Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రేపు వివిధ రాజకీయ పక్షాల నేతలతో కీలక భేటీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిని రంగంలోకి దింపే దిశగా వ్యూహాలను రచిస్తున్న దీదీ..రేపు జరగబోయే భేటీకి వివిధ రాజకీయ పక్షాలకు చెందిన 22 మంది జాతీయ స్థాయి నేతలకు ఆహ్వానాలు పంపారు. అయితే విఫక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా ఎన్సీపీ నేత శరద్ పవార్ పేరు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో దాన్ని ఆయన ఖండించారు. తాను రాష్ట్రపతి పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. ఈ తరుణంలో కీలక భేటీకి ఒక రోజు ముందు శరద్ పవార్ తో మమతా బెనర్జీ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రేపు జరిగే సమావేశానికి గానూ మమతా బెనర్జీ, శరద్ పవార్ లు ఈ రోజే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం శరద్ పవార్ నివాసానికి చేరుకున్న మమతా బెనర్జీ ఆయనతో భేటీ అయ్యారు. రేపటి సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, భేటీకి హజరయ్యే పార్టీల వైఖరి తదితర విషయాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించిన శరద్ పవార్ జాతీయ స్థాయి రాజకీయాల్లో మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. మరో పక్క ఆయనకు వైరి వర్గాల్లోనూ ఆయనకు మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రపతి అభ్యర్ధిగా తాను పోటీ చేయడం లేదంటూ శరద్ పవార్ ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయంపై మమతా బెనర్జీ ఆయనతో చర్చించినట్లు వార్తలు వినబడుతున్నాయి. శరద్ పవార్ తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని కూడా మమతా బెనర్జీ అభ్యర్ధించినట్లు తెలుస్తొంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిని నిలపాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్న తరుణంలోనే దీదీ ఓ అడుగు ముందుకు వేసి సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చకు దారి తీసింది. మరో పక్క రాష్ట్రపతి ఎన్నికను వివక్షాలతో మాట్లాడి ఏకగ్రీవం చేయాలన్నట్లుగా బీజేపీ భావిస్తొంది. ఆ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు ఇతర పక్షాలతో మాట్లాడే బాధ్యతలను పార్టీ అప్పగించింది.
ఇదిలా ఉంటే జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ రేపు ఢిల్లీలో జరిగే కీలక సమావేశానికి వెళతారా లేదా అన్న చర్చ జరుగుతోంది. దీదీ ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కూడా ఆహ్వానం పంపిన నేపథ్యంలో కేసిఆర్.. కాంగ్రెస్ పార్టీతో వేదికను పంచుకోవడానికి ఇష్టపడటం లేదని వార్తలు వినబడుతున్నాయి. అయితే తన ప్రతినిధిని సమావేశానికి పంపాలని కేసిఆర్ భావిస్తున్నారని తెలుస్తొంది. రేపు దీదీ నిర్వహిస్తున్న సమావేశానికి ఏయే పార్టీల నేతలు హజరు అవుతారు, వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయి అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
AP DGP: ఏపీ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా నియమితులైయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం… Read More
Sreemukhi: తెలుగు బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్స్ లిస్ట్ తీస్తే శ్రీముఖి పేరు ముందు వరుసలో ఉంటుంది. బుల్లితెర రాములమ్మ… Read More
Jyothi Roi: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ తమ అందచందాలను ప్రదర్శిస్తున్నారు. తెరపై… Read More
Aa Okkati Adakku: ఈ మధ్య సీరియస్ కాన్సెప్ట్ కథలతో ప్రయోగం చేసిన అల్లరి నరేష్.. తాజాగా ఆ ఒక్కటి… Read More
Indraja: జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఎన్నో కార్యక్రమాలకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న ఇంద్రజ గురించి… Read More
Manasu Mamatha: ఆకట్టుకునే అందలతో పాటు సరైన యాక్టింగ్ తో ప్రేక్షకులను మైమరిపించే ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే ఉంటారు.… Read More
Krishna Mukunda Murari: ప్రజెంట్ జనరేషన్ లో హీరో మరియు హీరోయిన్స్ కన్నా బుల్లి తెర నటీనటులు తమ గ్లామర్… Read More
Faima: ప్రస్తుత కాలంలో మొదట ప్రేమించుకోవడం అనంతరం విడిపోవడం చాలా కామన్ గా మారిపోయాయి. పూర్వకాలంలో వీటిని సినీ సెలబ్రిటీలే… Read More
Mamitha Baiju: మమితా బైజు.. ఈ యంగ్ బ్యూటీ గురించి పరిచయాలు అక్కర్లేదు. ఇటీవల విడుదలైన మలయాళ లవ్ డ్రామా… Read More
Pooja Hegde: గత ఏడాదిన్నర కాలం నుంచి టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేను బ్యాడ్ టైం ఓ రేంజ్ లో… Read More
Rana Daggubati: రానా దగ్గుబాటి.. సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా అత్యంత సుప్రసిద్ధుడు. ప్రముఖ నిర్మాత… Read More
Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ తనకున్న ఆస్తి గురించి చెప్పేసరికి అనసూయ మనసు పారేసుకుంటుంది.… Read More
Land Titiling Act: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తీవ్ర… Read More
Supritha: సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు కూడా సెలబ్రిటీలుగా గుర్తింపు సంపాదించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో… Read More
ED Raids: సార్వత్రిక ఎన్నికల వేళ .. ఝార్ఖండ్ లోని ఓ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. ఇదంతా లెక్కల్లోకి… Read More