MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ నమోదు చేసిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. పీఎంఎల్ఎ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కు కవిత అర్హురాలని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తలిపారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమెను అరెస్టు చేశారని అన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న ఆమెను సీబీఐ ఎందుకు అరెస్టు చేసిందని అడిగారు. ఆమెను అరెస్టు చేయాల్సిన అవసరం లేకున్నా సీబీఐ అరెస్టు చేసిందని కోర్టుకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీకి కవిత స్టార్ క్యాంపెయినర్ అని, ఏడేళ్ల లోపు శిక్షపడే కేసులకు అరెస్టు అవసరం లేదని చెప్పారు.
అయితే కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ కేసు దర్యాప్తును కవిత ప్రభావితం చేయగలరని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. లిక్కర్ కేసులో ఆమె కీలక వ్యక్తిగా ఉన్నారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది.
మే 2న తుది ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. మరో వైపు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఈడీ కేసులోనూ కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు రేపు (మంగళవారం) వింటామని ధర్మాసనం తెలిపింది.
AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్