8 Am Metro OTT: మల్లేశం మూవీతో దర్శకుడు రాజ్ రాచకొండ మంచి గుర్తింపును పొందిన సంగతి తెలిసిందే. ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ విమర్శకుల నుంచి ప్రశంసాలను అందుకుంది. ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితం పై రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. బాలీవుడ్ లో రాజ్ రాచకొండ దర్శకత్వం వహించిన 8 Am metro గత ఏడాది విడుదలైన సంగతి తెలిసిందే. విమర్శకుల నుంచి ప్రశంసలను ఈ మూవీ దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ఈ చిత్రం మే పదమ తేదీన జీ 5 ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ విషయంపై ఆ ప్లాట్ఫామ్ అధికారిక ప్రకటన కూడా చేసింది.
తమ ప్లాట్ఫామ్ పై ఈ సినిమాని ఉచితంగా చూడవచ్చని పేర్కొంది. మే 10న రాత్రి నుంచి ఈ సినిమా జీ5 లో ప్రీమియర్ కానుంది. గుల్షన్ దేవయా, సాయమీ ప్రాధాన పాత్రలు పోషించిన ఈ మూవీ 2023 మే 19న థియేటర్లలో విడుదలైంది. తక్కువ థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ అయింది. అయితే విమర్శకుల నుంచి కూడా ఈ చిత్రం మంచి ప్రశంసలను అందుకుంది. అలా పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఇక థియేటర్లలో రిలీజ్ అయిన సంవత్సరం తరువాత ఇప్పుడు ఈ మూవీ ఓటిటిలోకి వస్తుంది. మే 10న జీ5 లో అడుగుపెడుతుంది. ఈ చిత్రంను ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన అందమైన జీవితం పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు దర్శకుడు.
ప్రముఖ కవి గుల్జర్ రాసిన కొన్ని పద్యాలు కూడా ఈ మూవీలో ఉన్నాయి. కళాత్మకంగా హృదయానికి హద్దుకొనేలా ఈ మూవీ ఉంటుంది. ఈ చిత్రాన్ని కిషోర్ గంజి తో కలిసి దర్శకుడు రాజ్ నిర్మించారు. ఇక ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం హైదరాబాద్ మెట్రోలోనే సాగింది. ఈ చిత్రాన్ని సుమారు రూ. 4 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. ఇక ఈ మూవీకి మార్క్ కే రాబిన్ సంగీతం అందించగా.. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ చేశారు. ఇక ఈ మూవీలో గుల్షన్, సాయామీ తో పాటు కల్పనిక గణేశ్, ఉమేష్ కామత్, నిమిషా నయర్, మధు స్వామినాథ కీలక పాత్రలు వహించారు.
మహారాష్ట్ర నుంచి గృహిణి ఐరావతి ( సాయామీ) హైదరాబాద్ కు వస్తుంది. చిన్నతనంలో తనకు ఎదురైనా భయానక ఘటన వల్ల ఆమె తరచూ ప్యానిక్ ఎటాక్ లకు గురవుతుంటారు. అందుకే రైలులో ఎక్కువగా ప్రయాణించరు. అయితే తన సోదరీ ప్రసారం కోసం ఐరావతి.. తన భర్త లేకుండానే ఒంటరిగా హైదరాబాద్ వస్తారు. ప్రతిరోజు మెట్రోలో వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో పానిక్ అవుతుంటుంది. అప్పుడే ఓ బ్యాంకులో ఉద్యోగిగా చేసే ప్రీతం (గుల్షన్) తో ఐరావతికి పరిచయం ఏర్పడుతుంది. ప్రతిరోజు వారు అదే ట్రైన్ లో కలిసి ప్రయాణిస్తూ ఉంటారు. అలా వారి మధ్య స్నేహం పెరుగుతుంది. ఒకరి గురించి మరొకటి తెలుసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి లైఫ్ లో ఎటువంటి కలహాలు వచ్చాయి? అనే కథాంశం తో ఈ మూవీ రూపొందింది.