భారత్- పాకిస్థాన్ ల మధ్య యుద్ధం రాబోతోందా? కశ్మీర్ అంశంపై రగిలిపోతున్న దాయాది దేశం ఇప్పుడు భారత్ తో యుద్ధానికి సిద్ధమే అనే సంకేతాలు ఇస్తోంది. ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ పై పాకిస్థాన్ మరోసారి విషం కక్కింది. భారత్-పాక్ మధ్య యుద్ధం వస్తే అణ్వాయుధాలతోనే ముగుస్తుందని, దీని ప్రభావం మిగతా దేశాలపైనా పడుతుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. అంతేకాదు పాకిస్థాన్లో ఉగ్రవాద శిబిరాలే లేవన్నారు. జమ్ముకశ్మీర్కు స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని రద్దుచేసిన భారత ప్రభుత్వ నిర్ణయాన్ని ఇమ్రాన్ తీవ్రంగా తప్పుబట్టారు. కశ్మీర్లో కర్ఫ్యూ ఎత్తివేస్తే జరిగేది రక్తపాతమే అంటూ విద్వేషపూరితంగా మాట్లాడారు.
ఇమ్రాన్ వ్యాఖ్యలపై భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్కు కొన్ని ప్రశ్నలు సంధించింది. ఇమ్రాన్ ఖాన్ది మధ్యయుగం నాటి ఆలోచన ధోరణిగా కనిపిస్తోందని భారత ప్రతినిధి విధిషా మైత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. అణుయుద్ధం అంటూ పదే పదే ప్రస్తావించడం ద్వారా ఇమ్రాన్ అనుసరిస్తున్న దుర్మార్గపు విధానాలు భయపడ్డాయన్నారు. ఒకప్పుడు జెంటిల్మెన్ గేమ్ క్రికెట్కు ప్రాతినిధ్యం వహించిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు నరనరాల విద్వేషాన్ని మూటగట్టుకున్నారని దుయ్యబట్టారు. కశ్మీర్ ముస్లింలపై ఆందోళన చెందుతున్న ఇమ్రాన్ చైనాలోని మైనారిటీలపై కూడా గళం విప్పాలని నిలదీశారు. యూఎన్ బ్యాన్ చేసిన 130 మంది ఉగ్రవాదులు పాక్లోనే ఉన్నారని, 25 ఉగ్ర సంస్థలు కూడా అక్కడే ఉన్నాయని, దీన్ని ఆ దేశం అంగీకరిస్తుందా అని విదిశా ప్రశ్నించారు.
మరోవైపు ప్రపంచానికి తమ దేశం యుద్ధాన్ని కాకుండా, జ్ఞానాన్ని పంచిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘ప్రపంచానికి భారత్ యుద్ధాన్ని ఇవ్వలేదు. బుద్ధుడిని ఇచ్చింది. బుద్ధుని శాంతి సందేశాన్నిచ్చింది. అందుకే ఉగ్రభూతానికి వ్యతిరేకంగా భారత్ బలంగా గళమెత్తుతున్నది. ఐరాస శాంతి మిషన్లలో ప్రాణాత్యాగం చేసిన జవాన్లలో అత్యధికులు భారత్కు చెందినవారే’ అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఉగ్రవాదం అనేది ఏ ఒక్క దేశానికో కాకుండా ప్రపంచం మొత్తానికి పెనుముప్పలా పరిణమించిందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకమవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
మొత్తం మీద ఐక్యరాజ్య సమితి వేదికపై భారత్ శాంతి మంత్రం గురించి మాడ్లాడితే.. పాక్ మాత్రం ఉగ్రవాదం, రక్తపాతం గురించి ప్రస్తావించింది. కశ్మీర్ అంశంపై నిందలు వేస్తూ అక్కడ హింస తప్పదంటూ రెచ్చగొట్టేలా ఇమ్రాన్ మాట్లాడటం చూస్తే.. పాక్ మరో పెద్ద పన్నాగం పన్నుతోందని అర్ధమవుతోంది.
This post was last modified on September 28, 2019 11:17 am
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More