Tollywood Actress: పైన ఫోటోలో అందంగా తయారై క్యూట్ గా ఫోటోకు పోజిస్తున్న చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలానికే యూత్ కి హాట్ క్రష్ గా మారింది. బాలీవుడ్ మూవీ తో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తనదైన గ్లామర్ మరియు టాలెంట్ తో తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. నిధి అగర్వాల్. అవును ఈ బ్యూటీ చైల్డ్ ఫోటోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
హైదరాబాద్ లో హిందీ మాట్లాడే మార్వాడి కుటుంబంలో జన్మించిన నిధి అగర్వాల్.. బెంగుళూరులో పెరిగింది. బిజినెస్ మేనేజ్ మెంట్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నిధి అగర్వాల్.. 2016లో టైగర్ ష్రాఫ్ యొక్క మున్న మైఖేల్ మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం 300 మంది ఆడిషన్ ఇవ్వగా నిధి సెలెక్ట్ కావడం విశేషం. ఫస్ట్ మూవీ తోనే నటన పరంగా విమర్శకుల నుంచి నిధి అగర్వాల్ ప్రతికూల సమీక్షలను అందుకుంది.
2018లో నాగచైతన్యకు జోడిగా సవ్యసాచి సినిమాలో నటించి తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. కానీ ఈ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత నాగచైతన్య తమ్ముడు అఖిల్ అక్కినేని తో మిస్టర్ మజ్ను మూవీ లో నటించింది. ఈ సినిమా కూడా విఫలమైంది. అయితే డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని తో కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో నిధికి ఫస్ట్ బ్రేక్ వచ్చింది. ఈ సినిమా విజయంతో నిధి అగర్వాల్ కు తెలుగులోనే కాకుండా కోలీవుడ్ నుంచి అవకాశాలు క్యూ కట్టాయి.
తమిళంలో నిధి అగర్వాల్ ఈశ్వరన్, భూమి, కలగ తలైవన్ వంటి సినిమాలు చేసింది. ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా నిధి మాత్రం తన అందంతో, అభినయంతో తమిళ సినీ ప్రియులకు దగ్గరైంది. అయితే సరైన సక్సెస్ రేటు లేకపోవడం వల్ల నిధి అగర్వాల్ కు ఆఫర్లు అంత జోరుగా రావడం లేదు. ప్రస్తుతం తెలుగులో నిధి రెండు క్రేజీ ప్రాజెక్టులో భాగమైంది. అందులో హరిహర వీరమల్లు ఒకటి కాగా.. మరొకటి రాజా సాబ్. ఈ రెండు సినిమాలపైనే నిధి ఆశలన్నీ ఉన్నాయి.
క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న హరి హర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎ. దయాకర్ రావు, ఏ.ఎమ్. రత్నం కలిసి ఈ పీరియాడికల్ ఫిల్మ్ ను నిర్మిస్తున్నారు. మొదటి భాగం హరి హర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ఐదు భాషల్లో 2024 చివరి నాటికి థియేటర్లలోకి రానుందని అంటున్నారు. ఇక రాజా సాబ్ విషయానికి వస్తే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రొమాంటిక్ హారర్ చిత్రం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి. జె. విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ మరియు మాళవిక మోహనన్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు.