PM Modi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు అయ్యింది. మే 3,4 తేదీల్లో ఆయన ఏపీలో పర్యటిస్తారు. 3న పీలేరు, విజయవాడలో మోడీ పర్యటిస్తారు. 4వ తేదీ రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు.
3వ తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పీలేరులో మధ్యాహ్నం 2.45 గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రదాని మోడీ ప్రసంగిస్తారు. ఆ రోజు సాయంత్రం 6.30 గంటలకు విజయవాడలో రోడ్ షోలో పాల్గొంటారు. 4వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు రాజమండ్రి సభలో పాల్గొంటారు. సాయంత్రం ఆరు గంటలకు అనకాపల్లి లో జరిగే ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాగా, ప్రధాని మోడీ రాష్ట్రంలో రోడ్ షోలు, బహిరంగ సభల నిర్వహణకు వేదికల ఖరారుపై పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది. నామినేషన్ల ప్రక్రియ గురువారంతో పూర్తి కావడంతో క్షేత్ర స్థాయిలో ప్రచారం జోరు పెంచేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సన్నాహాలు చేస్తొంది. ఏపీలో మే 13న పోలింగ్ జరగనుంది.
AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు