(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని తరలింపు వ్యవహారం సచివాలయ ఉద్యోగుల్లోనూ తీవ్ర కలకలాన్ని రేపుతోంది. సిఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుండి అమరావతి ప్రాంతంలోని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తుండగా వందలాది మంది సచివాలయ ఉద్యోగులు కూడా మానసికంగా ఆందోళన చెందుతున్నారు. అమరావతి రైతులకంటే తమ పరిస్థితి మరింత దారుణంగా ఉందని పలువురు సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిఎం మూడు రాజదానుల ప్రకటనకు తగిన విధంగానే జిఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టర్ రిపోర్టులు రావడంతో విశాఖపట్నానికి సచివాలయం తరలింపు లాంఛనమే అని తేలిపోతున్నది. ఈ రెండు కమిటీల నివేదికలను అధ్యయనం చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నేతృత్వంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ కూడా జగన్మోహనరెడ్డి ఆలోచనకు తగిన విధంగానే నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నందున పలువురు ఉన్నతాధికారులు విశాఖలో పరిపాలనా భవనాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఇప్పటి నుండి పరిశీలన కూడా ప్రారంభించారు. హైపవర్ కమిటీ నివేదిక అందిన వెంటనే మంత్రివర్గంలో దాన్ని ఆమోదించి ఆ వెంటనే అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.
రాజధాని తరలింపుపై ప్రసారమాధ్యమాల్లో వస్తున్న వార్తలు సచివాలయ ఉద్యోగులను కలవరపరుస్తున్నాయి. ఏపి సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వద్ద పలువురు ఉద్యోగులు తమ ఇబ్బందులను వివరించారు. రాజధాని తరలింపు అంశానికి సంబంధించి అసలేమి జరుగుతుందో తెలియజేయాలని వారు కోరగా ప్రభుత్వం నుండి ఎలాంటి సమాచారం లేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు.
‘అమరావతే రాజధాని అనుకొని ఊళ్లల్లో పొలాలు, ఇళ్లు అమ్మేసి రుణాలు తీసుకుని ప్లాట్లు కొనుగోలు చేసుకున్నాం, ఇప్పుడు వాటిని అద్దెకు ఎవరు తీసుకుంటారు ? నెలనెల వాయిదాలు ఎలా కట్టాలి? విశాఖ వెళ్లి అద్దెకు తీసుకోవాలంటే ఎంత చెల్లించాలి? అంత భరించగలమా? పిల్లల చదువులు ఎలా?’ అని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇప్పుడు విశాఖపట్నం అంటున్నారు. రాజధాని అక్కడే ఉంచేస్తారా? మళ్లీ అయిదేళ్ల తరువాత అమరావతి రావాలా? ఇంకోకాయన వచ్చి కర్నూలు అంటారు, మేం పోవాలా? రైతులైతే రోడ్డు మీద కూర్చుంటారు. మేము బయటకు వచ్చి గట్టిగా మాట్లాడలేం, లోలోపల ఏడుస్తున్నామనీ అంటున్నారు. ఇప్పటికిప్పుడు విశాఖ వెళ్లమంటే తాము వెళ్లే పరిస్థితిలో లేమని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎలాగూ వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి విద్యాసంవత్సరం పూర్తి అయ్యే వరకూ సమయం కోరతామని పలువురు ఉద్యోగులు అంటున్నారు.
This post was last modified on January 8, 2020 4:47 pm
Election 2024: హింసాత్మక ఘటనల మధ్య తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ,… Read More
Sridevi Drama Company: జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఎన్నో కార్యక్రమాలలో పామిడి తరహా ఎంటర్టైన్మెంట్… Read More
Ashika Gopal: ప్రస్తుత కాలంలో ఇంస్టాగ్రామ్ స్రీల్స్ చేసేవాళ్లు యూట్యూబ్ వంటి ఇతర సోషల్ మీడియా ఎకౌంట్లో కూడా యాక్టివ్… Read More
Janaki kalaganaledu: సీరియల్ యాక్టర్ విష్ణు ప్రియా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మొదటిగా సినిమాలతో తన కెరీర్… Read More
Pavitra Jayaram: త్రినయని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచమయ్యి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఈ బ్యూటీ దూసుకుపోతుంది.… Read More
Trinayani: ప్రెసెంట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక మరణాన్ని జీర్ణించుకునే లోపే మరొక మరణంతో… Read More
Sirisha: సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు మరియు రీల్స్ చేస్తూ ఎంతోమంది నటీనటులు వెలుగులోకి వచ్చారు. వారిలో బర్రెలక్క… Read More
Video Viral: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభించారు అధికారులు.… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు క్యూ లైన్ లో… Read More
Supreme Court: లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం… Read More
Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ దర్శకుడు… Read More
Sreemukhi: టాలీవుడ్ లో ఉన్న ఫిమేల్ స్టార్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకటి. సూపర్ సింగర్ 9 అనే కార్యక్రమం… Read More
Daggubati Lakshmi: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చందు… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల పండుగకు కౌంట్ డౌన్ షురూ అయింది. గత రెండు నెలలుగా ఏపీ లో అన్ని రాజకీయ… Read More