YSRCP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ సారి ఎన్నికల్లోనూ మంగళగిరిలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత రెండు సార్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్ధులు గెలిచారు. 1983, 85 లో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గెలిచారు. ఆ తర్వాత 1989, 1999, 2004,2009 లో కాంగ్రెస్ అభ్యర్ధులు, మధ్యలో 1994లో ఒక్క సారి సీపీఐ, 2014,2019లో వరుసగా వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధులు గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 5,337 ఓట్ల తేడాతో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో నారా లోకేష్ పరాజయం పాలైయ్యారు.
రాబోయే ఎన్నికల్లోనూ లోకేష్ ఇక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమైయ్యారు. అయితే లోకేష్ ను ఈ సారి కూడా ఓడించేందుకు వైసీపీ హైకమాండ్ వ్యూహాన్ని సిద్దం చేసుకుంది. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించి మంగళగిరి ఇన్ చార్జిగా బీసీ (చేనేత) సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవిని నియమించింది వైసీపీ. ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది.
దీంతో మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్ధుల మధ్య త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంది. దీంతో లోకేష్, ఆర్కే కు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ఇన్ చార్జి బాధ్యతలను పార్టీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని రంగంలోకి దింపినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. వైసీపీ అభ్యర్ధి గంజి చిరంజీవి గెలుపునకు విజయసాయి రెడ్డి వ్యూహాలు బాగా పని చేస్తాయని సీఎం జగన్ విశ్వసిస్తున్నారుట.
ఇప్పటికే మంగళగిరి బాధ్యతలు చేపట్టిన విజయసాయి రెడ్డి .. జరగబోయే ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్ధి గంజి చిరంజీవి తప్పక విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 31వ తేదీ మంగళగిరిలో వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లను స్థానిక నేతలతో కలిసి పరిశీలించిన విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గంలో గతంలో టీడీపీ గెలిచిన దాఖలాలు లేవని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ నారా లోకేష్ ఓటమి తథ్యమని అన్నారు.
వైసీపీ నుండి వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోటీలో నిలబడుతున్నారని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు వైఎస్ జగన్ ఇస్తున్న ప్రాధాన్యత దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఏ పార్టీ ఇవ్వడం లేదని అన్నారు. నియోజకవర్గంలో బీసీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు వైసీపీ అభ్యర్ధిని గెలిపించుకుంటారని, అలానే రాబోయే ఎన్నికల్లో ఆయా వర్గాల ప్రజలు వైఎస్ జగన్ ను మరో మారు ముఖ్యమంత్రిని చేస్తారని నమ్మకంగా చెప్పారు.
మరో పక్క రెండు సార్లు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ సారి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలవనుండటంతో మంగళగిరి పోరు రసవత్తరంగా మారనుంది. ఓ పక్క వైసీపీకి, మరో పక్క టీడీపీకి మంగళగిరి నియోజకవర్గం ప్రతిష్టాత్మకంగా మారుతోంది. సీఎం వైఎస్ జగన్ నివాసం ఈ నియోజకవర్గ పరిధిలో ఉండటంతో వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మరో పక్క లోకేష్ ఈ సారి గెలవకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుంది. రాబోయే రోజుల్లో మూడు పార్టీల వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి షాకిచ్చిన అస్సాం సర్కార్ .. రాహుల్ సహా కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More