అదేసమయంలో ఆయనకు ఇక్కడి కిడ్నీ వ్యాధి గ్రస్థులు కూడా కనిపించారు. దీంతో పవన్ ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంపై పోరాటం చేస్తానని చెప్పారు. గత ఏడాది ఎన్నికలకు ముందు.. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న సమయంలో పవన్ వ్యూహాత్మకంగా ఉత్తరాంధ్రలో పర్యటించారు. అక్కడి ప్రజలను పలకరించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుపై ఉన్న చరిత్రను తవ్వి పోశారు.
దీంతో అక్కడి వారందరూ కూడా ఇంకేముంది.. ఉత్తరాంధ్రకు ఒక నాయకుడు లభించాడని అనుకున్నారు. ఈ సమయంలో పవన్ దెబ్బతో తమ ఓటు బ్యాంకు ఎక్కడ గల్లంతవుతుందోనన్న దెబ్బతో శ్రీకాకుళాన్ని తితలీ తుఫాన్ ముంచెత్తినప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు నేరుగా శ్రీకాకుళంలోనే మకాం వేసి.. అక్కడే ఉన్నారు. తుఫాను సాయం అందించారు. మరి ఇలాంటి ఉత్తరాంధ్ర ప్రేమికుడైన పవన్ ఇప్పుడు మౌనం ఎందుకు పాటిస్తున్నారు. అక్కడి ప్రజలకు సీఎం జగన్ మంచి చేస్తానంటే.. ఎందుకు చేయమని ప్రోత్సహించడం లేదు. విశాఖలో పాలనా రాజధానిని ఏర్పాటు చేస్తానంటే.. ఎందుకు వద్దంటున్నారు? అనేది పవన్కు చుట్టుముడుతున్న ప్రశ్నలు. పైగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కూడా పవన్ డిమాండ్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎందుకు ఆయన ఇలా ఉత్తరాంధ్రపై శీతకన్ను వేశారు? అనేది ప్రశ్న. దీనివెనుక గత ఏడాది ఎన్నికల ఫలితాల ప్రభావం ఉందని అంటున్నారు పరిశీలకులు.
గత ఏడాది ఎన్నికలలో ఉత్తరాంధ్రలో గాజువాక నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేశారు. అదేవిధంగా విశాఖ ఎంపీగా మాజీ జేడీ లక్ష్మీనారాయణకు అవకాశం ఇచ్చారు. ఇంకా చాలా మంది నేతలనే ఉత్తరాంధ్రలో పోటీకి పెట్టారు. వీరిలో కనీసం సగంమందైనా గెలుస్తారని అనుకున్నారు.చివరకు పవన్ కల్యాణే ఓడిపోయారు.అక్కడి ప్రజానాడి ఓట్ల రూపంలో తెలిసే సరికి పవన్ ఒక్కసారిగా మనసు మార్చుకున్నారని అంటున్నారు. ఇక, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉత్తరాంధ్ర మొహం కూడా పవన్ చూడకపోవడం గమనార్హం. తనకు కోస్తా అయితేనే బెటర్ అనుకుంటున్నారని తాజాగా వార్తలు వస్తున్నాయి. రేపు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. కోస్తాలో తనకు సీట్లు ఎక్కువ తీసుకుని ఉత్తరాంధ్రను బీజేపీకి గుండుగుత్తుగా ఇచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు పరిశీలకులు.అసలు పవన్ కల్యాన్ ది నిలకడలేని మనస్తత్వం.ముందొకసారి అనంతపూర్ జిల్లాలో పోటీకి అడుగుతానన్నారు చివరకు ఏలూరన్నారు. చివరకొచ్చేసరికి భీమవరం, గాజువాకలో పోటీ చేశారు.ఫలితం మనందరికీ తెలిసిందే.అయినా రాజకీయ నాయకుడన్న వాడు ప్రజల నాడి పట్టుకోవాలి గాని వారిపై అలిగితే ఒరిగేది శూన్యమని రాజకీయ పరిశీలకులు పవన్ కల్యాణ్ కి హితవు చెబుతున్నారు.
This post was last modified on July 30, 2020 9:36 am
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More