AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారంకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కర్మాగారంకు చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వన్ని హైకోర్టు ఆదేశించింది.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంలో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తదితరులు హైకోర్టులో పిటిషన్ లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ లపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది.
ఉక్కు కర్మాగారంకు చెందిన భూములు, యంత్రాలు, ఇతర ఆస్తులను విక్రయించబోమంటూ అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) నరసింహ శర్మ చెప్పిన వివరాలను కోర్టు రికార్డు చేసింది. విశాఖ ఉక్కు కర్మాగారం లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన వంద శాతం పెట్టుబడులను మాత్రమే ఉపసంహరిస్తున్నామని ఏఎస్ జీ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. కౌంటర్ దాఖలునకు సమయం కావాలని కోరారు. తదుపరి విచారణను జూన్ 19కి హైకోర్టు వాయిదా వేసింది.
BJP: రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు .. పీయూష్ గోయల్