Mamata Banerjee: ఇల్లు అలకగానే పండుగ కాదు అన్న సామెత అందరికీ తెలిసిందే. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో పరిస్థితి అలానే ఉంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ముఖ్యమంత్రి పీఠాన్ని మరో అయిదేళ్ల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఆరు నెలల్లో శాసనసభ లేదా శాసన మండలి ఏదో ఒక సభలో సభ్యురాలిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. దీదీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికే రెండు నెలలు పూర్తి అయ్యింది. ఇంకా నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ లోపుగా ఖాళీగా ఉన్న భవానీపుర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహణకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేస్తుందా లేదా అన్న అనుమానమే. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఉప ఎన్నికలపై ఈసీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగే అవకాశం ఉంది.
Read More: Mamata Banerjee: దీదీకి పదవీ గండం..? ఈసీ చేతిలో మమత భవితవ్యం..!!
ఈ నేపథ్యంలో తన పదవీ గండం నుండి దీదీ తప్పించుకోవాలంటే ఏకైక మార్గం శాసనమండలి ఏర్పాటే. దీంతో రాష్ట్రంలో మండలి ఏర్పాటునకు అసెంబ్లీలో దీదీ తీర్మానం ఆమోదించారు. ప్రతిపక్ష బీజేపీ సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకించినా టీఎంసీ బలంతో శాసనసభలో మండలి ఏర్పాటు తీర్మానం ఆమోదం పొందింది. దీదీ ఎమ్మెల్సీగా ఎన్నికై మరో అయిదేళ్లు ఎటువంటి ఢోకా లేకుండా సీఎంగా పరిపాలన సాగించాలని ఆమె ఆలోచన. కానీ ఇందులో ఒక చిక్కూ ఉంది. అసెంబ్లీలో ఆమోదించినంత మాత్రాన వెంటనే శాసనమండలి ఏర్పాటు అవ్వదు. దీనికి ప్రధాని మోడీ మద్దతు కావాల్సి ఉంటుంది. అంటే బెంగాల్ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించాలి. అది ఇప్పట్లో సాధ్యం అవుతుందా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ ల ప్రశ్న.
ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లోనే దీదీకి మరో సారి అధికారం దక్కకుండా చేయాలని కేంద్రంలోని బీజేపీ సర్వశక్తులు వడ్డిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రధాన మంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు పశ్చిమ బెంగాల్ పై పూర్తి ఫోకస్ పెట్టినా దీదీ నుండి అధికారాన్ని అడ్డుకోలేకపోయారు. నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో దీదీని అయితే ఓడించగలిగారు గానీ రాష్ట్రంలో టీఎంసీ గెలుపును అడ్డుకోలేకపోయారు. అయితే దీదీ సీఎం పీఠంలో కూర్చున్నా బీజేపీ.. ఆమెను తీవ్రంగా ఇరుకున పెట్టే ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంది. ఈ తరుణంలో బెంగాల్ లో మండలి ఏర్పాటునకు కేంద్రం ఆమోద ముద్ర వేయడం కష్టతరమే అన్న మాట వినబడుతోంది.
2010లో అస్సోం అసెంబ్లీ, 2012లో రాజస్థాన్ అసెంబ్లీ లు సైతం తమ రాష్ట్రాల్లో శాసనమండలి ఏర్పాటు చేయాలంటూ తీర్మానాలు ఆమోదించాయి. కానీ ఈ రెండు బిల్లులు కేంద్రం వద్ద ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అదే విధంగా ఏపికి సంబంధించి శాసనమండలి రద్దు అంశం సుమారు ఏడాది కాలంగా కేంద్రం వద్ద పెండింగ్ ఉంది. పలు రాష్ట్రాల శాసనమండలికి సంబంధించిన అంశాలు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ కు సంబంధించిన శాసనమండలిపై కేంద్రం వెంటనే పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపుతుందా అంటే లేదు అనే సమాధానమే వస్తుంది. ఒక వేళ ఈ నాలుగు నెలల్లో బెంగాల్ శాసనమండలి పునరుద్ధరణ జరిగితే ఏదో మెరాకిల్ జరిగినట్లే లెక్క. ప్రస్తుతం బీజేపీ, టీఎంసీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్నందున బెంగాల్ మండలి పునరుద్ధరణకు కేంద్రం అంత త్వరగా చర్యలు చేపట్టదు అనే మాటే వినబడుతోంది. ఏమి జరుగుతుందో వేచి చూడాలి.
This post was last modified on July 7, 2021 1:32 am
Jyothi Roi: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ తమ అందచందాలను ప్రదర్శిస్తున్నారు. తెరపై… Read More
Aa Okkati Adakku: ఈ మధ్య సీరియస్ కాన్సెప్ట్ కథలతో ప్రయోగం చేసిన అల్లరి నరేష్.. తాజాగా ఆ ఒక్కటి… Read More
Indraja: జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఎన్నో కార్యక్రమాలకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న ఇంద్రజ గురించి… Read More
Manasu Mamatha: ఆకట్టుకునే అందలతో పాటు సరైన యాక్టింగ్ తో ప్రేక్షకులను మైమరిపించే ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే ఉంటారు.… Read More
Krishna Mukunda Murari: ప్రజెంట్ జనరేషన్ లో హీరో మరియు హీరోయిన్స్ కన్నా బుల్లి తెర నటీనటులు తమ గ్లామర్… Read More
Faima: ప్రస్తుత కాలంలో మొదట ప్రేమించుకోవడం అనంతరం విడిపోవడం చాలా కామన్ గా మారిపోయాయి. పూర్వకాలంలో వీటిని సినీ సెలబ్రిటీలే… Read More
Mamitha Baiju: మమితా బైజు.. ఈ యంగ్ బ్యూటీ గురించి పరిచయాలు అక్కర్లేదు. ఇటీవల విడుదలైన మలయాళ లవ్ డ్రామా… Read More
Pooja Hegde: గత ఏడాదిన్నర కాలం నుంచి టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేను బ్యాడ్ టైం ఓ రేంజ్ లో… Read More
Rana Daggubati: రానా దగ్గుబాటి.. సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా అత్యంత సుప్రసిద్ధుడు. ప్రముఖ నిర్మాత… Read More
Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ తనకున్న ఆస్తి గురించి చెప్పేసరికి అనసూయ మనసు పారేసుకుంటుంది.… Read More
Land Titiling Act: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తీవ్ర… Read More
Supritha: సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు కూడా సెలబ్రిటీలుగా గుర్తింపు సంపాదించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో… Read More
ED Raids: సార్వత్రిక ఎన్నికల వేళ .. ఝార్ఖండ్ లోని ఓ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. ఇదంతా లెక్కల్లోకి… Read More
Brahmamudi:కావ్య,అప్పు ఇద్దరూ కలిసి రాజ్ డబ్బులు ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే,… Read More
Nuvvu Nenu Prema:అరవింద, ఫంక్షన్ హడావిడి అయిపోయిన తర్వాత, తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నాకు చెప్పకుండా… Read More