తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించబోయే బహిరంగ సభకు అమిత్ షా విచ్చేశారు. మీటింగ్ కోసం అమిత్ షా రావడం ముందే ఖరారు అయ్యింది. అది ఆయన షెడ్యుల్ లో అప్పటికప్పుడు మారుతోంది. వాస్తవానికి అమిత్ షా నేరుగా మునుగోడు వచ్చి అక్కడ నుండి వెళ్లిపోవాలి. కానీ..ఆయన షెడ్యుల్ మార్చారు. ఆయన హైదరాబాద్ లో దిగి ఆయన మహాంకాళి ఆలయాన్ని దర్శించుకుని తరువాత రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి అక్కడ రామోజీని కలిసి, ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి అప్పుడు మునుగోడు వెళ్లడం, లేదా ముందుగా మునుగోడు వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొని రోడ్డు మార్గం ద్వారా హైదారాబాద్ వచ్చి రామోజీని కలిసి ఆ తరువాత ఎన్టీఆర్ తో డిన్నర్ మీటింగ్ తరువాత ఢిల్లీకి వెళ్లడం. ఇలా షెడ్యుల్ మారుతూ వచ్చింది. ఎన్ని షెడ్యుల్ లు మారినా అమిత్ షా – రామోజీ భేటీ మాత్రం ఖాయం. అలానే అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీ కూడా కన్ఫర్మ్. ఈ రాత్రి ఈ ఇద్దరు ప్రముఖులతో అమిత్ షా భేటీ అవుతారు. అయితే అమిత్ షా అర్జంట్ గా వీరిద్దరితో కలవాల్సిన అవసరం ఏమిటి..? నరేంద్ర మోడీ ఒక దూతగా ఏమైనా పంపించారా..? అసలు ఏమి జరగబోతున్నది..? అని తెలుసుకోవాలంటే…
ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలు, బీజేపీ అవసరాలు, టీడీపీ అవసరాలు, టీఆర్ఎస్ పరిస్థితి, బీజేపీ ప్రణాళికలు అందరికీ తెలుసు. ప్రస్తుత బీజేపీ లక్ష్యం తెలంగాణలో అధికారంలోకి రావాలి. ఏపిలో వాళ్లు అనుకున్న ప్రభుత్వం ఉండాలి.మొదట తెలంగాణలో అధికారంలోకి రావాలి అంటే చిన్న చిన్న వర్గాలను కలుపుకుని వెళ్లాలి. టీడీపీ లాంటి పార్టీని కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 40కిపైగా స్థానాలు గెలిచారు అంటే హైదరాబాద్ లో సెటిలర్స్ ఓట్లు పడటమే కారణం. సెటిలర్స్ అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్ధులు గెలిచారు. సెటిలర్స్ బలం ఏమిటి అనేది బీజేపీకి తెలిసింది. టీడీపీ ఓటింగ్ బలం ఖమ్మం, హైదరాబాద్.తదితర నియోజకవర్గాల్లో ఉంది కాబట్టి టీడీపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి ఉన్న కొద్ది బలం ద్వారా అదనపు సీట్లు సాధించవచ్చు అనే భావన ఉంది. బీజేపీకి ఉన్న బలంతో టీడీపికి ఉన్న 10 – 12 శాతం ఓటింగ్ కలిస్తే కొన్ని స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉంటాయి. అందుకోసం టీడీపీని కలుపుకుపోవడానికి బీజేపీ వెళుతోంది. ఇదే సమయంలో తెలంగాణలో సపోర్టు ఇవ్వాలంటే ఏపిలో సపోర్టు ఇవ్వాలనే లెక్క కూడా ఉంటుంది. సో .. ఆ లెక్కలను సరిచేయడానికి, ఆ విషయాలు మాట్లాడటానికి రామోజీ తో భేటీ. అంతకు మించి వేరే ఏమీ ఉండదు. జరుగుతున్న పరిణామాలు చూస్తే రాజకీయ విశ్లేషకులు అందరికీ ఇది స్పష్టంగా తెలుస్తుంది.
