కోట్లాది రూపాయల విలువ కల్గిన విశాఖ దసపల్లా భూములకు సంబంధించిన వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉంది. ఈ భూముల అభివృద్ధి అగ్రిమెంట్ లలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పాత్ర ఉందంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం, టీడీపీ అనుకూల మీడియాలో కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున కథనాలు వస్తుండటంతో సదరు ఆరోపణలపై భూయజమానులు, బిల్డర్లు స్పందించి క్లారిటీ ఇచ్చారు. దసపల్లా భూ లావాదేవీలతో విజయసాయిరెడ్డి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. శనివారం విశాఖలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అక్కడి ప్లాట్ల యజమానులు దసపల్లా రాఘవేంద్రరావు, దసపల్లా కోటేశ్వరరావు, కంకటాల మల్లిక్, బాలాజీ, సుబ్బరాజు, డెవలపర్స్ ఉమేష్, గోపీనాథ్రెడ్డి తదితరులు వివరణ ఇచ్చారు. దసపల్లా భూ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. రాజకీయాలతో వాటిని ముడిపెట్టొద్దని సూచించారు. ఆ భూముల్లో కొన్ని 22/ఏలో ఉన్నప్పటికీ తాము న్యాయస్థానాలను ఆశ్రయించామని తెలిపారు. త్వరలో గ్రీన్ సిగ్నల్ వస్తుందని, యూఎల్సీకి సంబంధించి కూడా పెండింగ్ లో ఉంటే తాము న్యాయపరంగా పోరాడుతున్నామని చెప్పారు. సర్వే నంబర్లు, రాణి కమలాదేవీ నుంచి తీసుకున్న సంతకాలు, భూ యజమానులు, డెవలెపర్ మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించి ప్రకటన కాపీని ఈ సందర్భంలో విడుదల చేశారు. సర్క్యూట్ హౌస్కు సంబంధించి గతంలోనే పరిహారం చెల్లించేశారన్నారు. అక్కడ ఉన్న వాటర్ ట్యాంకులు, ఇతరత్రా విషయంలో న్యాయపరమైన చిక్కుల్లేకుండా అందరితోనూ సంప్రదింపులు జరిపామనీ, ఆ సమస్యలు కూడా త్వరలో తీరిపోతాయని వారు తెలిపారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆయా భూ యజమానులతో సంప్రదింపులు జరిపి అపార్ట్మెంట్లు నిర్మించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని డెవలపర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి ఉమేష్ తెలిపారు. నిర్మాణాలకు సంబంధించి సాంకేతిక, ఆర్థిక, న్యాయపరమైన అంశాలతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకూడదన్న కారణంతోనే వాటాలు వేసుకున్నామని ఆయన తెలిపారు. ఒకేసారి పెద్దపెద్ద అపార్ట్మెంట్లు నిర్మించే సమయంలో బ్లాస్టింగ్ వంటివి చేయాల్సి వస్తుందన్నారు. నిర్మాణ వ్యయం పెరుగుతూ ఉంటుంది. వాటిన్నింటినీ దృష్టిలో పెట్టుకునే డీజీపీఏ సమయంలో ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఉమేష్ వివరించారు. ఎంపీ విజయసాయితో తనకు 1996 నుంచి తనకు పరిచయం ఉందని ఉమేష్ తెలిపారు. కరోనా సమయంలో ప్రగతి భారత్ ట్రస్టు ద్వారా అనేక సేవలందించామని, అప్పుడే వ్యాపారి గోపీనాథ్రెడ్డి పరిచయం అయ్యారని చెప్పారు. ఆయనను డైరెక్టర్గా పెట్టి అస్యూర్ ఎల్ఎల్పీ ప్రారంభించామని చెప్పిన ఉమేష్.. తమ వ్యాపారాలకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
దాదాపు 22 సంవత్సరాలుగా ఇబ్బందులు, ఇబ్బందులు పడ్డామనీ, ఇప్పుడిప్పుడే చిక్కుముడులు వీడుతుండటంతో 65 మంది యజమానులు సంతోషంగా ఉన్నారని ఓ ఫ్లాట్ యజమాని కంకటాల మల్లిక్ తెలిపారు. వాటాల విషయంలో 33 శాతం వరకు తమకు వస్తాయనీ, అవన్నీ రికార్డెడ్గానే ఉంటాయని చెప్పారు. ప్రభుత్వంతో ఉన్న చిక్కుముడులు, భవన నిర్మాణాల విషయంలో తాము ఇబ్బందులు పడలేక, ఎవరికైనా థర్డ్పార్టీకి డీల్ అప్పగిస్తే బావుంటుందనే ఉద్దేశ్యంతోనే ఈ ఎల్ఎల్పీతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని జాస్తి బాలాజీ అనే యజమాని తెలిపారు. గజం స్థలంకు 12అడుగుల నిర్మాణం ఇచ్చేలా అంతా మాట్లాడుకున్న తర్వాతే సంతకాలు చేశామని తెలిపారు. చాలా మంది ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన కారణంగా ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ లు ఆలస్యం అయ్యాయని చెప్పారు.
విశాఖలో పరిపాలనా రాజధాని మద్దతుగా.. సీఎం జగన్ వద్ద కీలక ప్రతిపాదన పెట్టిన మంత్రి ధర్మాన
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More
90's Middle Class Biopic: ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ దక్కితే చాలు తమ అందాన్ని మరింత పెంచుతూ సోషల్… Read More
Neethone Dance: బిగ్బాస్ ఫాన్స్ కి వారానికి రెండుసార్లు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నీతోనే డాన్స్ 2.0 కార్యక్రమాన్ని నిర్మించిన… Read More
Russia: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా… Read More
Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ప్రముఖ వ్యాపారవేత్త మరియు… Read More
Karthika Deepam 2 May 9th 2024 Episode: దీప తీయకపోయినప్పటికీ పిల్లతో ఆ పని చేయించి ఉండవచ్చు కదా… Read More
Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More
Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More
Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More
Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More