CM YS Jagan: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్టు చేయడం, ఏసీబీ కోర్టు ఆదేశాలతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించిన సంగతి తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి నుండి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో అండర్ ట్రైల్ ఖైదీ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టు, రిమాండ్ పై సీఎం వైఎస్ జగన్ మొదటి సారి స్పందించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో శనివారం వైఎస్ఆర్ కాపు నేస్తం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాపు నేస్తం నాలుగో విడత ఆర్ధిక సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ .. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరి ప్రభుత్వమని పునరుద్ఘాటించారు. ఏ ప్రభుత్వం వైఎస్ఆర్ కాపు నేస్తం కార్యక్రమం అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను వివరించిన సీఎం జగన్ .. ఇదే సందర్బంలో చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అడ్డంగా దొరికినా ఆయనకు ఉన్న బలమైన ముఠా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టి నకిలీ ఒప్పందంతో ప్రజా ధనాన్ని దోచుకున్నారని అన్నారు. ముందు చంద్రబాబు పీఏ అడ్డంగా దొరికి పోయారనీ, ఆయన నుండి కూపీ లాగగా చంద్రబాబు అక్రమం బయటపడిందన్నారు. కోర్టులో పది గంటల పాటు వాదనలు జరిగాయనీ, అయినప్పటికీ చంద్రబాబు ముఠాకు చంద్రబాబులో తప్పు కనిపించడం లేదని పేర్కొన్నారు.
సాక్ష్యాలు, ఆధారాలు చూసిన తర్వాత అవి నిజమని కోర్టు నమ్మిన తర్వాత చంద్రబాబును జైలుకు పంపించారని అన్నారు. ఎన్ని దోపిడీలు చేసినా, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా.. చంద్రబాబును రక్షించే వారు రక్షిస్తూనే ఉన్నారని సీఎం జగన్ అన్నారు. లంచాలు తీసుకుంటే తప్పేంటని ఒకరు ప్రశ్నిస్తారనీ, ఒత్తితి తెచ్చి మరీ సంతకాలు చేయించినా తప్పు కాదని పేర్కొంటారు అని జగన్ వ్యాఖ్యానించారు. ములాఖత్ ద్వారా మిలాఖత్ అయి కొందరు పొత్తుల రాజకీయాలు తెరతీశారంటూ పరోక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ లో ముందుగా ప్రభుత్వ సొమ్ము ఇవ్వొద్దని అధికారులు చెప్పినా వినకుండా బలవంతంగా చంద్రబాబు ఒత్తిడితోనే ప్రజా ధనం దోచుకున్నరని జగన్ అన్నారు. ప్రజలంతా ఈ విషయంలో ఆలోచన చేయాలని సీఎం సూచించారు. వందల కోట్ల ప్రజా ధనం ఎటు పోతుందో .. ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ఆలోచన చేయాలని జగన్ అన్నారు.
అంతకు ముందు ఓటుకు నోటు కేసు ప్రస్తావించిన సీఎం జగన్ ఆ కేసులో అడ్డంగా దొరికినా, ఆడియో, వీడియో టేపులతో దొరికినా కూడా ఆ వాయిస్ చంద్రబాబుదే నని తేల్చినా ఆ విషయం ప్రజలందరికీ అర్ధమయినా కూడా బాబు చేసింది నేరమే కాదని వాదించడానికి పది కోట్ల మంది ప్రజల కళ్లకు గంతలు కట్టడానికి దొంగతనాల్లో వాటాదారులు వెంటనే రెడీ అయ్యారనీ, అర డజను ఛానల్స్, రెండు పత్రికలు అండగా నిలిచాయన్నారు. ఇంత అడ్డగోలుగా దొరికినా కూడా ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశించడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఎల్లో మీడియా నిజాన్ని చూపించరు, వినిపించరు, నోరెత్తరు, మాట్లాడరు అని పైగా నిసిగ్గుగా ఆ పని సబబే అని మాట్లాడతారని విమర్శించారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి బేరీజు వేసుకోవాలని సూచించారు. మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది కొలమానంగా తీసుకోవాలని అన్నారు. మీ ఇంట్లో మీకు మంచి జరిగితే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా మారండని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
TDP: ఇదొక్కటీ చేస్తే చాలు.. రాత్రికి రాత్రి మళ్ళీ టీడీపీ పుంజుకుంటుంది !
రాజకీయాల్లో నేతల ప్రభావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్రభావమే ఎక్కువగా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వచ్చిన తర్వాత.. ఇది… Read More
Karthika Deepam 2 May 11th 2024 Episode: పారు బంటుని సీక్రెట్ గా కలుస్తూ ఉంటుంది. దీప ఇంట్లో… Read More
Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More
CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More
Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More
Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More
May 11: Daily Horoscope in Telugu మే 11 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More