తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ.. టీఆర్ఎస్కు ఆ పార్టీ నేత, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఊహించని షాక్ ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 20 మంది స్వతంత్ర అభ్యర్థులకు ఆయన మద్దతు ప్రకటించారు. వారిని గెలిపించాలని ప్రచారం చేయడం టీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కొల్లాపూర్లో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి, మాజీ మంత్రి జూపల్లికి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కొల్లాపూర్లో రెండు వర్గాలుగా పార్టీ చీలిపోయి, రెబెల్స్ ప్రచారం చేస్తున్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో అక్కడ టీఆర్ఎస్ తరపున అభ్యర్థుల ఎంపిక, వారికి బీఫామ్లు ఇచ్చే బాధ్యతను పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకే అప్పగించారు. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జూపల్లి కృష్ణారావు… తన వర్గం వారిని కొల్లాపూర్లోని మొత్తం 20 వార్డుల్లో పోటీ పెట్టారు. వారందరినీ ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరపున సింహం గుర్తుపై పోటీకి నిలబెట్టారు. పట్టణంలో సింహం గుర్తుతో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. జూపల్లి తీరుపై ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి… ఆయనపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఫిర్యాదు చేశారు. జూపల్లి తన వర్గీయులైన 20 మంది రెబెల్స్ తరపున ప్రచారం చేస్తున్న ఫోటోలు, వీడియోలను కేటీఆర్కు పంపారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలోని ప్రజలను సింహం గుర్తుకు ఓటేయాలని, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా జూపల్లి ప్రచారం చేస్తున్నట్లు పార్టీ నేత హర్షవర్ధన్ రెడ్డి ఫిర్యాదులో ఆరోపించారు.
కొల్లాపూర్లో ఉన్న 20 వార్డులకు సైతం జూపల్లి తన వర్గీయులతో నామినేషన్ వేయించారని గురువారం(జనవరి 16) తెలంగాణ భవన్లో టెలీకాన్ఫెరెన్స్ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి కేటీఆర్కు చెప్పారు. తన వర్గం వారిని నామినేషన్లు ఉపసంహరించేలా కొద్ది రోజుల క్రితం కేటీఆర్ జూపల్లికి చెప్పినా ఆయన వినలేదని నేతలు ఆరోపిస్తున్నారు. అందరినీ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేయాలని బహిరంగంగా కొల్లాపూర్ వీధుల్లో తిరుగుతున్నారని చెప్పారు.
వాస్తవానికి గతంలోనే దీనిపై కేటీఆర్కు హర్షవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేయగా… రెబల్స్ను బరి నుంచి తప్పించాలని మంత్రి కేటీఆర్ జూపల్లిని కోరారు. అయితే నామినేషన్లు ఉపసంహరణ సమయానికి వారితో విత్ డ్రా చేయిస్తానని చెప్పిన జూపల్లి… వారంతా పోటీలో ఉండేలా చేయడం టీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం టీఆర్ఎస్ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదని జూపల్లి కృష్ణారావు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాదు తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకోవడంపై ఆయన తీవ్రంగా రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.
గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న జూపల్లి.. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో ఆపార్టీ నుంచి గెలిచి.. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ప్రస్తుతం కొల్లాపూర్ నియోజకర్గంలో జూపల్లికి, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి మధ్య ఆదిపత్య పోరు కూడా నడుస్తోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గీయులకు టికెట్లు ఇవ్వకపోడంతో వారందరినీ ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరపున రెబల్స్ గా బరిలో దింపినట్లు తెలుస్తోంది. జూపల్లి కృష్ణారావు విషయంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై జిల్లాలోని పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
This post was last modified on January 17, 2020 11:14 am
May 14: Daily Horoscope in Telugu మే 14 – వైశాఖ మాసం – మంగళవారం - రోజు… Read More
Election 2024: హింసాత్మక ఘటనల మధ్య తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ,… Read More
Sridevi Drama Company: జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఎన్నో కార్యక్రమాలలో పామిడి తరహా ఎంటర్టైన్మెంట్… Read More
Ashika Gopal: ప్రస్తుత కాలంలో ఇంస్టాగ్రామ్ స్రీల్స్ చేసేవాళ్లు యూట్యూబ్ వంటి ఇతర సోషల్ మీడియా ఎకౌంట్లో కూడా యాక్టివ్… Read More
Janaki kalaganaledu: సీరియల్ యాక్టర్ విష్ణు ప్రియా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మొదటిగా సినిమాలతో తన కెరీర్… Read More
Pavitra Jayaram: త్రినయని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచమయ్యి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఈ బ్యూటీ దూసుకుపోతుంది.… Read More
Trinayani: ప్రెసెంట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక మరణాన్ని జీర్ణించుకునే లోపే మరొక మరణంతో… Read More
Sirisha: సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు మరియు రీల్స్ చేస్తూ ఎంతోమంది నటీనటులు వెలుగులోకి వచ్చారు. వారిలో బర్రెలక్క… Read More
Video Viral: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభించారు అధికారులు.… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు క్యూ లైన్ లో… Read More
Supreme Court: లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం… Read More
Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ దర్శకుడు… Read More
Sreemukhi: టాలీవుడ్ లో ఉన్న ఫిమేల్ స్టార్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకటి. సూపర్ సింగర్ 9 అనే కార్యక్రమం… Read More
Daggubati Lakshmi: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చందు… Read More