హైదరాబాద్: చర్చల పేరుతో పిలిచి.. తమ సెల్ఫోన్లు లాక్కున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ చరిత్రలో ఇలాంటి నిర్బంధ చర్చలు ఎప్పుడూ చూడలేదని తెలిపారు. శనివారం యాజమాన్యంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈడీ సభ్యుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ఆర్ అండ్ బీ భవనంలో ఈ చర్చలు జరగ్గా… దీనికి ఆర్టీసీ జేఏసీ తరపున అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్ రావు, వాసుదేవరావులను మాత్రమే అనుమతించారు. ఆర్టీసీ యాజమాన్యం 21 డిమాండ్లపై చర్చలకు సిద్దం కాగా.. కార్మిక నేతలు మాత్రం మొత్తం 46 డిమాండ్లపై చర్చలు జరపాలని పట్టుబడ్డారు. నేతల డిమాండ్లను ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఇక ఈ సమావేశాన్ని మొత్తం వీడియో తీసిన ప్రభుత్వం.. ఆ సీడీని కోర్టుకు సమర్పించనుంది.
ప్రభుత్వం కేవలం కోర్టుకు జవాబు చెప్పాలి కాబట్టి కంటితుడుపు చర్యగా చర్చలకు వచ్చింది తప్పితే.. చర్చల పరిష్కారంపై చిత్తశుద్దితో ముందుకొచ్చినట్టు కనిపించలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. నిర్బంధం మధ్యలో తమను చర్చలకు పిలిచారని.. లోపలికి వెళ్లగానే సెల్ఫోన్లు లాక్కున్నారని ఆరోపించారు. తమ ఫోన్లు తీసుకోవడానికే వాళ్లకు అరగంట సమయం పట్టిందని, డిమాండ్లపై అసలు చర్చించనే లేదని తెలిపారు. ఆర్టీసీ జేఏసీ తరుపున కనీసం ఎనిమిది మందిని లోపలికి అనుమతించాలని కోరినా.. అందుకు ఒప్పుకోలేదన్నారు. తెలంగాణ మజ్దూర్ ఇచ్చిన 46 డిమాండ్లు లేదా జేఏసీ ఇచ్చిన 26 డిమాండ్లపై చర్చలు జరపాలని తాము కోరామని.. కానీ అధికారులు మాత్రం కేవలం 21 డిమాండ్లపై చర్చించాలని హైకోర్టు సూచించిందని వాదిస్తున్నారని చెప్పారు. హైకోర్టు సూచనలకు ఆర్టీసీ అధికారులు వక్రభాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేజీ నం.7,8వ పేజీల్లో తెలిపినట్టుగా 26 డిమాండ్లపై చర్చించాలని తాము పట్టుబట్టామని తెలిపారు. సాధ్యాసాధ్యాల సంగతి పక్కనపెట్టి.. కనీసం చర్చలు జరపాలని కోరినా వినిపించుకోలేదన్నారు. ప్రభుత్వం పునరాలోచించుకుని అన్ని డిమాండ్లపై చర్చలకు పిలిస్తే ఎప్పుడు పిలిచినా చర్చలకు వచ్చేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. చర్చలు విఫలం కావడంతో సమ్మె యథావిధిగా కొనసాగుతుందని.. డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
ఆర్టీసీ సమస్యలపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈడీలతో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ ఆధ్యయనం చేసి తమ నివేదికను సంస్థ ఇన్ఛార్జి ఎండీ సునీల్ శర్మకు శుక్రవారం ఉదయం సమర్పించింది. దాన్ని ఆయన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు అందజేశారు. ఆయన సీఎం కేసీఆర్కు సమర్పించగా.. ప్రగతి భవన్లో శుక్రవారం సాయంత్రం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈడీల కమిటీ నివేదిక, హైకోర్టు ఉత్తర్వులు, ఆర్టీసీ సమ్మె పర్యావసనాలు తదితర అంశాలపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టీసీ విలీనం ప్రస్తావన లేకుండా ఆర్థిక భారంలేని అంశాలపై సంఘాలతో చర్చలు జరపాలని అధికారులకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు పలు సమస్యలపై కార్మికులు అక్టోబర్ 5వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా గత 22 రోజులుగా రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు చర్చలు ఫలించి బస్సులు రోడ్డెక్కుతాయానని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగనుంది.
This post was last modified on October 27, 2019 10:48 am
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More