(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి మూడు రాజధానుల పేరుతో అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని వెనకేసుకొస్తున్న బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు వైఖరి వివాదాస్పదంగా తయారవుతున్నది. తాజాగా ఆయన మరో వివాదానికి తెర తీశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని పట్టుకుని వేళ్లాడితే జగన్ ప్రభుత్వానికి కూడా చంద్రబాబు ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని వ్యాఖ్యానించి ఆయన తేనెతుట్టె కదిలించారు.
ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి లేఖ రాయడం జివిఎల్కు ఆగ్రహం తెప్పించింది. జగన్ చర్యను ఆయన దుర్మార్గంగా అభివర్ణించారు. చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని జగన్ను హెచ్చరించడం రాజకీయవర్గాలను విస్మయానికి గురి చేసింది. 151 మంది శాసనసభ్యుల బలంతో సర్కారు నడుపుతున్న సిఎంను ఇంత బరి తెగించి హెచ్చరించడం దేనికి సంకేతం అని చర్చలు మొదలయ్యాయి.
ఈ నేపధ్యంలో వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గురువారం సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చే విషయం తమ పరిధిలోనే లేదనీ, దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చనీ 15వ ఆర్ధిక సంఘం నివేదికలో స్పష్టం చేసిన విషయాన్ని సభ దృష్టికి తీసుకువస్తూ విజయసాయి రెడ్డి, వాస్తవం ఇలాఉండగా కేంద్రమంత్రులు సభను తప్పు దోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.
నిజానికి ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి లేఖ రాసింది కూడా 15వ ఆర్ధిక సంఘం నివేదిక కారణంగానే. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వకపోవడానికి 14వ ఆర్ధిక సంఘం నివేదిక అనుమతించడం లేదని ఇన్నాళ్లూ బిజిపి మంత్రులూ, నేతలూ చెబుతూవచ్చారు. తాము అలాంటి సిఫారసు ఏమీ చేయలేదు మొర్రో అని ఆ ఆర్ధిక సంఘం సభ్యులు వివరించినా బిజిపి వారు ఆ బుకాయింపును విడిచిపెట్టలేదు. ఇప్పుడు 15వ ఆర్ధికసంఘం విషయం స్పష్టం చేసింది కాబట్టి ప్రత్యేకహోదా అంశం మరోసారి తెర పైకి వచ్చింది. జగన్ లేఖ రాసినందుకే బెదిరింపులకు దిగిన జివిఎల్ ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజ్యసభలో మాట్లాడినందుకు ఏమంటారో చూడాలి.
This post was last modified on February 6, 2020 10:44 pm
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More
Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More
Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More
Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More
Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More
Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More
Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More
Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ పౌచ్ బాధలు ఒక వెండి ధర నటీనటులే కాదు బుల్లితెర వారు కూడా… Read More
Aadapilla: పూర్వకాలంలో భార్య మరియు భర్తల మధ్య జరిగిన గొడవలను కేవలం నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేసేవారు. ఇక… Read More
Shoban Babu: ఆనాటి సోగ్గాడు శోభన్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శోభన్ బాబుకి మరియు కృష్ణరాజుకి… Read More
Siri Hanumanthu: టెలివిజన్ పరిశ్రమలో.. ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీలో సిరి గురించి తెలియని వారు అంటే ఉండరు అనే చెప్పుకోవచ్చు. బుల్లితెర… Read More
Tasty Teja: బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అలా ఈ కార్యక్రమం ద్వారా… Read More
వైసీపీ అగ్ర నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోటరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుంగనూరు సహా.. పీలేరు,… Read More
మెగా కుటుంబంలో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం.. ఆయన పోటీ చేస్తున్న ఉమ్మడి తూర్పు… Read More