Vijaya Sai Reddy: కేంద్ర బీజేపీ పెద్దలు ఇటీవల జగన్మోహనరెడ్డి సర్కార్ ను తూర్పారబడుతూ విమర్శలు, ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జేపీ నడ్డా, అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందించారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఎప్పూడు సహకారం ఉంటునే ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్రానికి రాష్ట్రం, రాష్ట్రానికి కేంద్ర సహకారం ఉంటుందనీ, పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అని ఆయన పేర్కొన్నారు. వాళ్లు ఇద్దరు రాజకీయంగా చేసిన విమర్శలే కానీ రెండు ప్రభుత్వాల మధ్య ఎప్పటికీ సత్సంబంధాలు ఉంటాయి అన్నట్లుగా విజయసాయి రెడ్డి సెలవిచ్చారు.
అవినీతి ఎక్కడ జరిగిందో అమిత్ షా, జేపీ నడ్డా చెప్పలేకపోయారనీ, ఇచ్చే నిధులకు ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు కదా.. వాళ్ల ఆడిటింగ్ లో ఎక్కడైనా అవినీతి గుర్తించారా అని విజయసాయి ప్రశ్నించారు. అవినీతి అంటూ సాధారణంగా ఆరోపణలు చేశారని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు పై ప్రకటన చేయలేదని, విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చలేదని అన్నారు.
వైసీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ట్రాప్ లో అమిత్ షా పడ్డారా.. బాబు ట్రాప్ లో పడాల్సిన అవసరం బీజేపీకి ఉంటుందా అని ప్రశ్నించారు. ఎన్నికల కోసం అన్ని పార్టీలు వ్యూహాలు సిద్దం చేసుకుంటాయని అన్నారు. విశాఖకు కచ్చితంగా పరిపాలనా రాజధాని తరలిస్తామని విజయసాయి రెడ్డి పునరుద్ఘాటించారు. రెండేళ్ల క్రితమే పరిపాలనా రాజధానిగా కావాల్సిన కార్యాలయాలు గుర్తించామని చెప్పారు. బాబు ప్యాకేజీతో సంబంధం లేకుండా రూ.10,400 కోట్ల రెవెన్యూ లోటు సాధించామని చెబుతూ కేబినెట్ ఆమోదం తర్వాత పోలవరం ప్రాజెక్టుకు నిధులు వస్తాయని తెలిపారు.
ఇదే సందర్భంగా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపైనా విమర్శలు చేశారు. చంద్రబాబు మినీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మరని, నవంబర్ నెలలో ఇతర రాష్ట్రాల హామీలను కాపీ కొట్టి చంద్రబాబు పార్ట్ – 2 మేనిఫెస్టో ఇస్తారేమో అని సెటైర్ వేశారు. ఇప్పటికే సీఎం జగన్మోహనరెడ్డి పక్క రాష్ట్రం కర్ణాటకలో టీడీపీ మేనిఫెస్టో తయారైందని విమర్శించారు. ఎన్నికలలోపు వైసీపీలోని ప్రతి కార్యకర్తను సంతృప్తి పరుస్తామని తెలిపారు.
సీఎం వైఎస్ జగన్ కు ఓబీసీ మహా సంఘ్ మెగా కన్వెన్షన్ ఆహ్వానం