Vangaveeti Radhakrishna: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వంగవీటి రాధా వ్యాఖ్యల వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఇటీవల దివంగత వంగవీటీ రంగా వర్ధంతి సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల్లో ఏమైనా స్ట్రాటజీ ఉందా, నిజంగా జరిగిందా, నిజంగా జరిగే అవకాశం ఉంటే ఎవరు టార్గెట్ చేస్తారు. ఆయన అంత కాంట్రివర్సీ కాదు. ఆయన ఏమీ వివాదాల జోలికివెళ్లడు. గొడవలకు వెళ్లే టైపు కాదు. మరీ ఆయన్ను ఎవరు టార్గెట్ చేస్తారు. లేక ఇంకేమైనా స్ట్రాటజీ ప్రకారం ఒక పార్టీ తెరవెనుక ఉంటూ ఈయన చేత ఈ వ్యాఖ్యలు చేయించిందా అన్నట్లు రకరకాల అనుమానాలు షికారు చేస్తున్నాయి. ఎందుకంటే ఆ వేదికను పంచుకున్న నాయకులను పోల్చుకుని చూస్తే. తెరమీదకు అనేక రకాల ఊహాగానాలు వస్తున్నాయి. అన్నింటికంటే ఎక్కువగా చర్చనీయాంశం అవుతున్నది టీడీపీ, జనసేన పొత్తు ఉండబోతున్నది అన్నది. కొద్ది రోజులుగా ఇది ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీలు అందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నాలుగైదు నెలల్లో ఆ పార్టీల నుండి ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం. టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 30శాతం అంటే సుమారు 50లక్షల కాపు సామాజికవర్గ ఓట్లు 60 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ – జనసేన అభ్యర్ధుల విజయానికి అవకాశాలు ఉంటాయి. 2019 ఎన్నికల్లోనూ దాదాపు 30కిపైగా నియోజకవర్గాల్లో జనసేన ఎక్కువ ఓట్లు చీల్చిన కారణంగా వైసీపీ అభ్యర్ధులు గెలిచారు.
ఆ ఫ్యాక్టర్ లో భాగంగా పవన్ కళ్యాణ్ ను, ఆ సామాజికవర్గాన్ని ఎదుర్కోవాలంటే ఈ సామాజికవర్గం నుండి బలమైన నాయకుడు ఉండాలి అని చూసే క్రమంలో వంగవీటి రాధపై చూస్తుండవచ్చు. వంగవీటి రాధా బలమైన నాయకుడు అనే కంటే ఒక బ్రాండ్ ఉన్న నాయకుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే దివంగత నేత వంగవీటి రంగా వారసుడుగా రాధాకు ఒక బ్రాండ్ ఉంది. బ్రాండ్ వేరు, బలం వేరు. ఉదాహరణకు చూసుకుంటే కర్నూలు కోట్ల సూర్యప్రకాశరెడ్డికి ఒక బ్రాండ్ ఉంది. కోట్ల విజయభాస్కరరెడ్డి రూపంలో. కానీ మొన్నటి ఎన్నికల్లో బలం లేక ఓడిపోయారు. అదే విధంగా నారా లోకేష్ చంద్రబాబు కుమారుడుగా ఒక బ్రాండ్. కానీ మంగళగిరిలో ఓడిపోయారు. రాజకీయాల్లో గెలుపునకు బ్రాండ్ పని చేయదు. బలమే పని చేస్తుంది. వంగవీటి రాధాకు బలం లేదు కానీ బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ ను వాడుకుని 2024 ఎన్నికల్లో కాపు సామాజికవర్గంలో కొంత మేర వైసీపీ లబ్దిపొందాలన్న వ్యూహంలో భాగంగా వంగవీటి విజయవాడలో అడుగుతున్న సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆయనకే ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు విజయవాడ సెంట్రల్ ఇవ్వనన్నారు కాబట్టే ఆయన పార్టీ మారారు. అప్పుడు పీకే (ప్రశాంత్ కిషోర్) స్ట్రాటజీ ప్రకారం సెంట్రల్ నియోజకవర్గం బ్రాహ్మణులకు ఇస్తేనే గెలుస్తుందని చెప్పడంతో మల్లాది విష్ణుకు ఇవ్వడం కోసం రాధకు నో చెప్పడంతో పార్టీ మీద అలిగి టీడీపీలో చేరారు. టీడీపీలో కూడా సెంట్రల్ నియోజకవర్గం ఇవ్వకపోయినా ఎక్కడ నుండి పోటీ చేయలేదు.
ఇప్పుడు ఆయన మిత్రులు వల్లభనేని వంశీ, కొడాలి నాని వైసీపీలో ఉన్నారు. వంశీ అయితే దాదాపు రెండు దశాబ్దాలకుపైగా వంగవీటి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ఫ్యామిలీ రిలేషన్స్, వ్యక్తిగత స్నేహం నేపథ్యంలో వాళ్లు ఇద్దరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి రాధ కూడా ఆ పార్టీలో ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు. మరో పక్క వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కూడా వంగవీటి రాధా పట్ల సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఆయన అడిగిన సీటు ఇచ్చేస్తే టీడీపీ జనసేన పోత్తులో భాగంగా కాపు సామాజికవర్గ ఓట్లు కొంత మేరకు వెళ్లకుండా చేయవచ్చు అనేది ఒక ప్లాన్. ఒక వేళ ఇదే గనుక నిజమైతే భవిష్యత్తులో టీడీపీ వాళ్లే నా మీద ఇలా చేయించారు అని కూడా రాధాతో చెప్పించే అవకాశాలు ఉంటాయి. వాస్తవానికి రెక్కీ నిర్వహించడం వాస్తవం అయితే ఎవరు చేశారు అనేది ఆయనే పూర్తి స్థాయిలో వెల్లడించాల్సి ఉంటుంది. ఆయన సగమే చెప్పి వదిలివేయడంతో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై వెంటనే జగన్మోహనరెడ్డి స్పందించి 2 ప్లస్ 2 గన్ మెన్ల భద్రత ఇవ్వడం, విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇవడం చూస్తుంటే వైసీపీ ఆయనకు స్వాగతం పలుకుతుందనీ, ఆ సెంట్రల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందనీ ఊహాగానాలు వినబడుతున్నాయి. ఇది ఎంత వరకు నిజమనేది రాధా నోటి నుండే రావాలి. టీడీపీలో సెంట్రల్ నియోజకవర్గం ఇచ్చే అవకాశాలు లేవు కాబట్టి వైసీపీ ఇస్తే వెళ్లే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఆ తరువాత ఆ పార్టీ స్ట్రాటజీ ప్రకారం మాట్లాడే అవకాశాలు ఉంటాయి. చూడాలి ఏమి జరుగుతుందో?
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More
90's Middle Class Biopic: ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ దక్కితే చాలు తమ అందాన్ని మరింత పెంచుతూ సోషల్… Read More
Neethone Dance: బిగ్బాస్ ఫాన్స్ కి వారానికి రెండుసార్లు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నీతోనే డాన్స్ 2.0 కార్యక్రమాన్ని నిర్మించిన… Read More
Russia: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా… Read More
Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ప్రముఖ వ్యాపారవేత్త మరియు… Read More
Karthika Deepam 2 May 9th 2024 Episode: దీప తీయకపోయినప్పటికీ పిల్లతో ఆ పని చేయించి ఉండవచ్చు కదా… Read More
Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More
Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More