Vijaya Sai Reddy: కేంద్ర బీజేపీ పెద్దలు ఇటీవల జగన్మోహనరెడ్డి సర్కార్ ను తూర్పారబడుతూ విమర్శలు, ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జేపీ నడ్డా, అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందించారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఎప్పూడు సహకారం ఉంటునే ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్రానికి రాష్ట్రం, రాష్ట్రానికి కేంద్ర సహకారం ఉంటుందనీ, పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అని ఆయన పేర్కొన్నారు. వాళ్లు ఇద్దరు రాజకీయంగా చేసిన విమర్శలే కానీ రెండు ప్రభుత్వాల మధ్య ఎప్పటికీ సత్సంబంధాలు ఉంటాయి అన్నట్లుగా విజయసాయి రెడ్డి సెలవిచ్చారు.
అవినీతి ఎక్కడ జరిగిందో అమిత్ షా, జేపీ నడ్డా చెప్పలేకపోయారనీ, ఇచ్చే నిధులకు ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు కదా.. వాళ్ల ఆడిటింగ్ లో ఎక్కడైనా అవినీతి గుర్తించారా అని విజయసాయి ప్రశ్నించారు. అవినీతి అంటూ సాధారణంగా ఆరోపణలు చేశారని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు పై ప్రకటన చేయలేదని, విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చలేదని అన్నారు.
వైసీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ట్రాప్ లో అమిత్ షా పడ్డారా.. బాబు ట్రాప్ లో పడాల్సిన అవసరం బీజేపీకి ఉంటుందా అని ప్రశ్నించారు. ఎన్నికల కోసం అన్ని పార్టీలు వ్యూహాలు సిద్దం చేసుకుంటాయని అన్నారు. విశాఖకు కచ్చితంగా పరిపాలనా రాజధాని తరలిస్తామని విజయసాయి రెడ్డి పునరుద్ఘాటించారు. రెండేళ్ల క్రితమే పరిపాలనా రాజధానిగా కావాల్సిన కార్యాలయాలు గుర్తించామని చెప్పారు. బాబు ప్యాకేజీతో సంబంధం లేకుండా రూ.10,400 కోట్ల రెవెన్యూ లోటు సాధించామని చెబుతూ కేబినెట్ ఆమోదం తర్వాత పోలవరం ప్రాజెక్టుకు నిధులు వస్తాయని తెలిపారు.
ఇదే సందర్భంగా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపైనా విమర్శలు చేశారు. చంద్రబాబు మినీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మరని, నవంబర్ నెలలో ఇతర రాష్ట్రాల హామీలను కాపీ కొట్టి చంద్రబాబు పార్ట్ – 2 మేనిఫెస్టో ఇస్తారేమో అని సెటైర్ వేశారు. ఇప్పటికే సీఎం జగన్మోహనరెడ్డి పక్క రాష్ట్రం కర్ణాటకలో టీడీపీ మేనిఫెస్టో తయారైందని విమర్శించారు. ఎన్నికలలోపు వైసీపీలోని ప్రతి కార్యకర్తను సంతృప్తి పరుస్తామని తెలిపారు.
సీఎం వైఎస్ జగన్ కు ఓబీసీ మహా సంఘ్ మెగా కన్వెన్షన్ ఆహ్వానం
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More