Trinayani April 25 2024 Episode 1222: హాసిని ఆ పౌడర్ తీసుకొని మొహానికి అంత రుద్దుకుంటుంది. పౌడర్ అయిపోయింది ఇప్పుడు అత్తయ్య చూస్తే కోప్పడుతుంది అని పిల్లలు వేసుకునే పౌడర్ తెచ్చి ఆ పౌడర్లో కలిపేస్తుంది హాసిని. అంటే అందులో వేరే పౌడర్ కలిపావా అని తిలోత్తమ అంటుంది.ఇప్పుడు గాయత్రి పాపకి ఆ పౌడర్వేయొచ్చత్తయ్య పిల్లలు వేసుకునేదే అని నైని అంటుంది. గాయత్రి అక్క ఫోటో కూడా రుద్దారు అని పావన మూర్తి అంటాడు. గాయత్రి అమ్మగారు ఇప్పుడు చిన్న పాప గానే ఉంటుంది కదా బాబాయ్ అని నైని అంటుంది. అంటే అఖండస్వామి ఇచ్చిన పౌడరులో పిల్లల పౌడరు కలిపావా మా ప్లానంత పాడు చేశావు కదా అని తిలోత్తమ అంటుంది. హాసిని వదినకు తెలియకుండానే అద్దంలో పౌడర్ రాసుకున్నట్టు కనిపించింది అని విక్రాంత్ అంటాడు. గాయత్రి పాపకి హాసిని అక్క పెద్దమవుతుంది కదా అందుకే అద్దంలో కనిపించింది అని నైని అంటుంది. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అని డమ్మక్క అంటుంది.కట్ చేస్తే,తిలోత్తమ వల్లభ అఖండ స్వామి దగ్గరికి వెళ్తారు.
ఏంటి తిలోత్తమ ఇలా వచ్చారు అని గురువుగారు అడుగుతారు. స్వామి మీరిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాము అని తిలోత్తమ అంటుంది.ఏం జరిగింది తిలోత్తమ అని గురువుగారు అంటారు. మీరిచ్చిన పౌడర్ ని గాయత్రీ పాపకి రుద్దుదాం అనుకునేసరికి నా తింగరి కోడలు అంత ప్లాన్ పాడు చేసింది అని తిలోతమ అంటుంది. అయితే ఇక మీరు బయలుదేరండి అని గురువుగారు అంటారు. గురువుగారు తప్పయిపోయింది ఇంకొక అవకాశం ఏదైనా ఉంటే చెప్పండి అని తిలోత్తమ అంటుంది. ఎన్నిసార్లు అవకాశం ఇచ్చాను అంతా వృధా చేశారు నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని గురువుగారు అంటారు. నా చిన్న కోడలు సుమన ఉంది అని తిలోత్తమ అంటుంది. తనకి గాయత్రి జాడ తెలియదు కదా అని గురువుగారు అంటారు. మాకు అంతగా మేలు చేయకపోయినా మా కుల గురువు ఉన్నాడు అని తిలోత్తమ అంటుంది. అయితే గురువుగారు గాయత్రి జాడ చెబుతారు వెళ్లి అడగండి అని అఖండస్వామి అంటాడు.
ఎలా చెబుతాడు గురువుగారు అని వల్లభ అంటాడు. నా స్టైల్ లో అడిగితే చెప్తాడు పదరా అని తిలోత్తమ వెళ్ళిపోతుంది. గురువుగార్నే హత్య చేయాలని చూస్తుంది మూర్ఖురాలు అని అఖండస్వామి అనుకుంటాడు. కట్ చేస్తే, విశాల్ హాసిని పావనమూర్తి ఒక్క దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు ముగ్గురు ఎప్పుడు కలిసే మాట్లాడుకుంటారా అని నైని అంటుంది. మీ ఆయనతో మాట్లాడొద్దంటే వెళ్ళిపోతాం అని హాసిని అంటుంది. నేను అనేది అది కాదు అక్క చంద్రశేఖర్ అన్నయ్యకి ఏదో కీడు జరగబోతుంది తనని కాపాడాలి అని నైని అంటుంది. నైని ఏ ప్రమాదం జరగబోతుందో నీకు ఏమైనా తెలుసా అని విశాల్ అంటాడు. అది తెలిస్తే కాపాడే దానికదా బాబు గారు అని నైని అంటుంది. ముందు తనకి ఏమీ కాకుండా కాపాడుకోవాలి అని నైని అనడంతో అలాగే నైని అని విశాల్ అంటాడు. కట్ చేస్తే, ఇంతలో గురువుగారు ఇంటికి వస్తారు.
