Elon Musk: ప్రముఖ సోషల్ మీడియా సైట్ ఎక్స్ (ట్విట్టర్) యూజర్లకు ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. 2,500కు పైగా వెరిఫైడ్ ఫాలోవర్లు ఉన్న ఖాతాలకు ప్రీమియం సేవలను ఉచితంగా అందివ్వనున్నట్లు తెలిపారు. అలానే 5వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఎక్స్ యూజర్లకు ప్రీమియం ప్లస్ సర్వీసులు ఉచితంగా (ఫ్రీ) యాక్సిస్ చేసే సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని మస్క్ ప్రకటించారు. కంటెంట్ క్రియేటర్లకు, ఇన్ ఫ్లుయెన్సర్లు మెరుగైన ఫీచర్లు అందించాలనే ఉద్దేశంతో ఈ సదుపాయం తీసుకొచ్చినట్లుగా తెలుస్తొంది.
మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ ఇప్పటికే ప్రీమియం, ప్రీమియం ప్లస్ ఫీచర్లు అందిస్తొంది. సబ్ స్ట్రిప్షన్ ప్లాన్ ప్రకారం .. ప్రీనియం ప్లస్ చందాదారులు ప్రకటనలు లేకుండా ఫ్లాట్ ఫామ్ ను యాక్సిస్ చేయొచ్చు. పోస్టు చేసిన ట్వీట్ ను గంటలోపు ఎడిట్ చేయొచ్చు. 25,000 అక్షరాల వరకూ పోస్టు చేసే సదుపాయం కూడా ఉంటుంది. ఇక ప్రీమియం, ప్రీమియం ప్లస్ సబ్ స్క్రిప్షన్ ఉన్న వాళ్లు కృత్రిమ మేథ సంస్థ ఎక్స్ఏఇ అభివృద్ధి చేసిన ఏఇ చాట్ బాట్ గ్రోక్ ను యాక్సిస్ చేయొచ్చు. నెలకు రూ.1,300 లేదా ఏడాదికి రూ.13,600 వెచ్చించే ప్రీమియం ప్లస్ చందాదారులకు మాత్రమే గ్రోక్ అందుబాటులో ఉండేది.
గ్రోక్ ను మొదట ప్రీమియం ప్లస్ సబ్ స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ప్రీమియం చందాదారులకు ఉపయోగించుకునే సదుపాయం కల్పించారు. ఇప్పుడు ఫ్రీ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ పొందేవారు దీన్ని వాడొచ్చు. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్ ఫామ్ ల నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్న వేళ..యూజర్లను ఆకర్షించడంలో భాగంగా ఈ సదుపాయం తీసుకొచ్చినట్లుగా తెలుస్తొంది.
మరో పక్క ..ఎక్స్ ను వినియోగిస్తున్న వారి సంఖ్య తగ్గిపోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అలానే వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కూడా క్షిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మస్క్ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్