Mohan Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మోహన్ బాబు వైసీపీ నుండి దూరం జరిగారా బీజేపీ నుండి ఆహ్వానం వస్తే వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఏబిఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో మోహన్ బాబు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత ఆ పార్టీలో చేరిన మోహన్ బాబు 1995 నుండి ఆరు సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుడుగా బాధ్యతలు నిర్వహించారు. గత ఎన్నికల ముందు టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. అయితే ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మోహన్ బాబు వైసీపీకి దూరంగా ఉన్నారు. ప్రధాన మంత్రి మోడీ ఆహ్వానం మేరకు 2020లో కుమారులు, కుమార్తెతో కలిసి ఢిల్లీ వెళ్లి మోడీ అతిధ్యాన్ని స్వీకరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ చైర్మన్ రేసులో మోహన్ బాబు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు. నామినేటెడ్ పదవులు ఆశించి వైసీపీలో చేరలేదనీ, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ను చూడాలన్న ఆశతోనే వైసీపీలో చేరి తన వంతు కృషి చేసినట్లు తెలిపారు. అయితే ఉన్నత విద్యావ్యవస్థలో నెలకొన్న సమస్యలపై మోహన్ బాబు సూచనలను సైతం ప్రభుత్వం పట్టించుకోలేదని సమాచారం. ఈ విషయాలను పక్కన బెడితే మోహన్ బాబు తన ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు.
మళ్లీ రాజకీయాల్లోకి రానని పేర్కొన్న మోహన్ బాబు 99 శాతం రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లేనని పేర్కొన్నారు. ఆ ఒక్క శాతం ఎందుకన్న ప్రశ్నపై మోడీ కోసం అన్నట్లుగా సమాధానం చెప్పారు. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన కుటుంబాన్ని ఢిల్లీకి ఆహ్వానించిన విషయాన్ని మోహన్ బాబు గుర్తు చేస్తూ నాడు ఢిల్లీలో పీఎం మోడీ ఇది నీ ఇల్లే అనుకో, ఎప్పుడైనా రావచ్చు అని అప్యాయంగా చెప్పారని వివరించారు. అందుకే ఒక వేళ ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆ ఒక్క శాతం మాత్రం అవకాశం ఉందని మోహన్ బాబు తెలిపారు. అంటే మోడీ ఆహ్వానిస్తే 2024 ఎన్నికల నాటికి మోహన్ బాబు కాషాయం కండువా కప్పుకోవడానికి సిద్ధం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఇదే సందర్భంలో తమ ప్రాణ స్నేహితుడు రజనీకాంత్ కు రాజకీయాల్లోకి వెళ్లొద్దని సలహా ఇచ్చానని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. తన సలహా మేరకే రాజనీకాంత్ కూడా ఆ తరువాత అంగీకరించారని మోహన్ బాబు పేర్కొన్నారు.
ఇక ఏపి రాజకీయాలపై మాట్లాడుతూ తనకు చంద్రబాబు, వైఎస్ జగన్ ఇద్దరూ బంధువులేనని పేర్కొన్నారు మోహన్ బాబు. గతంలో చంద్రబాబుకు కూడా ఎన్నికల సమయంలో ప్రచారం చేశాననీ, జగన్ కు కూడా ఓ సారి ప్రచారం చేద్దామన్న ఉద్దేశంతో గత ఎన్నికల్లో వైసీపీలో చేరి ఆ పార్టీ తరుపున పని చేసినట్లు వివరించారు. అంతకు మించి తాను ఏ ప్రయోజనం ఆశించి జగన్ కు ప్రచారం చేయలేదని మోహన్ బాబు అన్నారు. ఐఏఎస్ అధికారుల్లో కొందరు చంద్రబాబు హయాం నుండి పని చేస్తున్న వారు ఉన్నారని పేర్కొన్న మోహన్ బాబు కొందరు సీఎం జగన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కొందరు ఐఏఎస్ అధికారులు తప్పుడు సలహాలు ఇవ్వడం వల్లనే రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థల విధానం దెబ్బతిన్నదని ఆరోపించారు.
This post was last modified on October 4, 2021 3:00 am
Rahul Gandhi: తన తండ్రి రాజీవ్ గాంధీకి, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు లాంటి వాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… Read More
AP Elections 2024: ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో… Read More
YS Vijayamma: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మార్చి 27న ఇడుపులపాయ నుండి ఎన్నికల ప్రచార బస్సు యాత్ర… Read More
Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More
Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More
Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More
Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More
Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More
Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More
ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More
రాజకీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవచ్చు. ప్రజలను ప్రసన్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా పట్టొచ్చు. కానీ, అతిగా… Read More
ఎన్నికల సమయంలో నాయకులు ఆచి తూచి వ్యవహరించాలి. వారికి ఉన్న అనుభవం అంతా రంగరిం చాల్సిన సమయం ఎన్నికల వేళే.… Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రత్యక్షంగా.. పరోక్షంగా సీఎం జగన్ కెలికేశారు. ఆయన వల్లే ఏపీలో కాంగ్రెస్పార్టీ ఎన్నికల్లో బలం పుంజుకుందనే… Read More
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. 2005లో చిత్ర పరిశ్రమలోకి… Read More