KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ గుడ్ న్యూస్ అలాంటి ఇలాంటిది కాదు. రిటైరైన వారికి మళ్లీ ఉద్యోగం దక్కనుంది. ఇది సింగరేణి సంస్థలో అమలు కానుంది. ఔను తాజాగా సింగరేణి అధికారులు, కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. పదవీవిరమణ వయస్సు 60 నుంచి 61 ఏళ్ల పెంపునకు బోర్డు ఆప్ డైరెక్టర్ల సమావేశం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని మార్చి 31 నుంచి అమలు చేయనున్నారు. మార్చి 31 నుంచి జూన్ 30 మధ్య పదవీ విరమణ చేసిన వారికి మళ్లీ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సింగరేణి సీఎండీ శ్రీధర్ వెల్లడించారు.
Read More:
ఇటీవలే కేసీఆర్ ..
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లోని అధికారులు, ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో సోమవారం జరిగిన 557వ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం దీనికి ఆమోదం తెలిపినట్లు సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ ప్రకటించారు. ఆయన అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో సింగరేణి డైరెక్టర్లతో పాటు కేంద్ర, రాష్ట్రాల నుంచి బోర్డు ప్రతినిధులు హాజరయ్యారు. సీఎం ఆదేశానుసారం పదవీ విరమణ వయసు పెంచినట్లు శ్రీధర్ ప్రకటించారు. దీనిపై త్వరలో విధివిధానాలు ప్రకటిస్తామని తెలిపారు.
Read More : KCR: హుజురాబాద్లో కేసీఆర్ కొత్త ఆపరేషన్ ఏంటో తెలుసా?
వీళ్లకు తీపి కబురు…
పెళ్లైన, విడాకులు పొందిన కుమార్తెలకూ కారుణ్య నియామకాల్లో అవకాశం ఉందని సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ వివరించారు. సింగరేణి ఉద్యోగాల్లో 10 శాతం ఈబీసీ రిజర్వేషన్ల అమలుకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. సింగరేణిలో అన్ని ఉద్యోగాలకు లింగ భేదం లేకుండా అవకాశాల అనుమతికి సమావేశం ఆమోదం తెలిపినట్లు శ్రీధర్ వెల్లడించారు.ఈ నిర్ణయంతో 43,899 మంది అధికారులు, కార్మికులకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు.