ఈ చర్యలతో అప్పటి వరకూ ఆ నియోజకవర్గంలో ఎడ మొహం, పెడ మొహంగా ఉంటూ వస్తున్న నియోజకవర్గ వైసిపి ఇన్ చార్జి యార్లగడ్డ వెంకట్రావు, సీనియర్ నేత దుట్టా రామచంద్రరావులు ఒకటి అయ్యారు. వంశీ చర్యల పట్ల వారు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు మీడియా ముందుకు వచ్చి వంశీని ఉద్దేశించి తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. తాను 40 ఏళ్లుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో సన్నిహితంగా ఉన్నాననీ, వైసిపి ఆరంభం నుండి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాననిి పేర్కొన్నారు. వంశీ పదేళ్లు టిడిపిలో ఉన్న సమయంలో వైసిపి కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఇప్పుడు వంశీ వెంట పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇస్తూ తొలి నుండి వైసిపికి పని చేసిన కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. గన్నవరంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తానే పోటీ చేస్తాననీ, రౌడీలు, ప్యాక్షనిస్టులకు తాను భయపడనని పేర్కొన్నారు. తనకు యార్లగడ్డతో ఎటువంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. ఇటీవల కాలం వరకూ గన్నవరం ఎన్నికలు వస్తే వైసిపి తరపున దుట్టా రామచంద్రరావు అల్లుడు శివభరత్ రెడ్డి పోటీ చేయనున్నారని ప్రచారం చేస్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన దీనిపై మాట్లాడుతూ శివభరత్ రెడ్డికి పదవులు అవసరం లేదన్నారు. తానే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో ఒ సంచలన వ్యాఖ్య చేశారు. మరో 15 రోజుల్లో పార్టీ కార్యకర్తలకు ఓ చల్లని కబురు పార్టీ అధిష్టానం నుండి అందుతుందని చెప్పారు. దీంతో ఆ చల్లటి కబురు ఏంటి రాజకీయంగా చర్చ జరుగుతున్నది. సిఎం వైఎస్ జగన్ దుట్టాకు ఏమైనా హామీ ఇచ్చారా, ప్రస్తుత నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న యార్లగడ్డకు కెడిసిసి చైర్మన్ పదవి ఇచ్చినందున నియోజకవర్గ పార్టీ బాధ్యతలను దుట్టాకు అప్పగిస్తారని ఏమైనా హామీ ఇచ్చారా లేక ఇంకా ఏదైనా పదవి ఇస్తానని జగన్ నుండి హామీ లభించిందా అన్న ఊహాగానాలు నియోజకవర్గంలో సాగుతున్నాయి.
అధికార పార్టీలో చక్రం తిప్పవచ్చు అని వైసిపికి దగ్గర అయిన వల్లభనేని వంశీ అవకాశం చిక్కినప్పుడల్లా టిడిపి అధినేత చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వైసిపి ప్రభుత్వాన్ని, సిఎం జగన్ ను ప్రశంసిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుత నియజకవర్గంలో జరుగుతున్న ఈ పరిమాణాలు వంశీకి తలనొప్పిగా మారాయి. గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు ఒక జట్టుగా ఉండగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒంటరి అయ్యారు. రాజీనామా చేసి ఎమ్మెల్యే మళ్లీ పోటీ చేసిన తన సత్తా చాటాలని అనుకుంటున్న ఆయన ఆశలకు ఈ పరిణామాలతో నీల్లు చల్లినట్లు అవుతోంది. వైసిపి అధిష్టానం గన్నవరం రాజకీయంపై దృష్టి సారించకపతే మూడు వర్గాలు, 33 సమస్యలుగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. నియోజకవర్గంలో వంశీకి ఇటువంటి పరిస్థితి రావడం పట్ల తెలుగు తమ్ముళ్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి గ్రూపు రాజకీయాలను వైసిపి ఏ విధంగా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.
This post was last modified on August 24, 2020 1:44 am
Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైస్ చిత్రం… Read More
Jagadhatri April 27 2024 Episode 216: కేదార్ భయపడిపోయి జగదాత్రి చెయ్యి తన నెత్తి నుంచి తీసేస్తాడు. ఎందుకు… Read More
Paluke Bangaramayenaa April 27 2024 Episode 213: ఎలుక ఉందని భయపడిపోయిన స్వర పరిగెత్తుకొచ్చి అభి పక్కన బెడ్… Read More
Brahmamudi April 27 2024 Episode 395: దుగ్గిరాల ఇంట్లో రోజుకో రచ్చ జరుగుతూనే ఉంది. నిన్న కావ్య మీడియా… Read More
Naga Panchami: గరుడ రాజు తన గరుడ శక్తిని ఖరాలికి ఆవాహన చేస్తాడు. కరాలి ధన్యోస్మి గరుడ రాజా అంటుంది.… Read More
Mamagaru: అవును వదిన ఇక్కడ ఉంటున్నామనే కానీ తింటే తినబుద్ది అవదు పడుకుంటే పడకో బుద్ధి కాదు అక్కడ ఉంటే… Read More
Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతి గురించి విక్కి ఆలోచిస్తూ ఉంటాడు. అటుగా వచ్చిన ఆర్య రేపు… Read More
Krishna Mukunda Murari April 27 2024 Episode 456: కృష్ణ హాస్పిటల్ కి వెళ్లి నిజం తెలుసుకోవాలి అని… Read More
April 27: Daily Horoscope in Telugu ఏప్రిల్ 27 – చైత్ర మాసం – శనివారం - రోజు… Read More
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప 2' మూవీ తెరకెక్కుతోంది. 2021లో వచ్చిన… Read More
Lok sabha Elections 2024: లోక్సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన… Read More
Varun Tej: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న విషయం… Read More
JD Lakshminarayana: జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు.… Read More
Breaking: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమను… Read More
Phone Tapping Case: తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితుల (మాజీ పోలీస్ అధికారులు)… Read More