(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతే ఏపి శాశ్వత రాజధానిగా ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆయిదు కోట్ల మంది ప్రజలకు, రాజధాని ప్రాంత రైతులకు ఈ విషయంపై స్పష్టమైన మాట ఇస్తున్నానని అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర బిజెపి నేతలతో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. అనంతరం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాజధాని అమరావతి నుండి తరలివెళ్లకుండా జనసేన, బిజెపి నేతృత్వంలో బలమైన కార్యాచరణ ప్రకటిస్తామనీ, ఎలా ముందుకు వెళతామనే విషయాన్ని తెలియజేస్తామన్నారు. రాజధాని తరలింపు అంత ఈజీ కాదని అన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన భేటీలో అమరావతి అంశంతో పాటు అనేక విషయాలపై చర్చించామన్నారు. అమరావతిలో మహిళపై జరిగిన దాడుల విషయం కూడా చర్చకు వచ్చిందన్నారు. మూడు రాజధానుల ఏర్పాటుకు కేంద్రం సమ్మతి లేదని స్పష్టం చేశారు. వైసిపి నాయకులు కేంద్రానికి చెప్పి చేస్తున్నామని చెబుతున్న మాటలు అబద్దాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత ప్రణాళికతో పాలన కొనసాగించాలనీ, లేకుండా మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తాయనీ పవన్ హెచ్చరించారు.
కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో రాష్ట్ర రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం మాదిరిగానే వైసిపి ప్రభుత్వం పని చేస్తుందని కన్నా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అందిస్తున్నా ఈ ప్రభుత్వం రాజకీయం మీద శ్రద్ద చూపిస్తూ పరిపాలన పట్టించుకోవడం లేదని విమర్శించారు. చెన్నై, విశాఖపట్నం కారిడార్ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. రాజకీయమే ప్రధాన అంశంగా వైసిపి ప్రభుత్వం పని చేస్తున్నదని విమర్శించారు. సాయంత్రం జరిగే జనసేన, బిజెపి కూటమి సమావేశంలో రాజధాని తదితర సమస్యలపై కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు, రాష్ట్ర ఇన్చార్జి సునీల్ ధియోధర్, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందీశ్వరి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
This post was last modified on January 22, 2020 6:02 pm
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More
90's Middle Class Biopic: ప్రస్తుత కాలంలో కొంచెం పాపులారిటీ దక్కితే చాలు తమ అందాన్ని మరింత పెంచుతూ సోషల్… Read More
Neethone Dance: బిగ్బాస్ ఫాన్స్ కి వారానికి రెండుసార్లు ఫుల్ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నీతోనే డాన్స్ 2.0 కార్యక్రమాన్ని నిర్మించిన… Read More
Russia: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా… Read More
Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ప్రముఖ వ్యాపారవేత్త మరియు… Read More
Karthika Deepam 2 May 9th 2024 Episode: దీప తీయకపోయినప్పటికీ పిల్లతో ఆ పని చేయించి ఉండవచ్చు కదా… Read More
Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More
Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More
Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More