్ని వ్యవస్ధలు ప్రవర్తిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులపై.. భారతదేశంలోని ప్రతి వ్యక్తికీ రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ప్రకారం.. దమ్ముగా, ధైర్యంగా మాట్లాడాల్సిన అవసరం ఈ రోజు ఆసన్నమైంది.“ అంటూ నాని స్పందించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఈ రోజు వరకూ జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే రాష్ట్ర, దేశ ప్రజలకు పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని కొడాలి నాని అన్నారు. “జగన్ అధికారంలోకి రాకముందు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. చంద్రబాబునాయుడు, ఆయన బినామీలు వేల ఎకరాలు రాజధాని ప్రకటనకు ముందే కొని లబ్దిపొందారు. ఆ ప్రాంతంలో వారి ఆస్తులను కాపాడుకోవడానికి రాష్ట్ర సంపద అంతా అక్కడే పెట్టి వారి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వారి ఆస్తుల విలువ పెంచుకునే ప్రయత్నం చేశారు. దీనిపై అప్పుడే వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, విచారణ చేసి దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వారిని చట్టం ముందు, ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం అని స్పష్టంగా చెప్పాం. దానికనుగుణంగా ఈరోజు విచారణ చేస్తాం.. అంటే చంద్రబాబు బెదిరిపోతున్నాడు.“ అంటూ నాని ఎద్దేవా చేశారు.
మీకు దమ్ముంటే సీబీఐ వేయి, సిట్ వేయి, సీఐడీ, ఏసీబీ ఎంక్వైరీలు వేయండి .. అంటూ గతంలో ఇదే చంద్రబాబు సొల్లుకబుర్లు చెప్పి బీరాలు పలికాడు అంటూ కొడాలి నాని ఫైరయ్యారు. “చంద్రబాబు నాయుడు సవాళ్ళు, ఛాలెంజ్ లు నిజమే అనుకుని, అతను నిజాయితీ నిరూపించుకునేందుకు ఒక అవకాశం ఇద్దామని జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘం, సిట్ ఏర్పాటు చేశారు. రాజధాని ప్రకటనకు ముందే ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా.. అమరావతి ప్రాంతంలో ఎవరెవరు భూములు కొన్నారు, ఎక్కడెక్కడ భూములు కొన్నారు, ఎన్ని వేల ఎకరాలలో చంద్రబాబు బినామీలు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు.. అన్న అంశాలపై నిపుణుల కమిటీ కూలంకుషంగా మార్చిలో ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది“ అంటూ వివరించారు.
క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని, సీబీఐ ఎంక్వైరీ చేయమని సీఎం వైఎస్ జగన్ కేంద్రానికి లేఖ రాయడంతో పాటుగా ప్రధానమంత్రిని కూడా అడిగారని కొడాలి నాని తెలిపారు. “ఆరునెలలైనా వారు స్పందించకపోతే, ఏసీబీ ఎంక్వైరీ చేసి కేసులు కట్టమంటే… ఏసీబీ ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి వ్యక్తి దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకి వెళ్ళి నన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు, నా పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది, కాబట్టి ఈ చార్జిషీట్ను, ఎంక్వైరీనిని నిలుపుదల చేయండి అంటూ హైకోర్టుకు వెళితే.. గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు. మేం దొంగలం, మమ్మల్ని క్షమించండి జగన్ గారూ.. అని టీడీపీ చవటలు మందే ఏడవవచ్చు కదా.. గతంలో కూడా చంద్రబాబు ఇలాంటి దొంగ పనులు చేసి రాజశేఖర్రెడ్డి గారి ఇంటికి తెల్లవారుజామున వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని నన్ను వదిలేయ్ మహాప్రభూ అని వేడుకున్నది నిజం కాదా…?. అలాగే చీకట్లో చిదంబరం కాళ్ళను పట్టుకున్నట్లు, రాజశేఖర్రెడ్డి గారి కాళ్ళను పట్టుకున్నట్లు, జగన్ కాళ్ళు కూడా పట్టుకుంటే పోయేది కదా, అది చేయలేదు, ప్రగల్భాలు పలికారు“ అంటూ కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తమకు న్యాయస్ధానాలు అంటే నమ్మకం ఉందని కొడాలి నాని తెలిపారు. “మీడియా అంటే నమ్మకం ఉంది, ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉంది, అధికారులు అంటే నమ్మకం ఉంది. ప్రస్తుత అంశాన్ని సుప్రింకోర్టులో తేల్చుకుంటాం, అవసరమైతే ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చకు పెట్టి దీంట్లో ఇన్వాల్వ్ అయిన వారు ఎంత పెద్దవారైనా సరే, మాకు ఏమవుతుంది, మేం ఏం అవుతాం అని ఆలోచించకుండా, రాష్ట్ర భవిష్యత్ను, ఇక్కడ ఉన్న పేదల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఎవరినైనా ఢీకొట్టడానికి జగన్ సిద్దంగా ఉన్నారు. ఇలాంటి ఉడత ఊపులకు, చిన్న చిన్న అడ్డకుంలకు జగన్ అదరరు, బెదరరు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అదరదు, బెదరదు.“ అని వెల్లడించారు.
పెట్రోల్, డీజిల్ సెస్ పెంచడం వల్ల ప్రజలనెత్తిన బాంబు వేశారన్న వార్తలపై నాని మండిపడ్డారు. “ఈనాడులో మా ప్రభుత్వంపై వార్త రాశారు, మరి మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆరు, ఏడు నెలల్లో పది రూపాయలు పెంచారు, ఎందుకు రాయలేదు? కనీసం గుడివాడ డివిజన్ పేపర్లో కూడా ఎందుకు రాయలేదు? మోడీ తాటతీస్తాడని భయమా? చంద్రబాబు హయాంలో పెట్రోల్, డిజిల్పై రాజధాని పేరుతో రెండు రూపాయల సెస్సు వేస్తానన్నప్పుడు మీ గుడ్డి పేపర్లకు, మీ గుడ్డి టీవీలకు కనిపించలేదా..! అప్పుడు రాజధాని కోసం గొప్పగా ఇంకో రెండు రూపాయిలు వేయమని జనం అడుగుతున్నారని రాసినప్పుడు సిగ్గు అనిపించలేదా!?“ అంటూ దుమ్మెత్తిపోశారు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని కొడాలి నాని అన్నారు. “చంద్రబాబుకు అంటే కరోనా భయం, లోకేష్ ట్విట్టర్లో ఎందుకుంటాడు? ప్రజల్లోకి రావచ్చు కదా? ఆయనో అసమర్ధుడు, చవట, మూడు శాఖలిచ్చినా మంగళగిరిలో గెలవలేకపోయాడు.“ అంటూ విరుచుకుపడ్డారు.
This post was last modified on September 19, 2020 8:07 pm
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More