తిరుపతి ఎస్వీ స్టేడియంలో ఆగస్టు ఏడున నిర్వహించ తలపెట్టిన ఓబీసీ మహా సంఘ్ 8వ జాతీయ మెగా కన్వెన్షన్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు అహ్వానం అందింది. ఈ మేరకు ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఈశ్వరయ్య సహా 15 మంది బీసీ సంఘాల నేతలు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా నేతలు సీఎం జగన్ ను సన్మానించారు. మహా సంఘ్ జాతీయ మెగా కన్వెన్షన్ కు రావాలని ఆహ్వానించారు.
బీసీలకు ఏపి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తొందనీ, దీని కోసమే తిరుపతి ఎస్వీ స్టేడియంలో 25వేల మందితో ఓబీసీ మహాసభ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. దేశ వ్యాప్తంగా జాతీయ జనగణన జరగాలన్నదే తమ డిమాండ్ అని, బీసీలకు జనాభా ప్రాతిపదికన ప్రాధన్యత ఇవ్వాలనేది డిమాండ్ అని చెప్పారు. తమ కోరికలపై మహాసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహాసభకు సీఎం వైఎస్ జగన్ ను ఆహ్వానించగా, సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. 2016 నుండి దేశంలోని వివిధ ప్రాంతాల్లో జాతీయ ఓబీసీ కన్వెన్షన్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Janasena: రేపటి నుండే పవన్ వారాహి యాత్ర ప్రారంభం .. పర్యటన ఇలా.. నేడు అన్నవరంకు జనసేనాని