Manasichi Choodu: బిగ్ బాస్ ముద్దుగుమ్మ కీర్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిగా ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది. బుల్లితెరపై తన యాక్టింగ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ మనసులను గలుచుకుంది. ఇక బిగ్ బాస్ కి వెళ్లిన తరువాత తన ఆట తీరుతో అభిమానులను సొంతం చేసుకుంది కీర్తి. అయితే ఆమె జీవితంలో ఎన్నో విషాదాలు నెలకొన్నాయి. తల్లిదండ్రులను కళ్ళ ముందే కోల్పోయింది కీర్తి. ఇలా ఒకటి కాదు ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్ కి ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు చాలా హ్యాపీగా తన లైఫ్ను లీడ్ చేస్తుంది. కాఫీ విత్ శోభ ప్రోగ్రాం కి వచ్చిన ఈమె చాలా విషయాలు పంచుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్లో తెగ వైరల్ అవుతుంది. ఓ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారమవుతున్న కాఫీ విత్ శోభా అనే కార్యక్రమంలో కేవలం బిగ్ బాస్ కంటెస్టెంట్లు మాత్రమే హాజరవుతున్నారు. దీనికి శోభా శెట్టి హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఇక తాజా ఎపిసోడ్లో కీర్తి బట్ అండ్ ఆమెకి కాబోయే భర్త కార్తీక్ పాల్గొన్నారు.
ఇద్దరూ కలిసి ఒకరి గురించి ఒకరు చాలా విషయాలు పంచుకున్నట్లుగా ఈ ప్రోమో ద్వారా తెలుస్తుంది. ఎలా ఉన్నావు? ఏం నడుస్తుంది లైఫ్ లో అని శోభా అడిగిన ప్రశ్నకి కీర్తి చాలా హ్యాపీగా ఆన్సర్ ఇచ్చింది. ” ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నా లైఫ్ లోకి కొత్త మెంబర్ వచ్చారు కాబట్టి. ఎంగేజ్మెంట్ అయ్యాక చాలా రోజులు గ్యాప్ తీసుకుంది ఎందుకంటే.. ఇద్దరినీ అర్థం చేసుకుని నెగిటివ్స్ ఏమైనా ఉంటే వదిలేద్దాం ” అని అంటూ నవ్వుతూ తెలిపింది కీర్తి. తమ మధ్య చాలా గొడవలు పెట్టేందుకు చూశారని.. అదేవిధంగా విడగొట్టేందుకు కూడా ప్రయత్నించారని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.
ఈ సందర్భంగానే కీర్తి హస్బెండ్ కార్తీక్ మాట్లాడుతూ.. ” కీర్తి చాలా మూడ్ స్వింగ్స్ ఉన్న అమ్మాయి. ఎప్పుడు కోపంగా ఉంటుందో ఎప్పుడు నవ్వుతుందో తెలియదు. ఇక 2016లో ప్రోఫైల్ పంపించిన మీరు మెయిన్ లీడ్ చేయాలని చెప్పి మెసేజ్ చేశాను. మూడు నెలల తరువాత రిప్లై ఇచ్చింది. అప్పటికి మా షెడ్యూల్ కూడా అయిపోయింది. కీర్తి ఆర్గానిక్ ఐటమ్స్ బాగా చేస్తుంది. ఉప్మా లో ఎప్పుడైనా వేరుశనగపప్పు వేరుకుంటాం. కానీ నేను ఉప్మా వేరుకోవాలి. కీర్తి నా లైఫ్ లోకి రావడం చాలా అదృష్టం. నేను చాలా లక్కీ. మీకు కూడా అలాంటి అమ్మాయి దొరికితే ఖచ్చితంగా వదులుకోవద్దు ” అంటూ చెప్పుకొచ్చాడు కార్తీక్.
ఇక తర్వాత నీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని చెప్పమని దీప అనగా..” కుటుంబ సభ్యులకు యాక్సిడెంట్ అయిన తర్వాత మంగళూరుకు తీసుకెళ్లారు. అక్కడే 35 రోజులు ఉండాల్సి వచ్చింది. అక్కడ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. నన్ను ఎక్కడెక్కడో టచ్ చేశారు. బాడీ లో స్పర్శ లేదు. తెలుస్తుంది కానీ చేతులతో నెట్ వేయడానికి కూడా చేతకాలేదు. ఇక నయమైన తర్వాత.. అక్కడ నుంచి బయటికి వచ్చేసాను. ఎటైనా వెళ్లాలంటే డబ్బులు కావాలి. ఏమి తెలీదు అప్పుడు. 200 రూపాయలకు వస్తావా? అంటే సరే అన్న వస్తాను అనేదాన్ని. తర్వాత వాళ్ళ లుక్ చూసి అర్థమైంది ” అంటూ చెప్పుకొచ్చింది కీర్తి. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!