Harish Rao: టీఆర్ఎస్ పార్టీ దూకుడు కొనసాగుతున్న సమయంలో దుబ్బాకలో గెలుపుతో బీజేపీ నేత రఘునందన్ రావు తన సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆయన అవాక్కయ్యేలా మంత్రి హరీశ్ రావు వ్యవహరించారని అంటున్నారు. దుబ్బాక పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. తర్వాత బాలాజీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ లతో కలిసి పాల్గొని మాట్లాడారు. దుబ్బాక లో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి మాత్రం ఆపమని మంత్రి స్పష్టం చేశారు.
Read More: BJP: బీజేపీ ఆ విషయంలో కేసీఆర్ను వదిలిపెట్టట్లేదుగా!
హరీశ్ రావు ఎన్ని మాటలు చెప్పారంటే..
దుబ్బాకలో అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అంబేద్కర్ భవనం, జగ్జీవన్ రామ్ భవనంకు రూ.50 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. “వంద పడకల ఆసుపత్రి కి ప్రహరీ గోడ కట్టిస్తాం. దళిత బంధు పథకం కొత్తగా రాలేదు.. బడ్జెట్ లోనే ప్రవేశపెట్టినం. దుబ్బాక లో ఇదే ఆర్థిక సంవత్సరంలో దళిత కుటుంబాలకు కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తాం.“ అని తెలిపారు.
Read More: KCR: ఆ కాంగ్రెస్ లీడర్ వల్లే.. ఈటలను బయటకు పంపించిన కేసీఆర్!
3 లక్షల మందికి ఆ గుడ్ న్యూస్…
ఇచ్చిన మాటకు కట్టుబడి 3 లక్షల మంది కి రేషన్ కార్డులు ఇస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో 90.5 శాతం మందికి రేషన్ బియ్యం అందుతున్నాయని స్పష్టం చేశారు. రెండువేల ఏడువందల కోట్ల తో రాష్ట్రంలో రేషన్ బియ్యం పంపిణీకి ఖర్చు పెడుతున్నామన్నారు. ప్రతి పేదవారికి రేషన్ బియ్యం ఇస్తామని హరీశ్ రావు అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు కేవలం తెలంగాణ లోనే అమలు అవుతుందని, ప్రతి పేదింటి ఆడపిల్ల పెండ్లికి లక్ష రూపాయలు ఇస్తున్నామని గుర్తు చేశారు. సంక్షేమానికి చిరునామా తెలంగాణ ప్రభుత్వం.. దేశానికి రోల్ మోడల్ తెలంగాణ ప్రభుత్వం అని వివరించారు. వచ్చే రెండు సంవత్సరాలలో దళిత బంధు పథకం పూర్తి చేస్తాం. కొద్ది రోజుల్లో స్వంత జాగలో ఇళ్లు కట్టించే కార్యక్రమం ఉంటుంది. రైతులు ఫామాయిల్ తోటలపై దృష్టి పెట్టాలి.“ అని సూచించారు.
This post was last modified on July 28, 2021 10:17 pm
AP High Court: పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ల విషయంలో… Read More
Telangana Exit Polls: తెలంగాణ లోక్ సభ ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే తీవ్రమైన పోటీ ఉన్నట్లుగా సర్వేలు వెల్లడిస్తున్నాయి.… Read More
AP Exit Polls: దేశంలో నేటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్… Read More
Supreme court: వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుండి… Read More
ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో వైసీపీ కనుక ఓడిపోతే.. ఏం జరుగుతుంది? అంటే.. అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీనిలో ప్రధానంగా… Read More
ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరు పాలన పగ్గాలు చేపడతారు? అనేది.. ఆసక్తికర విషయమే. ప్రజలు దీనికి సంబందించి తీర్పు… Read More
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సారి ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలన్నది.. ఆ పార్టీ నాయకుల అభిలాష. అదేవిధంగా పవన్… Read More
ఏపీ రాజధాని ఏది అని ఎవరిని అడిగినా పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. ముఖం చిట్లింపులు దర్శన మిస్తున్నాయి. మరికొందరు మూడు… Read More
Kiccha Sudeep: కన్నడ స్టార్ హీరోల్లో కిచ్చా సుదీప్ ఒకరు. 1997లో తాయవ్వ అనే మూవీతో సుదీప్ తన సినీ… Read More
Karthika Deepam 2 June 1st 2024 Episode: మీ నాన్న వచ్చారు హడావిడిగా వెళ్లిపోయారని దశరధ కార్తీక్ కి… Read More
Paruvu Web Series: ఏడాది గ్యాప్ తర్వాత ఓ వెబ్ సిరీస్ తో తెలుగులోకి కం బ్యాక్ ఇవ్వనుంది నివేత… Read More
Shoban Babu: సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు ఇద్దరూ మంచి స్నేహితులు. ఈ లెజెండ్రీ నటులు ఇద్దరూ… Read More
Bujji And Bhairava OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కల్కి. మహానటి దర్శకుడు నాద్… Read More
Amulya Gowda: స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ కి ప్రేక్షకుల ఆదరణ లభించడంతో..మంచి… Read More
Most Expensive TV Show: ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ పెట్టిన టీవీ సీరియల్ రామ్ సియాకె లవ్ కుష్. టీవీ… Read More