అమరావతి: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు హాట్హాట్గా మారుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపిలో చేరుతున్న తరుణంలో ఆ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు బుధవారం పరోక్షంగా వంశీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘వంశీ ఇంకా పార్టీలోకి రాలేదు. వంశీ పార్టీలోకి వస్తే అప్పుడు స్పందిస్తా, నేను పార్టీ అధినేత జగన్ విధేయుడిని, ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా, నాపై ఎటువంటి కేసులు లేవు, నాకు క్యారెక్టర్ ఉంది, పార్టీలు మారే మనిషిని కాదు, రోజుకు ఒక మాట మాట్లాడే నైజం నాది కాదు’ అంటూ యార్లగడ్డ మీడియా సమావేశంలో కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు. వంశీ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. తాను ఎవరిపైనా కేసు పెట్టించలేదని యార్లగడ్డ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు గత ఎన్నికలలో ప్రత్యర్ధులుగా ఉండి పరస్పరం తీవ్రంగా విమర్శలు చేసుకున్న వ్యక్తులు. ఆ వైరం కొనసాగుతున్నదనడానికి వెంకట్రావు మాటలే తార్కాణం. ఇలాంటి వారు ఒకే పార్టీలో కలిసి సఖ్యతగా కలిసి పని చేయడం సాధ్యమేనా? వంశీ అధికారికంగా వైసిపిలో చేరితే ఆ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా ఉన్న యార్లగడ్డ ఏమి చేస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
టిడిపి తరపున గెలిచిన వల్లభనేని ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వైసిపి అధినేత, ముఖ్యమంత్రి జగన్ వెంట నడుస్తానని కూడా ప్రకటించారు. అయితే పార్టీలో అధికారికంగా ఎప్పుడు చేరుతున్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. అయితే తెలుగుదేశం పార్టీ వంశీ రాజీనామాను ఆమోదించలేదు కానీ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వంశీ మీడియా సమావేశాల్లో వెల్లడించినప్పటికీ రాజీనామా చేసే ఆలోచన ఆయనకు లేనట్లు కనబడుతున్నది. ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఘోర పరాజయం పాలైనందుకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించారా అని కూడా ప్రశ్నిస్తున్నారు వంశీ. ఈ మాటలను బట్టి చూస్తే వైసిపికి అనుకూలంగా ఉంటూ అసెంబ్లీలో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉండాలన్న ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాల నుండి వినబడుతోంది. వైసిపిలో వంశీ చేరికను స్వాగతిస్తానని ఇప్పటికే ప్రకటించిన ఆ నియోజకవర్గ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుతో బుధవారం వంశీ భేటీ అయ్యారు.
ఈ నేపథ్యంలో పార్టీ అధినేత, సిఎం వైఎస్ జగన్ వారిద్దరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు ఏ విధంగా ప్లాన్ వేస్తారో చూడాలి.
This post was last modified on November 20, 2019 1:40 pm
Manipur: మణిపూర్ లో మరో సారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని నారసేన ప్రాంతంలో భద్రతా బలగాలపై సాయుధ మిలిటెంట్లు… Read More
Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైస్ చిత్రం… Read More
Jagadhatri April 27 2024 Episode 216: కేదార్ భయపడిపోయి జగదాత్రి చెయ్యి తన నెత్తి నుంచి తీసేస్తాడు. ఎందుకు… Read More
Paluke Bangaramayenaa April 27 2024 Episode 213: ఎలుక ఉందని భయపడిపోయిన స్వర పరిగెత్తుకొచ్చి అభి పక్కన బెడ్… Read More
Brahmamudi April 27 2024 Episode 395: దుగ్గిరాల ఇంట్లో రోజుకో రచ్చ జరుగుతూనే ఉంది. నిన్న కావ్య మీడియా… Read More
Naga Panchami: గరుడ రాజు తన గరుడ శక్తిని ఖరాలికి ఆవాహన చేస్తాడు. కరాలి ధన్యోస్మి గరుడ రాజా అంటుంది.… Read More
Mamagaru: అవును వదిన ఇక్కడ ఉంటున్నామనే కానీ తింటే తినబుద్ది అవదు పడుకుంటే పడకో బుద్ధి కాదు అక్కడ ఉంటే… Read More
Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతి గురించి విక్కి ఆలోచిస్తూ ఉంటాడు. అటుగా వచ్చిన ఆర్య రేపు… Read More
Krishna Mukunda Murari April 27 2024 Episode 456: కృష్ణ హాస్పిటల్ కి వెళ్లి నిజం తెలుసుకోవాలి అని… Read More
April 27: Daily Horoscope in Telugu ఏప్రిల్ 27 – చైత్ర మాసం – శనివారం - రోజు… Read More
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప 2' మూవీ తెరకెక్కుతోంది. 2021లో వచ్చిన… Read More
Lok sabha Elections 2024: లోక్సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన… Read More
Varun Tej: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న విషయం… Read More
JD Lakshminarayana: జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు.… Read More
Breaking: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమను… Read More