(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఏపిలో జాతీయ పార్టీ కాంగ్రెస్ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఆ పార్టీకి నాయకత్వ లేమి స్పష్టంగా కనబడుతున్నది. రాజధాని తరలింపు అంశంపై అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దీనిపై స్పందించలేదు. దీంతో ఏపిలో కాంగ్రెస్ పార్టీ ఉందా? ఆ పార్టీ నాయకులు ఏమి చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు? అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. రాజధాని అమరావతి అంశంపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు బిజెపి, జనసేన, సిపిఐ, సిపిఎం స్పందించగా కాంగ్రెస్ పార్టీనుంచి అధికారికంగా ఒక ప్రకటన రాలేదు. దీనికి కారణం పిసిసి అధ్యక్షుడి నియామకం ఇంతవరకూ జరగకపోవడం. ఫలితంగా ఇక్కడి పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు వివరించి వారితో ప్రకటన చేయించేవారు లేకుండాపోయారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు మాత్రం అమరావతి రైతుల ఆందోళనకు సంఘీబావం తెలుపుతున్నారు.
విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహించి జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ పదవికి రాజీనామా చేయగా ఆయన బాటలోనే ఇక్కడి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సాధారణ రైతుగా వ్యవసాయ పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న ఉమెన్ చాందీ ఇప్పటి వరకూ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న నాయకులు ఇప్పటికీ కొందరు ఉన్నా నాయకత్వలేమి కారణంగా ప్రజాందోళన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఉమెన్ చాందీ రాష్ట్రంలోని పలువురు ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించినప్పటికీ పిసిసి అధ్యక్షుడి నియామకంపై ఏకాభిప్రాయానికి రాలేదు.
కనుచూపు మేరలో పార్టీకి రాజకీయ భవిష్యత్తు కనిపించే పరిస్థితులు లేకపోవడంతో పిసిసి పీఠం అధిష్టించేందుకు మెజార్టీ నాయకులు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. పార్టీకి నాయకత్వం వహించడానికి కాస్త పలుకుబడి, పరపతి ఉన్న వారు ఇష్టపడటం లేదు. కొద్ది మంది ఉత్సాహపడుతున్నా మిగిలిన వారు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. తొలుత కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజుకు పిసిసి బాధ్యతలు అప్పగిస్తున్నారని వార్తలు వచ్చినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. తరువాత మాజీ ఎంపి చింతా మోహన్, మాజీ మంత్రి శైలజానాధ్తో పాటు మహిళా నేత సుంకర పద్మశ్రీ పిసిసి రేస్లో ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి.
This post was last modified on December 28, 2019 1:36 pm
AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More
Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More