రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు కూడా ఉండరు. ఇప్పుడు ఇదే సూత్రం.. ఏపీలోనూ అన్ని పార్టీలకూ వర్తిస్తుంది. ఎన్నికలకు ముందు తమకు టికెట్లు ఇవ్వలేదన్న కారణంగా.. అనేక మంది నాయకులు వైసీపీ నుంచి జంప్ చేసి.. టీడీపీ గూటికి వచ్చారు. మరికొందరు జనసేనలోకి వెళ్లారు. ఇలా వెళ్లిన వారి అదృష్టమో.. లేక.. ఆయా పార్టీల్లో బలమైన నాయకులు అనేవారు లేకపోవడమో.. కారణం ఏదైనా.. వారికి జాక్ పాట్ దక్కింది. దీంతో టికెట్లు దక్కించుకున్నారు. ఇలాంటి వారిలో ఆరణిశ్రీనివాసులు ఒకరు.
ఈయన నిన్న మొన్నటి వరకు.. వైసీపీలోనే ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ వరకు కూడా.. పార్టీ టికెట్ కో సం వేచి చూశారు. గత 2019 ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ నుంచి వైసీపీ టికెట్పై విజయం దక్కించుకు న్నారు. ఇప్పుడు కూడా అదే టికెట్ ఇవ్వాలని కోరుకున్నారు. కానీ, ఆయన గ్రాఫ్ బాగోలేదని.. చెబుతూ.. పార్టీ రాజ్యసభ సీటును ఇస్తానంది. కానీ, ఆయన దానిని కాదని చెప్పి.. వచ్చి టీడీపీలో ట్రై చేశారు. కానీ, ఆయనకు జనసేన అయితే.. బెటర్ అని భావించి.. ఈపార్టీ పిలుచుకుంది.
వచ్చీరావడంతోనే .. ఆయన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇచ్చారు. కానీ, ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా.. ఆయనకు సొంత కూటమి పార్టీల నేతల నుంచే సెగతగులుతోంది. ఒక్కరంటే ఒక్కరు కూడా.. ఆయనకు అనుకూలంగా ముందుకు రావడం లేదు. ఆ మధ్య నేరుగా.. పవన్ జోక్యంచేసుకుని సర్ది చెప్పిన తర్వాత.. 24 గంటల వరకు బాగానే ఉన్నా.. తర్వాత.. మళ్లీ ఎవరూ ముందుకు రాలేదు. వారంతట వారుగాప్రచారంలోనూ పాల్గొనడం లేదు.
దీంతో ఆరణికి చెమటలు పడుతున్నాయి. ఒక్కరే కొంతమందిని తీసుకువచ్చి.. అది కూడా చిత్తూరు నుంచి తెచ్చి.. ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు.. వైసీపీ తరఫున బరిలో ఉన్న భూమన అభినయ్ దూకుడుగా ఉన్నారు. చిత్రం ఏంటంటే.. కూటమిలోని కొందరు యువతను కూడా ఈయన ఆకర్షించారు. వారికి ఏం చేస్తారో.. ఏం చేస్తానని హామీ ఇచ్చారో తెలియదు కానీ.. రాత్రికి రాత్రికండువాలు మార్చేశారు. ఇలా.. 200 మంది కూటమి కార్యకర్తలు.. భూమనకు జైకొట్టారు. దీంతో ఆరణి గెలుపు ఏమేరకు సాకారం అవుతుందో చూడాలి.