పదవులు లభించకపోవడంతో సీనియర్ తెలుగు మహిళల్లో ఉవ్వెత్తున లేస్తున్న అసంతృప్తితో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.మొన్నటి ఎన్నికల్లో పూర్తిగా పతనావస్థకు చేరిన తెలుగుదేశం పార్టీకి తిరిగి జవసత్వాలు నింపేందుకు చంద్రబాబునాయుడు ఈ మధ్య కసరత్తు ప్రారంభించారు.టీడీపీ పునరుజ్జీవింపజేసేందుకు ఆయన రకరకాల కమిటీలు కూడా వేసేశారు.గతానికి భిన్నంగా జిల్లాస్థాయి అధ్యక్ష పదవుల స్థానంలో పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ అధ్యక్షులను నియమించారు.అంతేగాక రెండేసి పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక సమన్వయ కర్తను కూడా నియమించారు.అలాగే పార్లమెంటరీ స్థాయిలో తెలుగు మహిళ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.ఈ మధ్యే పార్టీ పొలిట్బ్యూరోను,ఏపీ, తెలంగాణ రాష్ట్ర పార్టీ కమిటీలను జాతీయ టిడిపి కార్యవర్గాన్ని చంద్రబాబు ప్రకటించారు.దీంతో చాలామంది పార్టీవారికి పదవీయోగం పట్టింది.
దీనిపై పురుషపుంగవులు హ్యాపీగానే ఉన్నప్పటికీ అయితే మహిళా నేతలు మాత్రం రుసరుసలాడుతున్నారు.పదవుల పందేరంలో పార్టీలో ఉన్న సీనియర్ తెలుగు మహిళా నాయకురాళ్లు కొందరికి అన్యాయం జరిగిందన్న వాదన తెరపైకి వచ్చింది.మాజీ అసెంబ్లీ స్పీకర్ ప్రతిభాభారతి ఇంతకుముందు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు కాగా ఇప్పుడు ఆ పదవి నుండి తొలగించి జాతీయ కమిటీలో ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు.పార్టీ పరంగా చూస్తే పొలిట్బ్యూరో అన్నది అత్యున్నతమైన కమిటీ.అందులో నుండి తనను తొలగించడంతోపాటు తనకంటే చాలా జూనియర్ అయిన వంగలపూడి అనితకు పోలిట్బ్యూరో సభ్యత్వం ఇవ్వడం పట్ల ప్రతిభాభారతి మండిపడుతున్నారట.జాతీయ ఉపాధ్యక్షపదవిని తానేమీ చేసుకోనని ఆమె బహిరంగంగానే పార్టీ వర్గాల వద్ద వ్యాఖ్యానించారని సమాచారం.పొలిట్ బ్యూరో నుంచి తనను తప్పించడాన్ని ప్రతిభాభారతి తీవ్రంగా పరగణిస్తున్నారని ఆ వర్గాలు చెప్పాయి.
అలాగే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ,శ్రీకాకుళం జిల్లా టిడిపి మాజీ అధ్యక్షురాలు గౌతు శిరీష,మాజీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ,మాజీ మంత్రి పీతల సుజాత తదితరులు కూడా తమకు బాబు అన్యాయం చేశారని వాపోతున్నారు. నిజానికి వీరంతా కూడా టీడీపీకి విశేషమైన సేవలందించిన మహిళానేతలే .అయినా జూనియర్లను అందలమెక్కించి సీనియర్లను పక్కన బెట్టడం బాబుకు తగదని వారు అంటున్నారు.ఈ కొత్త తలనొప్పితో చంద్రబాబు సతమతమైపోతున్నారట.ఏ విధంగా ఈ మహిళా నేతలను సంతృప్తి పర్చాలని ఆయన మధనపడిపోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on October 30, 2020 2:57 pm
Manipur: మణిపూర్ లో మరో సారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని నారసేన ప్రాంతంలో భద్రతా బలగాలపై సాయుధ మిలిటెంట్లు… Read More
Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైస్ చిత్రం… Read More
Jagadhatri April 27 2024 Episode 216: కేదార్ భయపడిపోయి జగదాత్రి చెయ్యి తన నెత్తి నుంచి తీసేస్తాడు. ఎందుకు… Read More
Paluke Bangaramayenaa April 27 2024 Episode 213: ఎలుక ఉందని భయపడిపోయిన స్వర పరిగెత్తుకొచ్చి అభి పక్కన బెడ్… Read More
Brahmamudi April 27 2024 Episode 395: దుగ్గిరాల ఇంట్లో రోజుకో రచ్చ జరుగుతూనే ఉంది. నిన్న కావ్య మీడియా… Read More
Naga Panchami: గరుడ రాజు తన గరుడ శక్తిని ఖరాలికి ఆవాహన చేస్తాడు. కరాలి ధన్యోస్మి గరుడ రాజా అంటుంది.… Read More
Mamagaru: అవును వదిన ఇక్కడ ఉంటున్నామనే కానీ తింటే తినబుద్ది అవదు పడుకుంటే పడకో బుద్ధి కాదు అక్కడ ఉంటే… Read More
Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతి గురించి విక్కి ఆలోచిస్తూ ఉంటాడు. అటుగా వచ్చిన ఆర్య రేపు… Read More
Krishna Mukunda Murari April 27 2024 Episode 456: కృష్ణ హాస్పిటల్ కి వెళ్లి నిజం తెలుసుకోవాలి అని… Read More
April 27: Daily Horoscope in Telugu ఏప్రిల్ 27 – చైత్ర మాసం – శనివారం - రోజు… Read More
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప 2' మూవీ తెరకెక్కుతోంది. 2021లో వచ్చిన… Read More
Lok sabha Elections 2024: లోక్సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన… Read More
Varun Tej: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న విషయం… Read More
JD Lakshminarayana: జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు.… Read More
Breaking: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమను… Read More