(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
విజయవాడ: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై సీనియర్ నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పందించారు. సిఎం జగన్ పిచ్చి నిర్ణయాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. రాజధాని రైతుల పట్ల మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవహేళనగా మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో అన్ని జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. పోలీసులతో ఉద్యమాలను అణచివేయడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. మహిళలపై పోలీసులు అయితే దాడి చేయరనీ, యూనిఫామ్ ముసుగులో కొంత మంది అరాచక శక్తులు ప్రవేశించాయేమోనన్న అనుమానం కలుగుతోందనీ వడ్డే అన్నారు.
రాజ్యాంగంలోని 214 అధికరణ ప్రకారం ఒక రాష్ట్రానికి ఒక్కటే హైకోర్టు ఉండాలన్నారు. హైదరాబాదు నుండి అమరావతికి హైకోర్టు మారుస్తున్న సమయంలో రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ ఎందుకు మౌనంగా ఉన్నారనీ అప్పుడే కర్నూలులో పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయలేదని వడ్డే ప్రశ్నించారు.
అమరావతిలో రాజధాని వద్దని తాను మొదటి నుండి చెబుతున్నా నాటి చంద్రబాబు ప్రభుత్వం వినిపించుకోలేదనీ, ఇప్పటికీ తాను అమరావతికి వ్యతిరేకమేననీ వడ్డే స్పష్టం చేశారు. రాజధాని కోసం ఈ రెండు ప్రభుత్వాలు ఎంచుకున్న అమరావతి, విశాఖ జిల్లాల్లో టిడిపి, వైసిపి నేతల భూముల కొనుగోళ్లపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
విశాఖ రాజధాని తరలింపు వెనుక ప్రభుత్వం పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. టిడిపికి బలం ఎన్టిఆర్ కాగా వైసిపికి బలమే వైఎస్ఆర్ అనీ వాళ్లు మంచి పనులు చేశారు కాబట్టి ఆ పార్టీలను ప్రజలు ఆదరిస్తున్నారనీ వడ్డే అన్నారు.
చిన్న వయసులో సిఎం అయిన జగన్.. ప్రజల మన్ననలు పొందాలే కానీ శకుని మాటలు విని తెలివి తక్కువ నిర్ణయాలతో ప్రజాగ్రహానికి గురికావద్దని ఆయన సూచించారు.
This post was last modified on January 12, 2020 2:27 pm
Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More
AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More
Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More