మమ్మీ నువ్వే గురువుగారిని విషం పెట్టి చంపడానికి పిలిపించావా అని వల్లభ అంటాడు.నేను పిలిపించలేదురాతను ఎందుకు వచ్చాడు నాకు కూడా తెలియదు కానీ మన పని సులువు చేశాడు గురువుగారికి విషం ఇచ్చి చంపి సుమన మీద నెట్టేద్దాం అని తిలోత్తమ అంటుంది. పిలిస్తే దర్శనం ఇవ్వని మీరు ఈరోజు పిలవకుండానే వచ్చారు గురువుగారు అని విశాల్ అంటాడు.మిమ్మల్ని అందరిని చివరిసారిగా చూడాలనిపించి వచ్చాను విశాల్ అని గురువుగారు అంటారు. అదేంటి గురువుగారు అలా అంటారు అని నైని అంటుంది. తనకు ఎవరైనా కీడు చెయ్యాలని చూస్తున్నారేమో అని డమ్మక్క అంటుంది. సుమన ఇంటికొచ్చిన గురువుగారికి మంచినీళ్లు మజ్జిగ ఇవ్వవా అని తిలోత్తమ అంటుంది. నాకన్నా మా అక్క బాగా చేస్తుంది తని ఇస్తుందిలే అత్తయ్య అని సుమన అంటుంది. నేను తెస్తానులే అత్తయ్య అని నైని అంటుంది.
వద్దు నైని నువ్వు మాట్లాడుతూ ఉండు నేను తీసుకొస్తాను అని తిలోత్తమ అంటుంది. మంచినీళ్లు చాలు తిలోత్తమ అని గురువుగారు అంటారు. అలాగే గురువుగారు అంటూ తిలోత్తమ వెళ్ళిపోతుంది. మా మమ్మీ మంచిగా తెస్తుంది గురువుగారు అని వల్లభ అంటాడు. అత్తయ్య పనిగట్టుకుని మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది అంటే ఏదో చేయబోతుంది అని ఆలోచించిన సుమన నేను మంచినీళ్లు తీసుకువస్తాను అని అంటుంది.సమయం ఇచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి సుమన అని నైని అంటుంది. ఇప్పటికి మించిపోయిందేముంది తీసుకురాపో సుమన అని గురువుగారు అనడం సుమన వెళ్ళిపోతుంది. తమరు ఎందుకు వచ్చారో చెప్పనేలేదు అని విశాల్ అంటాడు. గాయత్రి జాడ చెప్పి వెళ్దామని వచ్చాను విశాల్ అని గురువుగారు అంటారు.
కట్ చేస్తే, తిలోత్తమ మంచినీళ్లలో విషం కలిపి తీసుకువస్తూ ఉండగా సుమన అక్కడికి వస్తుంది. అత్తయ్య గురువుగారికి మంచినీలిచ్చి పుణ్యం చేసుకోవాలనుకుంటున్నాను ఇంతసేపు పడుతుందా మంచినీళ్లు తేవడానికి అని సుమన అంటుంది. బాగా ఫిల్టర్ చేయాలి కదా సుమన అని తిలోత్తమ అంటుంది. మంచినీళ్లు నేనిచ్చి పుణ్యం కట్టుకుంటాను అని సుమన తీసుకుంటుంది. ఈ నీళ్లు గురువుగారు తాగి చచ్చిపోయిన నైని సుమన నే అనుమానిస్తుంది నా మీద డౌట్ రాదు ప్రాణం పోతున్నప్పుడు గురువుగారిని గాయత్రీ అక్క జాడ అడుగుతాను అని తిలోత్తమ అనుకుంటుంది. గాయత్రి అమ్మగారు ఎక్కడ ఉందో మీకు తెలుసా గురువుగారు అని నైని అంటుంది. ఇంతలో సుమన వచ్చి మంచినీళ్లు ఇస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!