Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలైయ్యాయి. రిటర్నింగ్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. నామినేషన్లు వేసే అభ్యర్ధులతో ఆర్ఓ కార్యాలయాలు కిటకిటలాడాయి. రేపు (శుక్రవారం) నామినేషన్లు పరిశీలించనున్నారు. ఈ నెల 29వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.
కాగా, ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలతో పాటు తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కు (ఉప ఎన్నిక) మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు 731 మంది అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు.
175 శాసనసభ నియోజకవర్గాలకు 4,210 మంది నామినేషన్లు వేశారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 572 మంది అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు 38 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కొన్ని చోట్ల చెదురు మదురు ఘటనలు మినహా నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?