(న్యూస్ అర్బిట్ డెస్క్)
ఆంధ్రప్రదేశ్ లో వైసిపి అధికారంలోకి రాబోతోందని జాతీయ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుందని జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. అంతా ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆదివారం సాయంత్రం వెల్లడయ్యాయి. లోక్సభ స్థానాల్లోనూ వైసిపి విజయ దుందుభి మోగించనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టిడిపికి పరాజయం తప్పదని తేల్చాయి. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది.
లోక్సభ ఎన్నికల్లో వైసిపికి 18 నుంచి 20 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. టీడీపీకి నాలుగు నుంచి ఆరు సీట్లు రావొచ్చని తెలిపింది.
ఆరా సర్వే ప్రకారం వైసిపికి 20 నుంచి 24 ఎంపీ సీట్లు రావొచ్చని తెలిపింది. టిడిపికి ఒకటి నుంచి అయిదు ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.
టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం వైసిపికి 18 సీట్లు టిడిపికి ఏడు సీట్లు రావొచ్చని అంచనా.
అసెంబ్లీ ఎన్నికల్లో…
ఆంధ్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపికి 130 నుంచి 133 వరకు సీట్లు వస్తాయని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్(సిసిఎస్) అంచనా వేసింది. టిడిపికి 43 నుంచి 44 స్థానాలు దక్కే అవకాశముందని పేర్కొంది. జనసేన పార్టీకి సున్నా నుంచి ఒక స్థానం వరకు రావొచ్చని తెలిపింది.
వైసిపికి 112, టిడిపికి 59, జనసేనకు నాలుగు అసెంబ్లీ స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. వైసిపికి 18 నుంచి 21 లోక్సభ స్థానాలు గెల్చుకునే అవకాశముందని తెలిపింది. టిడిపికి నాలుగు నుంచి ఆరు సీట్లు దక్కనున్నాయని అంచనా కట్టింది. జనసేనకు ఒక స్థానం రావొచ్చని తేల్చింది.
ఆరా సర్వేలో వైసిపికి 126 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది. టిడిపికి 47, జనసేన పార్టీకి రెండు స్థానాలు వచ్చే అవకాశముందని వెల్లడించింది.
బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి సాధారణ మెజారిటీ వస్తుందని న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఈ సర్వేలో ఎన్డీయేకు 282 నుంచి 290 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 118 నుంచి 120 సీట్లు, ఇతర ప్రాంతీయ, జాతీయ పార్టీలకు 130 నుంచి 138 సీట్లు వస్తాయని పేర్కొంది.
ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన ఎగ్జిట్ సర్వేలో వైసిపికి తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ సర్వేలో వైసిపికి 18 నుంచి 20 లోక్సభ స్థానాలు వస్తాయని, టిడిపికి నాలుగు నుంచి ఆరు స్థానాలు మాత్రమే వస్తాయని, ఇతరులకు సీట్లేమీ రావని అంచనా వేసింది.
ఏపీలో వైసిపి ప్రభంజనం ఖాయమని సిపిఎస్ సర్వే అంచనా వేసింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైసిపి 133-135 స్థానాలను గెలుపొందనుందని, అధికార టిడిపి కేవలం 37 నుంచి 40 సీట్లు మాత్రమే విజయం సాధిస్తుందని సిపిఎస్ సర్వే వెల్లడించింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ సున్నా లేదా ఒక్క స్థానం గెలిచే అవకాశముందని పేర్కొంది. వైసిపికి 50.1% శాతం ఓట్లు వస్తాయని, టిడిపికి 40.2% శాతం ఓట్లు, జనసేనకు 7.3% శాతం ఓట్లు, ఇతరులకు 2.6% శాతం ఓట్లు వస్తాయని సిపిఎస్ వెల్లడించింది.
టైమ్స్నౌ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఎన్డీయే కూటమి ఆధిక్యాన్ని సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 272 కాగా, ఎన్డీయేకు 306 సీట్లు, యూపిఏకు 132 సీట్లు, ఇతరులకు 104 సీట్లు వస్తాయని పేర్కొంది.
ఇదిలావుండగా లగడపాటి తెలుగుదేశం పార్టీకి 100 స్థానాలకు పది అటో ఇటో స్థానాలు వస్తాయని వెల్లడించారు. వైకాపాకు 72కు 7 సీట్లు అటో ఇటో వస్తాయని తెలిపారు. జనసేన, ఇతరులకు మూడు సీట్లకు రెండు సీట్లు అటూఇటుగా వస్తాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే రెండు పార్టీల మధ్య ఉంటుందని అన్నారు. తెదేపాకు ఇంచుమించు 43 శాతం ఓట్లు వస్తాయని, వైకాపాకు 41శాతం, జనసేనకు 11శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. ఈ ఓట్ల శాతంలో ఒక శాతం అటూఇటుగా ఉంటుందని చెప్పారు. ఏపీలో లోక్సభ స్థానాలపై మాట్లాడుతూ.. తెదేపాకు రెండు అటు ఇటుగా 15లోక్సభ స్థానాలు వస్తాయన్నారు. వైకాపాకు రెండు అటుఇటుగా 10 స్థానాలు రావొచ్చని అంచనావేశారు. జనసేనకు సున్నా నుంచి ఒక లోక్సభ స్థానం వచ్చే అవకాశం ఉందన్నారు
This post was last modified on May 20, 2019 1:27 pm
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More
Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More