Madhuranagarilo April 27 2024 Episode 349: రుక్మిణి ఆలోచిస్తూ ఉండగా శ్యామ్ గోడ దూకి లోపలికి వస్తాడు. శ్యామ్ రాదని చంపుతున్నానని తెలుసుకొని వెళ్లి కాపాడాడు నేను మత్తు పాలు ఇచ్చాను కదా పడుకున్నాడు నా ముందే ఎలా వెళ్లుంటాడు రాధ మీద ఉన్న ప్రేమే తనకి మత్తు రాకుండా చేసి ఉంటుంది అందుకే రాధని వెళ్లి కాపాడాడు అని రుక్మిణి ఆలోచిస్తుంది. శ్యామ్ ని ఇలాగే వదిలేస్తే రాదని కాపాడుతూనే ఉంటాడు శ్యామ్నే దూరం చేసి రాదని చంపేయాలి అని రుక్మిణి అనుకుంటుంది. శ్యామ్ లోపలికి వచ్చి తన చేయికి అయిన గాయానికి ఆయింట్మెంట్ పెట్టుకుంటూ ఏంటి రుక్మిణి రాదని చంపడానికి నాకు మత్తు మంది ఇచ్చి పడుకో పెట్టాలని చూస్తావా నేను ఉండగా రాదని టచ్ కూడా చేయనివ్వను.
నా ప్రాణం పోయేంతవరకు రాదని కాపాడుతూనే ఉంటాను అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే, రాధా పొద్దున్నే లేచి కిచెన్ లోకి వస్తుంది. ఏంటి రాధా కల్లెరగా ఉన్నాయి అని మధుర అడుగుతుంది. నిద్ర పట్టలేదా అత్తయ్య అని రాదా చెబుతుంది. నిజం చెప్పు రాదా నా దగ్గర ఎందుకు దాస్తున్నావు అని మధుర అంటుంది. పండు గుర్తుకు వచ్చి ఏడ్చాను అత్తయ్య అందుకే నిద్ర పట్టక కళ్ళు ఎర్రగా ఉన్నాయి వాడిని కలలో తప్ప నిజంగా చూడలేకపోతున్నాను అని రాదా బాధపడుతుంది. నేను పండు దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను రాదా వెళ్లి రెడీగా అని మధుర చెబుతుంది. ఆయనని ఇంటికి రావద్దన్నారు పండు ని ఎలా చూస్తాం అత్తయ్య అని రాదా అంటుంది. పండును చూపిస్తానంటున్నాను గా నువ్వెళ్ళు అని అంటుంది.
కట్ చేస్తే,రాధా మధుర పండు స్కూల్ దగ్గరికి వస్తారు. అదిగోనమ్మ పండు, పండు నేను చూడాలనుకున్నప్పుడల్లా మనిద్దరం స్కూల్ కి వచ్చి చూద్దాం అని అంటుంది.పండు తో మాట్లాడలేకపోయినా తనని దూరం నుంచి చూసిన సంతోషిద్దాం అత్తయ్య అని రాదా అంటుంది. పండు రాద మధుర ని చూసి పరిగెత్తుకొస్తాడు. ఇంతలో రుక్మిణి వచ్చి కారు అడ్డంపెడుతుంది.పండు కారెకు అని రుక్మిణి అంటుంది. నేను మమ్మీ దగ్గరికి వెళ్తాను అని పండు అంటాడు. అది అమ్మీ కాదురా డమ్మీ నేను మీ అమ్మని అని రుక్మిణి బలవంతంగా పండుని తీసుకువెళ్లి కార్లో కూర్చోబెడుతుంది. రుక్మిణి రాధ దగ్గరికి వచ్చి నా కొడుకును మీరు ఇలా కలవడానికి వస్తే వాడు నాకు దగ్గర అవుతాడా నన్ను అమ్మ అని పిలుస్తాడా నా కొడుకుని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారా అని అంటుంది.
పండుని దూరం నుంచైనా చూసి వెళ్దాం అని వచ్చాము అక్క అని రాదా అంటుంది. ఇంకొకసారి పండుని చూడాలని మీరు స్కూల్ దగ్గరికి వస్తే నా కొడుకుని కిడ్నాప్ చేస్తున్నారని మీ ఇద్దరి మీద కేసు పెట్టి జైల్లో వేస్తాను అని రుక్మిణి పండుని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ప్రసాద్ రావు ఇంటికి వస్తాడు. మధుర మంచినీళ్లు తెచ్చి అతనికి ఇస్తుంది. ఎలా ఉన్నారు అంకుల్ అని రాదా అడుగుతుంది. ఏదో బాధగా కనపడుతున్నారు అదేంటో చెప్పండి అని మధుర అంటుంది. నా కొడుక్కి పెళ్లంటే ఇష్టం లేదమ్మావాడు పెళ్లి చేసుకోకపోతే నాతోటి నా వంశం ఆగిపోతుందని భయం వేస్తుంది వాడికి పెళ్లి ఎలా చేయాలో అర్థం కావట్లేదు అని ప్రసాద్ రావు అంటాడు.మీరేమీ బాధపడకండి అంకుల్ నేను మీ అబ్బాయిని మార్చిత్వరలోనే పెళ్లి చేస్తాను అని రాదా అంటుంది.
మీ అబ్బాయి లాంటి వాళ్ళని రాధా ఎందరినో మార్చి పెళ్లిలు చేసిందండి రాధా చెప్పిందంటే కచ్చితంగా చేస్తుంది మీరు ఏమి బాధపడకండి అని మధుర అంటుంది.మీరు బాధలో ఉంటారు మీ బాధని పంచుకోడానికి వచ్చాను కానీ నా గుండెలో బాధని తీసేశారు అని ప్రసాద్ రావు అంటాడు. మీరు మాట్లాడుతూ ఉండండి అంకుల్ నేను వెళ్లి కాఫీ తెస్తాను అని రాదా కిచెన్ లోకి వెళ్తుంది. ఇలాంటి కోడలు ఉండడం మీ అదృష్టం అమ్మ అని ప్రసాద్ రావు అంటాడు.
కానీ మాలాంటి అత్తమామలు ఉండడం రాదా దురదృష్టం అని మధుర అంటుంది. కట్ చేస్తే, ఏంట్రా నువ్వు చెప్పేది రుక్మిణి రాదని చంపడానికి ప్లాన్ చేస్తున్నా ఇంకా తన దగ్గర ఏముందిరా నిన్ను లాగేసుకుంది పండుని తీసేసుకుంది అని కిరణ్ అంటాడు. నేను తనకి దగ్గర కావట్లేదని రాదని చంపేస్తే నేను తనకు దగ్గర అవుతానని ఆశిస్తుంది రా రుక్మిణి అని శ్యామ్ అంటాడు. నువ్వు రుక్మిణికి దగ్గర కావడం తప్ప వేరే మార్గం లేదురా అని కిరణ్ అంటాడు.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!