వారణాసి: తమ సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో గళాన్ని వినిపించదలచిన నిజామాబాద్ రైతులు మరో సారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధపడ్డారు.
ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సామూహికంగా నామినేషన్ దాఖలు చేసిన రైతులు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోది బరిలో నిలిచిన వారణాసి లోక్సభ స్థానంపై దృష్టిసారించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు రైతులు వారణాసి చేరుకున్నారు.
శనివారం వారణాసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్లు వేయాలని భావించారు. అయితే అక్కడి ప్రభుత్వ అధికారులు, పోలీసులు మాత్రం వీరిని అడుగడుగునా అడ్డుకుంటున్నారు.
స్థానిక బిజెపి నేతలు తెలంగాణ రైతులకు స్థానికంగా నామినీలు దొరకకుండా చేశారు. రైతులకు మద్దతు ఇచ్చే స్థానికులను బిజెపి నేతలు బెదిరిస్తున్నారని రైతు నాయకుడు నర్సింహనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ, తమిళనాడు రైతులను ఉత్తరప్రదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులు నీడలా వెంటాడుతున్నారు. మీరంతా ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయాల్సిన అవసరం ఏంటి? మీరంతా రైతులా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని రైతు నేత నర్సింహనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
తాము వారణాసికి వచ్చినా అన్నాడిఎంకే ప్రభుత్వం తమిళనాడు నుంచి బయలుదేరిన ఆరుగురు రైతు నేతలను అరెస్ట్ చేసిందని అన్నారు. అయినా వారంతా ఈరోజు సాయంత్రానికల్లా వారణాసికి చేరుకుంటారని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రధాని మోదిపై పోటీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. సోమవారం నామినేషన్ వేస్తామని వెల్లడించారు.
తమ సమస్యని ప్రధాని దృష్టికి తీసుకువెళదామని అనుకున్నామే తప్ప ఎవరికో మద్దతుగానో, వ్యతిరేకంగానో ప్రచారం చేయమని ముందే ప్రకటించాం. అయినా ఇబ్బందులు పెట్టి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని నర్సింహనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధరలను పెంచాలని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని రైతులు గత కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ, పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరిలో రహదారులపై బైఠాయించారు. రోడ్లను దిగ్బంధం చేశారు. వంటావార్పు చేపట్టారు. చలో అసెంబ్లీకి పిలుపునిస్తే పోలీసులు అడ్డుకొన్నారు.
ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవటంతో తొలి విడత ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ స్థానానికి మూకుమ్మడి నామినేషన్లు దాఖలు చేసి నిరసన తెలియజేశారు. మొత్తంగా 185 మంది రైతులు బరిలో నిలవడం సర్వత్రా చర్చనీయాంశమైనది. ఇదే విధంగా వారణాసి బరిలోనూ 50మంది రైతులు నామినేషన్లు దాఖలు చేసి నిరసన తెలియజేయని రైతులు నిర్ణయించుకున్నారు.
This post was last modified on April 27, 2019 4:01 pm
April 28: Daily Horoscope in Telugu ఏప్రిల్ 28 – చైత్ర మాసం – ఆదివారం - రోజు… Read More
Prabhas: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి బిగ్ అప్డేడేట్… Read More
Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింగ్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్… Read More
AP Elections 2024: ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్… Read More
Family Star OTT Response: భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్… Read More
Best Movies In OTT: ప్రతివారం సరికొత్త మరియు క్రేజీ కంటెంట్ తో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో… Read More
Dead Boy Detectives OTT: ఓటీటీలలో అనేక రకమైన కథనాలు మరియు విభేదమైన జోనర్స్.. కాన్సెప్ట్లతో సినిమాలు మరియు వెబ్… Read More
Aquaman 2 OTT: హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్… Read More
Hanuman Telugu Telecast TRP: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన బ్లాక్ బస్టర్… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలకు గానూ మహారాష్ట్రలో మరో అభ్యర్ధిని బీజేపీ ప్రకటించింది. ముంబయి నార్త్… Read More
YSRCP: కాకినాడ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తలిగింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా సీనియర్ నాయకుడు యనమల… Read More
Nani: నాచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ కి పరిచయం అవసరంలేని పేరు. నాచురల్ యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించిన… Read More
Manasichi Choodu: బిగ్ బాస్ ముద్దుగుమ్మ కీర్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిగా ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో నటించి… Read More
Allu Arjun: అల్లు అర్జున్.. పరిచయం అవసరంలేని పేరు. ఇండస్ట్రీ ఏదైనా మొత్తం నాదే హవా అంటూ దూసుకుపోతున్నాడు బన్నీ.… Read More
Sree Sinha: చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రముఖ మ్యూజిక్… Read More