తిరుపతి పార్లమెంటు పరిధిలో ఈ దఫా.. ఆసక్తికర పోరు సాగుతోంది. ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేసి న ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ.. ప్రస్తుత గూడూరు ఎమ్మెల్యే వెలగలపల్లి వరప్రసాద్. బీజేపీ అ భ్యర్థిగా బరిలో ఉన్నారు. మరోవైపు వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాలి గురుమూర్తి బరిలో నిలిచా రు. అయితే.. వరప్రసాద్ దాదాపు ఐదేళ్లు నియోజకవర్గంతో సంబంధాలు లేకపోవడం.. పైగా.. ఆయన వైసీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేయడం గమనార్హం.
ఈయన గ్రాఫ్ సరిగాలేదని.. వైసీపీ వరప్రసాద్కు.. టికెట్ నిరాకరించింది. దీంతో కొన్ని రోజులు బ్రతిమా లారు. అయినా.. పార్టీ నుంచి ఎలాంటి హామీ దక్కకపోవడంతో చివరకు చంద్రబాబును కలిసి టీడీపీలో చేరాలని నిర్ణయించుకుని అదే పనిచేశారు. కానీ, బాబు కూడా.. ఆయనను చేర్చుకోలేదు. బీజేపీలో చేరితే మద్దతు ఇస్తామన్నారు. దీంతో వరప్రసాద్.. ఇటు రాజీనామా చేసిన రోజే అటు. బీజేపీ కండువా కప్పుకొన్నారు. మాజీ ఐఏఎస్ కావడతో బీజేపీ కూడా చేర్చుకుని టికెట్ ఇచ్చింది.
అయితే.. వాస్తవానికి తిరుపతి పార్లమెంటు టికెట్ను ఉప ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ నాయకురాలు రత్న ప్రభ ఆశించారు. కానీ, ఆమెకు పార్టీ చోటు పెట్టలేదు. ఇక, టీడీపీ నుంచి మాజీ ఎంపీ పనబాక లక్ష్మి కూడా కోరుకున్నారు. కానీ, ఈమె కూడా నిరాశే ఎదురైంది. ఈ ప్రభావం ఇక్కడ వరప్రసాద్పై కనిపిస్తోంది. అంతేకాదు.. క్షేత్రస్థాయిలో బీజేపీ, టీడీపీ నేతలు కూడా.. వరప్రసాద్ ను పట్టించుకోవడం లేదు. ఆయన రూపాయి బయటకు తీయలేకపోవడం కూడా ఒక కారణమని తెలుస్తోంది.
దీంతో వరప్రసాద్ ప్రచారం.. సోలోగానే ముందుకు సాగుతోంది. గతంలో తనకు ఉన్న పరిచయస్తులను మాత్రమే ఆయన వెంటేసుకుని తిరుగుతున్నారు. ఇంకోవైపు.. గురుమూర్తికి అనుకూలంగా.. పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారం దంచి కొడుతున్నారు. గురుమూర్తకి సహజంగా వచ్చిన ఇమేజ్.. వైసీపీ పథకలు.. జగన్ ఇమేజ్ వంటివి బాగానే కలిసి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరప్రసాద్ అసలు పోటీ ఇవ్వగలరా? అనేది ప్రశ్న. ఏం జరుగుతుందో చూడాలి.