YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల విజయవాడలో ఇవేళ బాధ్యతలు స్వీకరించారు అనంతరం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. పార్టీలోకి తాను రావాలని కేడర్ కోరుకుందని, వారందరికీ ధన్యావాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు, బీజేపీపైనా విమర్శలు చేశారు. వైసీపీ, టీడీపీ దొందూద దొందేనని విమర్శించారు.
గత పదేళ్లుగా ఆ రెండు పార్టీల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని అన్నారు షర్మిల. రాజధాని అమరావతిని చంద్రబాబు పూర్తి చేయలేదనీ, జగన్ మూడు రాజధానులని చెప్పి ఒక్కటీ చేయలేదని విమర్శించారు. రాజధాని ఏదంటే ఇప్పుడు ఏమీ అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను సీఎం జగన్ తాకట్టు పెట్టారని అన్నారు. ఇప్పుడు ఏపీపై పది లక్షల కోట్ల అప్పుల భారం ఉందని అన్నారు. ఏపీలో ఉద్యోగులకు జీతాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఉందని అన్నారు.
ఏపీలో ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం మాత్రమేనని అన్నారు. ఏపీలో మైనింగ్, ఇసుక మాఫియా రెచ్చిపోతుందని అన్నారు. ఏపీలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడంలో పాలకులకు చేతకాలేదన్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే వేలాదిగా ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ .. ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామా చేస్తామన్నారని, కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సారైనా ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదంటే ఆ పాపం జగన్ దేనని షర్మిల అన్నారు. ఈ నాలుగున్న సంవత్సరాల్లో ఆరున్నర కోట్ల రూపాయల అప్పులు చేశారనీ, పట్టుమని పది పరిశ్రమలు వచ్చాయా అని నిలదీశారు. ఏపీ అప్పులు పది లక్షల కోట్లు అంటున్నారనీ, ఇంత అప్పు చేసినా ఏపీలో అభివృద్ధి బూతద్దంలో చూసినా కనిపించడం లేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదానే కాదు కనీసం స్పెషల్ ప్యాకేజీ కూడా రాలేదన్నారు. పోలవరం విషయంలో జగన్ ప్రజలను మోసం చేశారని షర్మిల ఆరోపించారు.
విజయవాడలో కీసం ఒక మెట్రో అయినా ఉందా అని ప్రశ్నించారు. రోడ్లు వేసుకోవడానికి కూడా నిధుల్లేని పరిస్థితి ఉందన్నారు. విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తామన్న బీజేపీ హామీ ఏమైందని ప్రశ్నించారు. 22 మంది వైసీపీ ఎంపీలు, టీడీపీ ముగ్గురు ఎంపీలు కేంద్రంలోని బీజేపీ చేతుల్లో ఉన్నారని, ఆ పార్టీ ఏమి చేబితే అది చేస్తున్నారని విమర్శించారు షర్మిల. ఏపీపై బీజేపీ కపట ప్రేమ చూపిస్తుందే తప్ప చేసింది ఏమి లేదని మండిపడ్డారు. లక్షల మందికి ఉద్యోగాలు అన్న బీజేపీ .. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. కాగా, వైఎస్ షర్మిల సమక్షంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు షర్మిల పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. గుంటూరు జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఆర్కేకు షర్మిల సూచించారు.
తొలుత వైఎస్ షర్మిలకు గన్నవరం విమానాశ్రయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా విజయవాడ వస్తుండగా, షర్మిల కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఎనికేపాడు వద్ద ర్యాలీగా వెళుతున్న కాంగ్రెస్ పార్టీ నేతల వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. దీంతో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు.
తమ వాహనాలను డైవర్ట్ చేసినందుకు కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు రోడ్డుపై భైటాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా షర్మిల.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమని నియంతలు గుర్తుపెట్టుకోవాలని అనారు. కాంగ్రెస్ పార్టీని చూసి ఏపీ ప్రభుత్వం భయపడుతోందని నేతలు అన్నారు. పోలీసులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారన్నారు.
Ramoji – Gone Prakash Rao: రామోజీకి గోనె ప్రకాశరావు హెచ్చరిక లేఖ .. ఎందుకంటే..?
AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More
Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More