BJP: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మరో రాష్ట్రంలో పరిణామాలు ఇబ్బందికరంగా మారుతున్నాయని అంటున్నారు. ఢిల్లీని ప్రభావితం చేసే రాష్ట్రమనే పేరున్న ఉత్తరప్రదేశ్లో 2022 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకునేందుకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ ) పాచికలు విసురుతోంది. ఉత్తరప్రదేశ్ లో మెజారిటీ వర్గాల్లో ఒకటైన బ్రాహ్మణ సామాజిక వర్గంపై బీఎస్పీ దృష్టి సారిస్తోంది. బీఎస్పీలో మాయావతి తర్వాత నెంబర్ టూగా ఉన్న సతీశ్ చంద్ర మిశ్రా… బ్రాహ్మణులకు పార్టీని దగ్గర చేసే బాధ్యతలను తలకెత్తుకున్నారు.
Read More: BJP: బీజేపీ ఆ విషయంలో కేసీఆర్ను వదిలిపెట్టట్లేదుగా!
యూపీలో లెక్కలు వేరే..
యూపీలో దళిత, బహుజనులే బీఎస్పీకి సంప్రదాయ ఓటు బ్యాంక్. అయితే, బీజేపీ ప్రభంజనంతో అది చీలిపోయింది. కానీ ఈ సంప్రదాయ ఓట్ బ్యాంక్ తగ్గినప్పటికీ పూర్తిగా పోయిందని చెప్పలేం. దీంతో ఇప్పుడున్న బలానికి అదనంగా బలం సంతరించుకోవడంపై మాయావతి ఫోకస్ చేశారు. సహజంగానే ఆమె ఫోకస్ బ్రాహ్మణ ఓట్లవైపు మళ్లింది. అందుకే ఆ వర్గానికి దగ్గరయ్యేందుకు బ్రాహ్మణ సమ్మేళన్ పేరుతో సమావేశాలు పెట్టేందుకు ప్లాన్ చేశారు. అయితే రాజకీయంగా తప్పుడు సిగ్నల్స్ వెళ్తాయనే కారణంతో జ్ఞానోదయ సమ్మేళనాలుగా పేరు మార్చారు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని బీఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా అప్పుడే ప్రారంభించారు.
Read More : Modi: మోడీ లాగే కేసీఆర్ కూడా ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు!
అయోధ్య నుంచే మొదలు…
మూడు దశాబ్ధాలుగా దేశ రాజకీయాల్లో సెంటర్ పాయింట్ గా ఉన్న అయోధ్య నుంచే కార్యక్రమాలు షురూ చేశారు. అయోధ్యలో బ్రాహ్మణ సమావేశాలు నిర్వహించారు. సతీష్ చంద్ర మిశ్రా సహా పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. బ్రాహ్మణ సమ్మేళనాలను ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా 7 చోట్ల నిర్వహించనున్నారు. ఈ సమావేశం మొదటిది కాగా, మరో 6 సమ్మేళనాలు జరగనున్నాయి. అయోధ్యలో మొదటి సమావేశానికి ముందు హనుమాన్ గఢీ సతీశ్ చంద్ర మిశ్రా ఆలయంలో పూజలు చేశారు. శ్రీరాముడు అందరివాడని చెప్పుకొచ్చారు. బీజేపీ మాత్రమే మతం ఆధారంగా రాజకీయాలు చేస్తుందని తాము అలా చేయబోమని స్పష్టం చేశారు.