ఇక జూనియర్ ఎన్టీఆర్ భేటీ విషయానికి వస్తే .. ఇది కూడా తెలంగాణలో సెటిలర్స్ ఓట్ల కోసమే. ఆయన క్రేజ్ వాడుకోవాలన్నది బీజేపీ ప్రయత్నం. ఇప్పటికే తమిళనాడులో రజనీకాంత్ కు గవర్నర్ పదవి ఇస్తామని బీజేపీ ఎర వేసింది. ప్రధాన పత్రికల్లో దీనికి సంబంధించి వార్తలు వచ్చాయి. అయితే రజనీకాంత్ గవర్నర్ పదవి తీసుకుంటారు అనేది అనుమానమే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఏదో పదవి ఇస్తారు అనేది కాదు, అంతర్గతంగా సపోర్టు కోరడం కోసమే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా యాక్టివ్ గా ఏమి లేరు. ఆయన బీజేపీ తరపున ఏమీ ప్రచారం చేయరు. అంతర్గతంగా ఆయనతో మాట్లాడటం ద్వారా ఆయనకు ఉన్న సినీ చరిష్మాను వాడుకోవాలని బీజేపీ చూస్తొంది. తెలంగాణలో పొత్తుల విషయంలో కొంత మార్పులు ఉండవచ్చు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటన బాగుంది కాబట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆయనతో సన్నిహితంగా ఉండటం వల్ల ఆయన ఫ్యాన్స్ ను బీజేపీ పట్ల ఆకర్షితులు కావచ్చేమో అన్న ఆలోచన కూడా ఉంది. ఈ మూడు నాలుగు అంశాల మేరకు అమిత్ షా .. రామోజీ, జూనియర్ లతో భేటీ జరుగుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వారితో అమిత్ షా భేటీ తరువాత కొంత వరకూ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. ఉదయం నుంచి ఇప్పటివరకు ఓటర్లు ఎన్నడూ లేని… Read More
ఇటీవల సినీ పరిశ్రమలో విడాకుల వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. నాగచైతన్య - సమంత, ధనుష్… Read More
Karthika Deepam 2 May 14th 2024 Episode: నరసింహ జరిగిన అవమానం తెలుసుకుని రగిలిపోతూ ఉంటాడు. అక్కడ దాన్ని… Read More
Krishna Mukunda murari:మురారి కృష్ణ కి నిజం చెప్పడంతో, కృష్ణా మురారి మీద కోప్పడుతూ ఉంటుంది. మీరు నా దగ్గర… Read More
Nuvvu Nenu prema:మురళీకృష్ణ పథకం ప్రకారం విక్కి వాళ్ళ ఆస్తి మొత్తం కాజేసీ విక్కీ వాళ్ళ నడిరోడ్డు మీదకు తీసుకువస్తాడు.… Read More
BrahmaMudi:అనామిక కళ్యాణ్ ని తన వల లో వేసుకోవడానికి, కళ్యాణ్ చేతిని తీసుకొని ముద్దు పెట్టుకోబోతుంది ఏం చేస్తున్నావ్ అని… Read More
May 14: Daily Horoscope in Telugu మే 14 – వైశాఖ మాసం – మంగళవారం - రోజు… Read More
Election 2024: హింసాత్మక ఘటనల మధ్య తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ,… Read More
Sridevi Drama Company: జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఎన్నో కార్యక్రమాలలో పామిడి తరహా ఎంటర్టైన్మెంట్… Read More
Ashika Gopal: ప్రస్తుత కాలంలో ఇంస్టాగ్రామ్ స్రీల్స్ చేసేవాళ్లు యూట్యూబ్ వంటి ఇతర సోషల్ మీడియా ఎకౌంట్లో కూడా యాక్టివ్… Read More
Janaki kalaganaledu: సీరియల్ యాక్టర్ విష్ణు ప్రియా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మొదటిగా సినిమాలతో తన కెరీర్… Read More
Pavitra Jayaram: త్రినయని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచమయ్యి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఈ బ్యూటీ దూసుకుపోతుంది.… Read More
Trinayani: ప్రెసెంట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక మరణాన్ని జీర్ణించుకునే లోపే మరొక మరణంతో… Read More
Sirisha: సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు మరియు రీల్స్ చేస్తూ ఎంతోమంది నటీనటులు వెలుగులోకి వచ్చారు. వారిలో బర్రెలక్క… Read More
Video Viral: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద… Read More