వైసీపీ అధినేత జగన్ సమన్వయకర్తల విషయంలో తీసుకుంటోన్న నిర్ణయాలు పార్టీ కేడర్లో పెద్ద కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఎవరు ? ఎప్పుడు ఏ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉంటారో ఎప్పుడు అవుట్ అవుతారో తెలియడం లేదు. తాజాగా గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్తగా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్యను పార్టీ అధిష్టానం నియమించడంతో పార్టీ కేడర్ తలలు పట్టుకుంటోంది. గత ఎన్నికల్లో పార్టీ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.
అప్పటి నుంచి గుంటూరు పార్లమెంటు వైసీపీ పగ్గాలు ఎవరికి అప్పగించాలా అని వైసీపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతూ వస్తోంది. ఈ టైంలో టీం ఇండియా క్రికెటర్ అంబటి రాయుడు గత యేడాది కాలంగా గుంటూరు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వస్తున్నారు. వైసీపీ కేడర్తోనూ ఆయన చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. అంబటి రాయుడే గుంటూరు పార్లమెంటుకు పోటీ చేస్తారంటూ బాగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తగినట్టే రాయుడు వైసీపీలో కూడా చేరారు.
ఏమైందో గాని వైసీపీలో చేరిన వారం రోజులకే రాయుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిశారు. రాయుడు బయటకు వెళ్లిపోయాక ఆ ప్లేస్లోకి వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పెద్ద కుమారుడు హైదరాబాద్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ నడుపుతోన్న ఉమ్మారెడ్డి వెంకటరమణను పార్టీ అధిష్టానం గుంటూరు సమన్వయకర్తగా ఎంపిక చేసింది. తన వారసుడిగా వెంకట రమణను ప్రమోట్ చేయాలని వెంకటేశ్వర్లు గత 20 ఏళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
ఎట్టకేలకు తన కోరిక తీరిందని ఉమ్మారెడ్డి ఆనందపడ్డారు. వెంకటరమణను గుంటూరు పార్లమెంటు వైసీపీ సమన్వయకర్తగా ఎంపిక చేసి 20 రోజులు కూడా కాలేదు. ఆయన మధ్యలో రెండు మూడు సార్లు గుంటూరు వచ్చారు.. చాలా ఉత్సాహంగా కనిపించారు. అంతలోనే ఏమైందో గాని ఆయన ఐదారు రోజుల నుంచి సడెన్గా సైలెంట్ అయిపోయారు. అసలు పార్టీలో కూడా యాక్టివ్గా లేరు. దీంతో మరో షాకింగ్ న్యూస్ వైసీపీ అధిష్టానం నుంచి బయటకు వచ్చేసింది.
ఉమ్మారెడ్డి వెంకటరమణను తప్పించేసి ఆ ప్లేసులోకి పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారు రోశయ్యను పార్లమెంటు నియోజకవర్గ సమన్యయకర్తగా నియమించింది. పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న రోశయ్య మరోసారి అక్కడే పోటీ చేయాలని అనుకున్నారు. ఇంతలోనే ఆయనకు అధిష్టానం షాక్ ఇస్తూ గుంటూరు పార్లమెంటుకు పంపింది. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు రోశయ్య గుంటూరు వైసీపీ పార్లమెంటు ఇన్చార్జ్గా ఉన్నారు. అయితే నోటిఫికేషన్ వచ్చాక చివర్లో రోశయ్యను పొన్నూరు పంపి… గుంటూరు పార్లమెంటు నుంచి మోదుగులను పోటీ చేయించింది.
అప్పుడు రోశయ్య పొన్నూరులో స్వల్ప తేడాతో విజయం సాధిస్తే… మోదుగుల ఎంపీగా పోటీ చేసి గల్లా జయదేవ్ చేతిలో ఓడిపోయారు. ఏదేమైనా గుంటూరు పార్లమెంటు నుంచి వైసీపీ తరపున రోజుల వ్యవధిలోనే కొత్త వాళ్లు తెరమీదకు వస్తుండడంతో వైసీపీ కేడర్లోనూ కన్ఫ్యూజ్ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More