KCR: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరిగా గుర్తింపు పొంది అనూహ్య రీతిలో ఆ పార్టీ నుంచి , ప్రభుత్వం నుంచి మంత్రి ఈటల రాజేందర్ బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈటల రాజీనామా వహించిన హుజురాబాద్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఈటల తన ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా తాజాగా ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read More : Eatela Rajendar: కేసీఆర్ స్కీం పెట్టినందుకు ఈటల కు పాలాభిషేకం చేశారు!
ఆయన వల్లే నేను బయటకు
హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం దేశరాజ్ పల్లిలో పర్యటించిన బీజేపీ నేత ఈటల రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “18 ఏళ్లు నీతో తిరిగాను.. రైట్ హ్యాండ్ అన్నావు, లెఫ్ట్ హ్యాండన్నావు, తమ్ముడన్నావు.. ఒక్కరోజులోనే కానివాన్నయ్యానా?“ అని ఈటల ప్రశ్నించారు. అసలు కథ వేరే ఉంది అని ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. “నీ కొడుకును సీఎంను చేసుకోవాలనుకున్నావు. నేను కాదన్నానా..? ఇతర పార్టీలోళ్లు, ఈటలను ఎందుకు సీఎం చేయని జీవన్ రెడ్డి లాంటి వాళ్లు అడిగారు. నేను సీఎంను కావాలనుకుంటే తప్పు.. కానీ నేననలేదు. ప్రతిపక్షాల వాళ్లు సీఎంగా నా పేరు అనగానే.. నీ పని ఇక్కడిదాకా వచ్చిందా అని నన్ను బయటకు పంపిండు.“ అంటూ ఈటల కీలక కామెంట్లు చేశారు.
Read More : KCR: రిటైరైన వారికి మళ్లీ ఉద్యోగం.. ఇది కేసీఆర్ సర్కారులోనే సాధ్యం.
కేసీఆర్ పరిస్థితి అది…
2014 వరకు ప్రజలను, ధర్మాన్ని, కష్టాన్ని నమ్ముకున్న కేసీఆర్.. అధికారం రాగానే డబ్బును, ప్రలోభాలను మాత్రమే నమ్ముకున్నాడని ఈటల ఆరోపించారు. “తెలంగాణ ప్రజలు పిచ్చోళ్లు, బానిసలు, డబ్బులకు లొంగుతారని ఇప్పుటిదాకా లాక్కొచ్చాడు. ఇప్పుడు మనవంతు వచ్చింది.. ఆయన ముందు మోకరిల్లుదామా? బరిగీసి కొట్లాడుదామా?“ అని ఈటల ప్రశ్నించారు. నేను ఎత్తులో చిన్న మనిషినే కావచ్చు.. చిచ్చర పిడుగును. కావాలంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేను మాట్లాడిన మాటలు వినండి అని ఈటల అన్నారు.