అనేక సంవత్సరాల లెక్కలను పరిగణనలోకి తీసుకొని చూస్తే సీమ నుండి వందల టిఎంసిల నీరు క్రిందకు వెళుతుంది. కృష్ణలో నీరు తగ్గిన సమయంలో కూడా తుంగభద్ర , కుందు ఉపనదులు పుష్కలంగా నీటిని తీసుకు వస్తున్నాయి. నేడు నెల్లూరు జిల్లాలోని సోమశిలకు 75 టిఎంసిలు, కండలేరుకు 25 టిఎంసిల నీరు చేరింది కేవలం కర్నూలు, కడప జిల్లాలలోని కుందు , చెయ్యేరు నదులు తెచ్చిన వరద నీరు మాత్రమే. సమస్యకు కారణం ఆ నీటిని రాయలసీమలో నిల్వ చేసుకునే ప్రాజెక్టుల నిర్మాణం చేయకపోవడమే.
ఆగస్టు నెల నుండి నేటి వరకు దాదాపు 70 రోజులుగా విడతల వారిగా వరద వచ్చింది. ఆరు సార్లు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజి నిండి వందల టిఎంసిలు సముద్రంలో కలిసింది. కానీ రాయలసీమలో మాత్రం కేవలం 48 టిఎంసిల నీరు మాత్రమే చేరింది. నాలుగు రాయలసీమ జిల్లాల్లో చిన్నా పెద్దా ప్రాజెక్టుల సామర్థ్యం 115 టిఎంసిలు. వాటిలో చేరిన నీరు మాత్రం 48 టిఎంసిలు. సీమ ప్రాజెక్టులకు నీరు అందాలంటే పోతిరెడ్డిపాడు , మాల్యాల, ముచ్చిమర్రి నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడానికి అవకాశం ఉంది. అక్కడ నుంచి బనకచర్ల వరకు ఉన్న 12 కిలో మీటర్ల కాలవ నిర్మాణం నీటిని అందుకునే స్థాయిలో చేయలేదు. బనకచర్ల నుంచి సీమ ప్రాజెక్టులకు నీటి సరఫరా చేయాల్సిన మూడు పాయల నిర్మాణ సామర్థ్యం వరుసగా 15,12,8 వేల క్యూసెక్కులు. అంటే 2.5 టిఎంసిల నీరు మాత్రమే. ఇక మిగిలింది మాల్యాల , ముచ్చిమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి అర టిఎంసి మాత్రమే నీటిని సరఫరా చేయగలం. మొత్తంగా రోజుకు మూడు టిఎంసిల నీరు విడుదల చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. నేడు నెల్లూరు, రాయలసీమలో కలిపి దాదాపు 150 టిఎంసిల నీరు నిల్వ చేశారు. మరో 50 టిఎంసిల నీటి నిల్వకు అవకాశం ఉన్నా చేయలేకపోయారు.
శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని వరదల సమయంలో త్వరితగతిన డ్రా చేయడానికి వీలుగా పోతిరెడ్డిపాడు వెడల్పును లక్ష క్యూసెక్కులకు పెంచి దానికి అనుగుణంగా బనకచర్ల కాల్వ , అక్కడి నుంచి మూడు పాయలుగా ఉన్న కాల్వల సామర్ధ్యాన్ని కూడా తగిన స్థాయిలో పెంచాలి. కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గిన సమయంలో కూడా పుష్కలంగా నీటిని తీసుకువస్తున్న తుంగభద్ర, కుందు నీటిని నిల్వ చేసుకోవడానికి అనువుగా హెచ్ఎల్సికి సమాంతర కాల్వ, గుండ్రేవుల నిర్మాణం పూర్తి చేయాలి. కుందు నదిపై రాజోలు , జోలదరాసి, ఆదినిమ్మాయని బ్యారేజిల నిర్మాణం చేయాలి. రాయలసీమలోని కుందు , చెయ్యేరు నీటితో సోమశిల నిండి సముద్రం పాలు అవుతున్నా రాయలసీమలోని చిత్తూరు జిల్లాకు ఉపయోగపడే కండలేరుకు నీరు అందని పరిస్థితిని అధిగమించడానికి సోమశిల – కండలేరు కాల్వ సామర్ధ్యాన్ని 12 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచాలి.
గోదావరి నీటిని శ్రీశైలంలో నింపి రాయలసీమ నీటి సమస్యను పరిష్కరించాలనుకుంటున్న ప్రభుత్వం నేడు శ్రీశైలం ప్రాజెక్టులో 70 రోజులుగా నీరు నిండుగా ఉన్నా సీమ ప్రాజెక్టులకు నీరు అందకపోవడానికి గల కారణాలపై దృష్టి పెట్టాలి. వరద నీటిని త్వరితగతిన ఉపయోగించుకునే ప్రాధమిక ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. అలా కాని పక్షంలో నేడు శ్రీశైలం నీటిని వాడుకోలేని రాయలసీమ రేపు గోదావరి నీటితో శ్రీశైలం నింపినా అందుకు భిన్నమైన పరిస్థితులు ఉండవు.
-రాయలసీమ జలసాధన సమితి
This post was last modified on October 20, 2019 2:38 pm
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More
Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More
Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న… Read More
Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More
AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More
Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More