హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలంగాణలో అక్రమంగా ఉంటున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం గవర్నర్ తమిళిసైను కలిసిన కాంగ్రెస్ నేతలు.. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్పై ఫిర్యాదు చేశారు. గత శనివారం (డిసెంబరు 28) జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ర్యాలీకి సీపీ అంజనీ కుమార్ తమకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఎంఐఎం, ఆర్ఎస్ఎస్ చేపట్టిన ర్యాలీకి అనుమతించిన నగర పోలీసులు.. తమకు ఇవ్వలేదని గవర్నర్ కు వివరించారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డిసెంబరు 28న కాంగ్రెస్ ఆవిర్భవించిన రోజు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వేడుకలు, శాంతియుత ర్యాలీలు జరిగాయని తెలిపారు. హైదరాబాద్ లో శాంతియుత ర్యాలీ కోసం అనుమతి ఇవ్వాలని తాము వారం రోజుల క్రితమే కోరినా పోలీసులు ఇవ్వలేదని మండిపడ్డారు. హైదరాబాద్లో ఎక్కడైనా అనుమతి ఇవ్వాలని మరోసారి కోరితే.. దానికి జవాబు రాలేదన్నారు. 28న గాంధీభవన్లో జెండావిష్కరణ తర్వాత అనుమతి నిరాకరణకు నిరసనగా తమ పార్టీ ఆఫీసులోనే సత్యాగ్రహ దీక్ష చేపట్టామన్నారు.
గాంధీ భవన్కు వస్తున్న కార్యకర్తలను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారని తెలిపారు. ఈ హక్కు కమిషనర్కు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. ఆంధ్రా కేడర్ ఆఫీసర్ అయిన అంజనీ కుమార్ తెలంగాణలో అక్రమంగా ఉంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఉన్నతమైన పదవి ఇచ్చిందని, అందుకే వారికి జీహుజూర్ అంటూ అణచివేత ధోరణిలో ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన అనంతరం అంజనీ కుమార్ను ఏపీకి కేటాయించారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషనర్ తెలంగాణలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్నారని ఉత్తమ్ చెప్పారు. గవర్నర్ను కలిసిన వారిలో సీనియర్ నాయకులు వీహెచ్, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, రేవంత్ రెడ్డి, జానా రెడ్డి తదితరులు ఉన్నారు.
కాగా, ఇటీవలే గాంధీభవన్ లో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్పై ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణనలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ర్యాలీలకు అనుమతించకపోవడంతో సీపీపై ఆయన మండిపడ్డారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి తొత్తులా సీపీ తయారయ్యారని, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏజెంట్గా పనిచేస్తున్నారని ఆరోపించారు. అంజనీ కుమార్ క్యారెక్టర్ లేని వ్యక్తి అని, అవినీతిలో కూరుకుపోయాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు సీసీగా ఉండే అర్హత లేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
This post was last modified on December 31, 2019 7:47 pm
Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న… Read More
Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More
AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More
Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More