Desha Encounter Case: దిశ ఎన్ కౌంటర్ పచ్చి బూచకమని. పోలిసులే నిందితులను కాల్చి చంపి దాన్ని ఎన్ కౌంటర్ గా కథ అల్లినట్లు సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. 2019 నవంబర్ 27న హైదరాబాద్ లో పశువైద్యురాలిని కొందరు సామూహిక అత్యాచారం చేసి హత మార్చిన ఘటనలో మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు నిందితులుగా పేర్కొని పోలీసులు నవంబర్ 29న అరెస్టు చేశారు. వారి అరెస్టు జరిగిన వారం తరువాత డిసెంబర్ 19న పోలీసుల కాల్పుల్లో వారు హతమైయ్యారు. కోర్టు అనుమతితో కస్టడీ విచారణ కొరకు నిందితులను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు డిసెంబర్ 6వ తేదీన సీన్ రీకన్సస్ట్రషన్ కొరకు ఘటనా స్థలం వద్దకు తీసుకువెళ్లారు. అయితే ఆ సమయంలో నిందితులు పోలీసుల నుండి తుపాకులు లాక్కొని కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతో తాము ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందనీ, దాంతో నిందితులు నలుగురు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. అయితే సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ జరిగిన ఎన్ కౌంటర్ పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇది ఫేక్ ఎన్ కౌంటర్ గా తేల్చారు. పోలీసులు చెప్పిన విషయాల్లో చాలా అంశాలు నమ్మలేనివి, కల్పితాలు చెప్పినట్లుగా గుర్తించారు.
*నిందితులను నవంబర్ 29న అరెస్టు చేసిన తరువాత షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో వారి నుండి నేర అంగీకార స్టేట్ మెంట్ రికార్డు చేసి జ్యూడిషియల్ కస్టడీకి పంపారు. ఆ తరువాత పది రోజుల పోలీసు కస్టడీ విచారణకు కోర్టు అనుమతి తీసుకున్నారు. నిందితులకు ప్రజల నుండి ప్రాణ హాని ఉందన్న అనుమానంతో వారిని డిసెంబర్ 5న సురక్షిత గృహానికి తరలించామని పోలీసులు పేర్కొన్నారు. అయితే నలుగురు నిందితులను ఏసీపీ సురేందర్ విచారించారని పోలీసు డైరీలో, అఫిడవిట్ లో పేర్కొనగా సదరు ఏసీపీ అక్కడకు రాలేదని ప్యానల్ గుర్తించింది. విచారణను మరోక పోలీసు అధికారి వెంకట రెడ్డి అనే అసిస్టెంట్ ఇన్వెస్టిగేటింగ్ అధికారి చేశారని పోలీసులు తర్వాత పేర్కొన్నప్పటికీ వివరణాత్మక విచారణకు తగిన రికార్డులు లేనందున ప్యానెల్ ఈ వాదనలో నిజం లేదని తేల్చింది.
*ఎన్ కౌంటర్ హత్యలను విచారిస్తున్న దర్యాప్తు అధికారి కే సురేందర్ రెడ్డి తాము స్వాధీనం చేసుకున్న దిశ వస్తువులను ఆమె సోదరి దృవీకరించినట్లు చెప్పగా ఈ విషయంలో అతను దిశ సోదరి వాంగ్మూలాన్ని నమోదు చేయలేదని కమిషన్ గుర్తించింది. దిశ వస్తువులపై అనుమానితుల వేలి ముద్రలు సేకరణ చేయలేదనీ, వాటిని ఫారెన్సిక్ పరీక్షలకు పంపలేదని సురేందర్ రెడ్డి చెప్పారు. అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసీ సజ్జనార్ డిసెంబర్ 6న ఎన్ కౌంటర్ స్థలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిశ కు సంబంధించిన వస్తువులు పొదల్లోంచి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కానీ కమిషన్ దీని గురించి ప్రస్తావించినప్పుడు దృవీకరించలేదు.
*ఘటనా స్థలంలో నిందితులు తమ కళ్లల్లో మట్టి చల్లి తప్పించుకునే ప్రయత్నం చేశారని పోలీసులు ఆరోపించారు. గణనీయ సంఖ్యలో సాయుథ పోలీసులు ఉండగా వారి కళ్లల్లో మట్టి చల్లి పారిపోయే ప్రయత్నం చేశారనేది వింతగా ఉందని ప్యానల్ పేర్కొంది. వాస్తవానికి పోలీసులు చూపిన స్థలంలో కలుపు మొక్కలతో నిండిన బీడు భూమిగా ఉండగా అక్కడ నుండి పోలీసుల అధికారుల కళ్లలోకి విసిరేంత మట్టిని తీయడం అసాధ్యమని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. అంతే కాకుండా విచారణ నివేదికలో మట్టి ప్రస్తావన లేదు,
*ఘటనా స్థలంలో అరవింద్ గౌడ్, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు పోలీసు అధికారులకు తీవ్ర గాయాలు అయినట్లు సీపీ సజ్జనార్ తెలపగా ప్యానల్ విచారణలో అనేక అనుమానాలు వచ్చాయి. గాయపడినట్లు పోలీసులను అంబులెన్స్ లో కాకుండా పోలీసు జీపులో తరలించారు. ఆసుపత్రుల్లో వారి పరీక్షలకు సంబంధించి రిపోర్టులు విరుద్దంగా ఉండటం కమిషన్ గుర్తించింది.
*నిందితులు ఆరిఫ్, చెన్నకేశవులు పోలీసుల నుండి పిస్టల్ లాక్కున్నారన్న ఆరోపణలను కమిషన్ విశ్వసించలేదు. పోలీసులు చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవని కమిషన్ విచారణలో తేలింది. పోలీసులు ఆరోపించినట్లుగా నిందితులు పోలీసు అధికారుల నుండి పారిపోతున్నప్పుడు వారిపై కాల్పులు జరపడం అసంభవమని కమిషన్ గుర్తించింది. పోలీస్ పార్టీ కాల్చిన బుల్లెట్ల వల్లనే వారు మరణించారని ప్యానెల్ నిర్ధారించింది. పోలీసులు అధికారులు ఇచ్చిన వాంగ్మూలాల్లో పలు వైరుథ్యాలను ప్యానల్ గుర్తించింది. కాల్పులు జరిపిన దూరం, ఘటనా స్థలం నుండి లభ్యమైన బుల్లెట్ లు, కాట్రిడ్జ్ ల సంఖ్య పై వ్యత్యాసాలను కమిషన్ నమోదు చేసింది.
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More